
ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు శాఖల నుండి మిగులు సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై పంపడానికి అనుమతి ఇచ్చింది. దీనివల్ల పలు శాఖల్లో సిబ్బంది కొరత తీరబోతోంది. సుమారు 6,124 మంది సిబ్బంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం 5,374 మంది మిగులు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ పరిపాలనలో సిబ్బంది కొరత తీరబోతోంది. ఏపీలో సచివాలయ ఉద్యోగుల (స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు ) విషయంలో కూటమి ప్రభుత్వం (Ap govt) ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. మిగులు ఉద్యోగుల్ని స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ శాఖ నుంచి ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై తీసుకునేందుకు ఇవాళ అనుమతి ఇచ్చింది. దీంతో తగినంత మంది ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్న పలు శాఖల్లో కొరత తీరబోతోంది.తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక ఉత్తర్వులు..! తక్షణం అమల్లోకి..!రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న మిగులు సిబ్బందిని డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు కేటాయించేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర శాఖలు, కార్పొరేషన్లు సుమారు 6,124 మంది స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బందిని డిప్యుటేషన్‌పై తమకు బదిలీ చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రస్తుతం సచివాలయాల్లో హేతుబద్ధీకరణ తర్వాత కేవలం 5,374 మంది మిగులు సిబ్బంది మాత్రమే ఉన్నారు. APSRTC ప్రైవేటీకరణపై తాడోపేడో ? 8న ఉద్యోగుల జేఏసీ భేటీ- కీలక ప్రకటన ..!ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన మెమోలో స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీంతో ఉన్న సిబ్బందిని అయినా ఇచ్చేయాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి దీనిపై సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని డిప్యుటేషన్లపై ఇతర శాఖలకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే సొంత శాఖను వదిలి డిప్యుటేషన్లపై ఇతర శాఖలకు వెళ్లేందుకు ఉద్యోగులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీరంతా ఇతర శాఖలకు తరలి వెళ్లాల్సిందే. ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీపై కీలక నిర్ణయం తీసుకుంది.