translateexpand_more

Vaibhav Sooryavanshi News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 04:11 pm
ఇంగ్లండ్ టూర్ కు వైభవ్ సూర్యవంశీ? సంకేతాలు పంపిన బీసీసీఐ కార్యదర్శి

ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. రాబోయే వైట్-బాల్ పర్యటన కోసం అతడిని జాతీయ జట్టులోకి వేగంగా తీసుకురావాలని సెలక్టర్లకు బీసీసీఐ పరోక్షంగా సూచించింది. వైభవ్ ప్రతిభను 'అసాధారణం' అని అభివర్ణించిన బోర్డు, అతని విషయంలో ఏది అవసరమో అది చేయాలని సెలక్టర్లకు స్పష్టం చేసింది.రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 16 మ్యాచ్‌లలో 237.31 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో అత్యధికంగా 72 సిక్సర్లు కొట్టడంతో పాటు 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కూడా గెలుచుకున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్ శైలితో, అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ విషయంపై జాతీయ మీడియాతో మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, వైభవ్‌పై ప్రశంసలు కురిపించారు. "వైభవ్ అద్భుతమైన ఆటగాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక సమావేశాల్లో, సెలక్టర్లు అతని ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, అతనికి ఏది మంచిదో అదే చేస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. వైభవ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బీసీసీఐ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు.ఈ నెలాఖరులో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో

TV9 Telugu02 Jun, 01:31 pm
సచిన్, కోహ్లీల రికార్డులు అవుట్.. 15 ఏళ్లకే బ్లాంక్ చెక్కులు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ బుడ్డోడు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తరఫున ఆడిన వైభవ్.. తన బ్యాటింగ్ విశ్వరూపంతో క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో మేజర్ అవార్డులన్నింటినీ ఇతడే క్లీన్ స్వీప్ చేశాడు. దాంతో రాత్రికి రాత్రే ఈ బిహార్ కుర్రాడి బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం పక్కకు నెట్టి కార్పొరేట్ కంపెనీలు ఈయన వెనుక పరుగులు పెడుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో రన్నరప్ రేసులో రాజస్థాన్ క్వాలిఫైయర్-2 లో ఓడిపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఈ అవార్డులు గెలవడమే కాకుండా.. ఒకే సీజన్‌లో ఎంవీపీ, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు రెండూ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సైతం స్పందిస్తూ.. భవిష్యత్తులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కంటే పెద్ద సెలబ్రిటీ వైభవ్ అవుతాడని జోస్యం చెప్పారు. ఐపీఎల్‌లో వైభవ్ చూపించిన ప్రతాపానికి బ్యాట్ స్పాన్సర్‌షిప్ మార్కెట్ అప్సెట్ అయిపోయింది. కోహ్లీ బ్యాట్ స్పాన్సర్ ఎమ్ఆర్ఎఫ్, రోహిత్ శర్మ బ్యాట్ స్పాన్సర్ సియట్ లాంటి దిగ్గజ క్రీడా సంస్థలు వైభవ్ బ్యాట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక ప్రముఖ కంపెనీ అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడికి ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజ్ చూసి వైభవ్ తన కమర్షియల్ యాడ్స్ రేట్లను ఏకంగా రెట్టింపు చేసేశాడు. వైభవ్ సూర్యవంశీ కమర్షియల్ జర్నీ ప్రముఖ న్యూట్రిషన్ బ్రాండ్ కాంప్లాన్ ఇండియాతో ప్రారంభమైంది. 2026 ప్రారంభంలోనే కాంప్లాన్ సంస్థ అతనితో థోడా ప్లాన్, థోడా కాంప్లాన్ అనే క్యాంపెయిన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.75 నుంచి 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ యాడ్‌లో వైభవ్ క్రమశిక్షణతో కూడిన శిక్షణ, క్రీడాకారులకు పోషకాహారం ఎంత ముఖ్యమనే విషయాలను హైలైట్ చేశారు. రెడ్ బుల్ ఛాలెంజ్.. గూగుల్ పే పాకెట్ మనీ యాడ్ ఐపీఎల్ 2026 టోర్నీ జరుగుతున్న సమయంలోనే వైభవ్ తన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌మేట్ ధ్రువ్ జురెల్‌తో కలిసి రెడ్ బుల్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్‌లో కనిపించాడు. స్పిన్నింగ్ వీల్ గేమ్ ద్వారా 30 బంతుల్లో 60 పరుగులు చేసే టాస్క్‌లో పాల్గొని అలరించాడు. దీనితో పాటు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే పాకెట్ మనీ క్యాంపెయిన్‌లో కూడా వైభవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. టీనేజర్లు తమ యూపీఐ ఐడీలను తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకునే ఈ ఫీచర్ యాడ్‌లో 15 ఏళ్ల వైభవ్ రోజువారీ డిజిటల్ పేమెంట్స్ చేస్తూ కనిపించాడు. జార్ఖండ్ ఆరోగ్య శాఖ అంబాసిడర్‌గా.. ఎస్ఎస్ బ్యాట్ డీల్ మే 30వ తేదీన జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఒక కీలక ప్రకటన చేశారు. వైభవ్‌ను యూత్ ఎనర్జీకి నిలువెత్తు రూపంగా అభివర్ణిస్తూ, త్వరలోనే జార్ఖండ్ ఆరోగ్య శాఖ తరుఫున ప్రచారకర్తగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఇక క్రికెట్ కిట్ విషయానికి వస్తే.. ప్రముఖ స్పోర్ట్స్ తయారీ సంస్థ సరీన్ స్పోర్ట్స్ (SS – Sareen Sports)తో వైభవ్‌కు ఎప్పటి నుంచో ఒప్పందం ఉంది. ఈ ఎస్ఎస్ బ్యాట్ స్పాన్సర్‌షిప్ ద్వారా వైభవ్‌కు ఏడాదికి దాదాపు రూ.50 లక్షల ఆదాయం లభిస్తోంది. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Zee Telugu02 Jun, 11:31 am
ఐపీఎల్ 2026 సీజన్ హైలెట్స్.. ఈ 7 వీడియోలు తప్పక చూడండి

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IPL 2026 Top Viral Moments: ఐపీఎల్ 2026 సీజన్ అద్భుతంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 75 పరుగుల నాటౌట్‌గా నిలిచి ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు. కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా, వైభవ్ సూర్యవంశి 'ప్లేయర్ ఆఫ్ ది సీజన్'గా ఎంపికయ్యారు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో ఆద్యాంతం అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఏడు విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే రీతిలో హిట్ వికెట్ అవ్వడం అభిమానులకు చాలా కాలం గుర్తిండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. క్రికెట్ చరిత్రలో కూడా ఇలా ఎన్నడూ జరగలేదు. ఐపీఎల్‌లో మొత్తం మూడుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. క్వాలిఫయర్ 1లో ఆర్‌సీబీపై, క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి వికెట్లను తాకింది. దీంతో బ్యాట్‌కు చేయికి పట్టి కట్టించి ఆడించాలంటూ రకరకాల మీమ్స్‌ వైరల్ అయ్యాయి. — Sanjeev । సంజీవ్ 🇮🇳 (@sanjusayz) May 30, 2026 విరాట్ కోహ్లీ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఎప్పుడు దూకుడుగా ఉంటాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్‌తో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీతో ట్రావిస్ హెడ్ కరచాలనం చేయసేందుకు ప్రయత్నించినా.. కోహ్లీ అతను నిరాకరించాడు. ట్రావిస్ హెడ్ భార్యపై కూడా కోహ్లీ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేశారు. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ సమయంలో అంపైర్‌తో విరాట్ కోహ్లీ సరదా పని అందరిని నవ్వించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం మైదానంలోకి రాగానే కోహ్లీ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు.. అంపైర్ చేతికి తన టోపీని ఇచ్చాడు. మొదటి ఓవర్ నిజంగా కోహ్లీ వేస్తాడా అని అంపైర్ ఆశ్చర్యపోగా.. నిజానికి అంపైర్‌ను సరదాగా ఆటపట్టించాడు. కోహ్లీ, అంపైర్ మధ్య జరిగిన ఈ వీడియో వైరల్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు సృష్టించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 28 బంతుల్లో 97 పరుగులతో ఉన్న సమయంలో భారీ షాట్ ఆడేందుకు యత్నించి వికెట్ కోల్పోయాడు. ఆ బంతి బౌండరీకి వెళ్లిపోయి ఉంటే 29 బంతుల్లో సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవాడు. వైభవ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినా.. తీవ్రంగా నిరాశ చెందాడు. సీజన్‌కు ముందు గేల్ 30 బంతుల రికార్డును బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన వైభవ్.. రికార్డుకు చేరువగా వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ తరువాత కృనాల్ పాండ్యా కాలర్‌ను నికోలస్ పూరన్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ ఏం జరగలేదు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో అలా సరదగా పూరన్ కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి లక్నో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలక్ట్రిక్ సిగరేట్ తాగడం ఈ సీజన్‌లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందించి.. పరాగ్‌పై చర్యలు తీసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఆటతీరును కనబర్చింది. నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్.. ఎలిమినేటర్‌ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. క్వాలిఫైయర్-2 గుజరాత్‌పై వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా.. రాజస్థాన్ ఓటమిపాలు కావడం అభిమానులను బాధించింది. ఐపీఎల్ 2026లో మనీష్ పాండే పట్టిన క్యాచ్‌కు బెస్ట్ అవార్డు లభించింది. అయితే ఈ రేసులో బార్ట్‌లెట్ పట్టిన క్యాచ్ కూడా పోటీలో నిలిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను దాటుతున్న బంతిని పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాలిలోనే పట్టుకుని.. దాన్ని లోపలికి విసిరాడు. వెంటనే బార్ట్‌లెట్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను అక్కడే డగౌట్‌లో చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చూసి షాక్ అయ్యారు.

Andhra Jyothy02 Jun, 07:06 am
టీమిండియాలోకి వైభవ్ ఎంపికపై హడావిడి వద్దు

<p><strong><span style="color: rgb(255, 0, 0)">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. పలు అరుదైన రికార్డులు కొల్లగొట్టాడు. అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొందరపడి వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకురావద్దని తెలిపాడు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>‘సంజు శాంసన్, అభిషేక్ శర్మ తర్వాతి వరుసలో వైభవ్ సూర్యవంశీ ఉంటాడు. అయితే అతడిని నేరుగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి విదేశీ పర్యటనలకు పంపడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ముందుగా ఐపీఎల్ తరహా బ్యాటింగ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో వైభవ్‌ను పరీక్షించాలి. అయితే అతడికి ఐపీఎల్ ఫామ్‌ను విదేశాల్లోనూ కొనసాగించే సామర్థ్యం ఉంది. కానీ వైభవ్‌పై అతిగా అంచనాలు పెట్టుకుని విదేశీ పర్యటనలకు ఎంపిక చేయడం సరికాదు. వైభవ్ టీమిండియాలో ఎలా రాణిస్తాడు? ఒత్తిడిని తట్టుకుంటాడా? వంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు. కానీ అది మన పని కాదు. నిజానికి అది బీసీసీఐ పని కూడా కాదు. వైభవ్‌ ఒక వ్యక్తి.. అతడి చుట్టూ కోచ్‌లు, మార్గదర్శకులు ఉంటారు. జీవితంలో అతడు ఏం సాధించాలని అనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకోవాలి’ అని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #ff0000">అందులో తప్పేమీ లేదు..</span></strong></p><p>‘వైభవ్ కేవలం టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్‌గా మారాలనుకుంటే అలాగే ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ అప్పటి నుంచి అతడిని టీ20 ప్లేయర్‌గానే అంచనా వేస్తారు. వన్డే క్రికెట్‌లో వైభవ్ ఆడితే.. తొలి 10 ఓవర్లలో అతడు చేసే విధ్వంసానికి అవధులు ఉండవు. గేమ్‌ను వన్ సైడ్ మార్చేసే సత్తా అతడిలో ఉంది. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటే వైభవ్ కూడా జట్టులో తన స్థానం కోసం పోటీ పడాలి. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా వెంటనే అవకాశాలు ఇవ్వడం కొంతమంది అర్హులైన ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతుంది. బిహార్ క్రికెట్ అకాడమీ తరఫున ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి వైభవ్‌పై అనవసర ఒత్తిడి పెట్టకుండా.. అతడు ఏ దిశలో వెళ్లాలనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకునేలా వదిలేయాలి’ అని మంజ్రేకర్ సూచించాడు.</p><br/><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/bcci-drops-major-hint-on-vaibhav-sooryavanshi-india-selection-debut-may-not-be-far-srav-1528990.html"><strong>టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!</strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/venkatesh-iyer-reveals-what-makes-virat-kohli-special-after-rcb-ipl-2026-title-win-srav-1528980.html"><strong>జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy02 Jun, 04:43 am
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్.. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ గత కొద్దిరోజులుగా డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడి ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. త్వరలోనే వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>‘భారత క్రికెట్‌కు వైభవ్ కొత్త వండర్ కిడ్. భవిష్యత్తులో అతడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు. ఐపీఎల్ మ్యాచ్‌లను బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. చాలా సందర్భాల్లో వారు ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి ప్లేయర్ల ప్రతిభను గమనిస్తున్నారు. త్వరలో జరిగే భారత జట్టు ఎంపిక సమావేశాల్లో వైభవ్ ప్రదర్శనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు. అతడి భవిష్యత్తుకు ఏది మంచిదో దాని బట్టే బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది యువ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. కానీ వైభవ్ సూర్యవంశీ ప్రతిభ అసాధారణం. భారత క్రికెట్‌కు ఇలాంటి ప్లేయర్ దొరకడం సంతోషంగా ఉంది. వైభవ్ త్వరలోనే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడు’ అని దేవజిత్ సైకియా ప్రశంసించారు. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #ff0000">ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి</span></strong></p><p>ప్లేయర్ల వర్క్‌లోడ్‌పై కూడా దేవజిత్ స్పందించారు. ‘భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశమున్న ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను బీసీసీఐ సాంకేతిక బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐపీఎల్ రెండు నెలలపాటు ఫ్రాంచైజీల నియంత్రణలో జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని మేము నియంత్రించలేం. అయితే ఆటగాళ్లకు ముందుగానే ఫిట్‌నెస్ ప్రణాళికలు, మార్గదర్శకాలు అందజేస్తాం. దేశానికి ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లకు చేయాల్సినవి, చేయకూడనివి అన్నీ స్పష్టంగా తెలుసు. వారు వాటిని పాటిస్తున్నారనే నమ్మకం మాకు ఉంది’ అని సైకియా వివరించారు. కాగా వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు, సంకేతాలు చూస్తుంటే.. టీమిండియా అరంగేట్రం వైభవ్‌కు ఎంతో దూరంలో లేదనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జాతీయ జట్టులోకి తీసుకురావాలా? వద్దా? అన్న నిర్ణయం ప్రధాన ఎంపిక కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ చేతుల్లో ఉంది.</p><br/><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/lionel-messi-70-foot-statue-removed-in-kolkata-over-safety-concerns-srav-1528969.html"><strong>కోల్‌కతాలో మెస్సి విగ్రహం తొలగింపు.. ఎందుకంటే?</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/tim-david-suspended-for-one-match-after-ipl-2026-final-code-of-conduct-breach-srav-1528965.html"><strong>ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

AP7AM02 Jun, 02:55 am
నా అస లు టార్గెట్ వేరే... నా నుంచి మీరు త ర్వాత చూసేది ఆ క్రికెటే

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ 2లోనే వెనుదిరిగినప్పటికీ, ఆ జట్టులోని ఓ యువ సంచలనం మాత్రం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగుల రికార్డు స్కోరుతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇంతటి విజయం సాధించినా, తన అసలు లక్ష్యం భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమేనని ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో వైభవ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. "అవును, నా తర్వాతి టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉంది. దానికోసం నేను గ్రౌండ్‌లో కష్టపడాలి. నేను రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. త్వరలోనే అందరూ చూస్తారు" అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.తన దూకుడైన బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. "ప్రతి బంతిని బాదడమంటే నాకు ఇష్టమని అందరూ అనుకుంటారు. కానీ, ఇది టీ20 ఫార్మాట్. స్వేచ్ఛగా ఆడమని కోచ్‌లు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బంతిని నేను బాదగలనని నమ్మకం ఉన్నప్పుడే షాట్ ఆడతాను. అంతేగానీ, బలవంతంగా ప్రతి బంతినీ కొట్టాలని చూడను" అని తెలిపాడు.అంతేగాక‌ "టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్ అని మా