translateexpand_more

Water Resources Department News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 12:58 am
రక్షణ గోడలు నిర్మించండి

గోదావరి వరదతో స్పిల్‌వే నుంచి ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ నిపుణుడు, పోలవరం నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరైన సీన్‌ హించ్‌బర్గర్‌ రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించారు. స్పిల్‌వే నుంచి భారీ ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురయ్యే ప్రమాదముంది అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరదతో స్పిల్‌వే నుంచి ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ నిపుణుడు, పోలవరం నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరైన సీన్‌ హించ్‌బర్గర్‌ రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించారు. ఈ నెల 26న రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రధాన డ్యామ్‌ ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ పనులను పరిశీలించారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులపైనా లోతైన సమీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో సీఈవో సంజీవ్‌ వోహ్రా, పీపీఏ కార్యదర్శి రఘురామ్‌, జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి తదితరులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేసిన హించ్‌బర్గర్‌.. వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. స్పిల్‌వే నుంచి స్పిల్‌ చానల్‌ మీదుగా ప్రవాహం 14 లక్షల క్యూసెక్కులు దాటి వేగంగా నదిలో కలిసినప్పుడు భూమి కోతకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. భూమి కోతకు గురికాకుండా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలన్నారు. కాగా 2020లో వచ్చిన వరదకు డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. అప్పట్లో గ్యాప్‌-1, గ్యాప్‌-2 ద్వారా వరద ప్రవహించింది. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ను పూర్తిగా నిర్మించడంతో వరదంతా స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ ద్వారానే కిందకు వెళ్తూ గోదావరి నదిలో కలుస్తోంది. 2020 తరహాలో గోదావరికి

Andhra Jyothy02 Jun, 12:30 am
న తుంగభద్ర గేట్లు ప్రారంభం

తుంగభద్ర డ్యామ్‌ కు కొత్తగా బిగించిన 33 క్రస్ట్‌ గేట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలసి ఈ ... అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యామ్‌ కు కొత్తగా బిగించిన 33 క్రస్ట్‌ గేట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలసి ఈ నెల 25న బటన్‌నొక్కి పైకి ఎత్తనున్నారు. ఆగస్టులో వరదలకు కొట్టుకుపోయిన ఈ గేట్లను గత నెలలో పూర్తిగా మార్చేశారు. జాతీయస్థాయి నిపుణుడు కన్నయ్యనాయుడు రికార్డు సమయంలో ఈ గేట్లను డిజైన్‌ చేసి, తయారు చేయించారు. గేట్లను తెరిస్తే.. ఈ ఏడాది ఖరీ ఫ్‌కు తుంగభద్ర నుంచి పంటలకు నీరందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర బోర్డు చైర్మన్‌ ఎస్‌ఎన్‌ పాండే మంగళవారం విజయవాడకు రానున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీ తర్వాత వారిరువురూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశముంది.