translateexpand_more

News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu29 May, 02:34 am
ఏఐ.. పురాతన పత్రాలూ చదివెయ్

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా వందల ఏళ్లనాటి పురాతన ప్రతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చరిత్రకారులు చదవలేకపోయారు. ఇప్పుడా ఇబ్బందిని తీరుస్తోంది కృత్రిమ మేధ. వాటికన్‌లోని గ్రంథాలయంలో చేతిరాతతో ఉన్న 408 పేజీల పుస్తకం బోర్గ్‌ సైఫర్‌ అత్యంత మిస్టరీగా ఉంది. 400 ఏళ్లుగా దానిని ఎవరూ డీకోడ్‌ చేయలేకపోయారు. అందులో కొన్ని వింత గుర్తులున్నాయి. అప్పట్లో వైద్య విధానాలకు సంబంధించిన రహస్యాలను ఇలా దాచి ఉంచారని చెబుతారు. అందులో 34 అరుదైన చిహ్నాలు, కొన్ని రోమన్‌ అక్షరాలున్నాయి. ఇప్పుడా పుస్తకాన్ని ఏఐలోని మెషీన్‌ లెర్నింగ్‌తో చదువుతున్నారు. ఆ పుస్తకంలో వేలాది చికిత్సలకు సంబంధించిన అంశాలున్నాయని తేల్చారు. విరేచనాలను తగ్గించడానికి గ్లాసులకొద్దీ అత్యుత్తమ నాణ్యత కలిగిన రెడ్‌వైన్‌ను తాగాలని, పిండిలో జాజికాయను పులియబెట్టి తీసుకోవాలని ఉంది. ఇలాంటి ఎన్నో అంశాలను డీకోడ్‌ చేస్తున్నామని స్వీడన్‌లోని స్టాక్‌హోం యూనివర్సిటీ లింగ్విస్టిక్స్‌ ప్రొఫెసర్‌ బీటా మెగ్వెసీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 01:08 pm
ఎల్ ఐసీ షేర్లు 50 శాతం పడ్డాయా? కారణం ఇదే

LIC shares | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో 50 శాతం మేర క్షీణించినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఎల్‌ఐసీ బోనస్‌ ఇష్యూ సంగతి తెలీని వారు ఈ మార్పు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. శుక్రవారం నుంచి బోనస్‌ షేర్ల జారీ షేరు విలువలో ప్రతిఫలించడమే ఇందుకు కారణం. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు విలువ రూ.830గా ఉంది. బోనస్‌ షేరు వల్ల విలువ సగమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మార్కెట్‌ ప్రారంభంలో రూ.417.60 వద్ద ప్రారంభమైంది. తర్వాత ఒక శాతం నష్టంతో రూ.411 వద్ద మగిసింది. అంటే నష్టపోయింది ఒక శాతం లోపే. కానీ, 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేయడం వల్ల స్టాక్‌ ధరలో పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు కనిపించింది. మే 29 నాటికి ఎల్‌ఐసీ షేర్లు ఉన్నవారికి 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేయాలని ఎల్‌ఐసీ నిర్ణయం తీసుకుంది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు కలిగిన వాటాదార్లకు అదనంగా రూ.10 ముఖ విలువ కలిగిన మరో ఈక్విటీ షేరును బోనస్‌గా జారీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 2025 డిసెంబరు 31 నాటికి ఎల్‌ఐసీ వద్ద ఉన్న రూ.6,325 కోట్ల నిల్వలు, మిగులు నిధులతో ఈ బోనస్‌ ఇష్యూను పూర్తి చేయనున్నట్లు ఎక్స్ఛేంజీలకు గతంలో ఎల్‌ఐసీ సమాచారం ఇచ్చింది. దీనివల్ల కంపెనీ షేర్లు సంఖ్య పెరగడమే కాకుండా.. రిటైల్‌ మదుపర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. షేర్ల సంఖ్య పెరిగినంత మాత్రాన కంపెనీ మార్కెట్‌ విలువలో ఎలాంటి మార్పూ ఉండదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల

Eenadu29 May, 02:06 pm
కరవును జయించే వరి .. కొత్త రకం అభివృద్ధిలో చైనా కీలక విజయం

ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరి ప్రధాన ఆహారం. దీన్ని పండించడానికి భారీగా నీరు అవసరం. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో లోటుపాట్లు వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కరవును తట్టుకునే, అతి తక్కువగా నీటిని వినియోగించే వరి రకాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఈ విషయంలో గణనీయ పురోగతి సాధించినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. బ్రిటన్‌ సైతం ఈ దిశగా కీలక అడుగులు వేస్తోంది. వేడెక్కుతున్న నేటి ప్రపంచంలో.. వ్యవసాయానికి ఇదో శుభవార్త. కరవును తట్టుకోగలిగి, తక్కువ నీటితో వరి పండడానికి దోహదపడే కీలకమైన హెచ్‌ఎంజీబీ1 జన్యువును చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 16 వరి రకాల(సగం మెట్ట, సగం నీటిపారుదల)పై అధ్యయనం చేసి, వాటి వేర్లు, జన్యు కార్యకలాపాలను విశ్లేషించారు. వేర్ల అభివృద్ధికి దోహదపడే 376 జన్యువులను గుర్తించారు. ఇందులో హెచ్‌ఎంజీబీ1 వీరి పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించింది. వేర్ల పెరుగుదలను ఈ జన్యువు నెమ్మదింపజేస్తుంది. నీటి కోసం భూమి లోతుల్లోకి వెళ్లే వేర్లకు అడ్డుకట్ట వేస్తుంది. పొడి ప్రాంతాల్లో మనుగడ సాగించేలా మందపాటి వేర్లు పెరగడానికి ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వేర్లు నిటారుగా భూమిలోకి చొచ్చుకుపోవడానికి హెచ్‌ఎంజీబీ1 జన్యువు బ్రేకులా అడ్డుకట్ట వేస్తుంది కాబట్టి ఉన్నచోటే ఆ వేర్లు మందంగా, బలంగా తయారవుతాయి. ఇది మొక్కకు కరవును తట్టుకునే శక్తిని బాగా పెంచుతుందని ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ ప్రచురించింది. యాదృచ్ఛికంగా మొక్కలను సంకరం చేయడానికి బదులుగా, నిర్దిష్ట జన్యువులను లక్ష్యంగా చేసుకుని ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ పరిశోధన దోహదపడుతుంది. హువాజోంగ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీజీఐ-రీసెర్చ్, యునాన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే జన్యు వైవిధ్య వరి మొక్కల

Eenadu29 May, 01:09 pm
ఫోన్ ఉంటే.. మీరే వ్యాపార భాగస్వామి

తపాలాశాఖ ఫ్రాంచైజీ 2.0తో విస్తృత ఉపాధి అవకాశాలు విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులందరికీ లబ్ధి ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవల్ని మరింత వేగవంతం చేసే దిశగా తపాలాశాఖ అడుగులు వేస్తోంది. ఈ-కామర్స్‌ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కొత్తగా ‘ఫ్రాంచైజీ పథకం 2.0’ను అందుబాటులోకి తెచ్చింది. కొరియర్, ఎక్స్‌ప్రెస్, పార్సిల్‌ విభాగంలో సేవల్ని బలోపేతం చేయడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది. అడ్వాన్స్‌ పోస్టల్‌ టెక్నాలజీ (ఏపీటీ 2.0)ని ఉపయోగించి ఆధునిక, పారదర్శక, పౌర కేంద్రిత సేవలను అందించడమే దీని లక్ష్యం. విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, మహిళలు, వర్తకులు.. ఎవరైనా పోస్టల్‌ ఫ్రాంచైజీలుగా మారి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. స్పీడ్‌ పోస్ట్‌ డాక్యుమెంట్‌ బుకింగ్, స్పీడ్‌ పోస్ట్‌ పార్సిల్‌ బుకింగ్, ఇండియా పోస్ట్‌ పార్సిల్‌ సేవలు, ఇంటర్నేషనల్‌ ఈఎమ్‌ఎస్, ఐటీపీఎస్‌ సేవలు, క్లిక్‌ అండ్‌ బుక్, పిక్‌-అప్‌ సేవలు, క్యాష్‌ ఆన్‌ డెలివరీ, ఇంటివద్ద నుంచే పార్సిల్‌ సేకరణ.. ఇలా రకరకాల సేవలు అందించవచ్చు. ఫ్రాంచైజీదారులు తమ సౌలభ్యాన్ని బట్టి బుకింగ్‌ మాత్రమే, డెలివరీ మాత్రమే, పికప్‌ మాత్రమే, అన్ని సేవలు కలిపి.. అనే నాలుగు రకాల సర్వీసుల్ని ఎంచుకోవచ్చు. డెలివరీ సేవల కోసం వాహనం ఉంటే సరిపోతుంది. బుకింగ్‌ సేవలకు చిన్న స్థలం, స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్, ఇంటర్నెట్, ప్రింటర్‌ వంటి మౌలిక సదుపాయాలు అవసరం. ఫ్రాంచైజీ కార్యకలాపాల ప్రకారం భద్రతా డిపాజిట్‌ నిర్ణయించారు. డెలివరీ, పికప్‌ సేవలకు రూ.5వేలు, బుకింగ్‌ సేవలకు రూ.10వేలు, అన్ని సేవలకు రూ.15వేలు చెల్లించాలి. నిబంధనల ప్రకారం ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు. ప్రతి బుకింగ్, పికప్, డెలివరీపై కమీషన్‌ లభిస్తుంది. వ్యాపారం పెరిగేకొద్దీ కమీషన్‌ శాతం పెరుగుతుంది. క్యాష్‌ ఆన్‌