
లండన్: ప్రపంచ వ్యాప్తంగా వందల ఏళ్లనాటి పురాతన ప్రతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చరిత్రకారులు చదవలేకపోయారు. ఇప్పుడా ఇబ్బందిని తీరుస్తోంది కృత్రిమ మేధ. వాటికన్లోని గ్రంథాలయంలో చేతిరాతతో ఉన్న 408 పేజీల పుస్తకం బోర్గ్ సైఫర్ అత్యంత మిస్టరీగా ఉంది. 400 ఏళ్లుగా దానిని ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. అందులో కొన్ని వింత గుర్తులున్నాయి. అప్పట్లో వైద్య విధానాలకు సంబంధించిన రహస్యాలను ఇలా దాచి ఉంచారని చెబుతారు. అందులో 34 అరుదైన చిహ్నాలు, కొన్ని రోమన్ అక్షరాలున్నాయి. ఇప్పుడా పుస్తకాన్ని ఏఐలోని మెషీన్ లెర్నింగ్తో చదువుతున్నారు. ఆ పుస్తకంలో వేలాది చికిత్సలకు సంబంధించిన అంశాలున్నాయని తేల్చారు. విరేచనాలను తగ్గించడానికి గ్లాసులకొద్దీ అత్యుత్తమ నాణ్యత కలిగిన రెడ్వైన్ను తాగాలని, పిండిలో జాజికాయను పులియబెట్టి తీసుకోవాలని ఉంది. ఇలాంటి ఎన్నో అంశాలను డీకోడ్ చేస్తున్నామని స్వీడన్లోని స్టాక్హోం యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ బీటా మెగ్వెసీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


