
ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. కేరళకు చెందిన ఓ యువతి ఇదే కోవకు చెందుతుంది. తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె.. ఇప్పుడు ఆటో నడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల డాక్టర్ నెజ్రిన్ మిధ్లాజ్ అనే ఓ వ్యాపారవేత్త కంటపడింది. నెజ్రిన్ ఆ యువతితో మాట కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోకి ఓ క్యాప్షన్ జోడించి తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది నెజ్రిన్. అది వైరల్గా మారడమే కాకుండా.. నెటిజన్ల నుంచి చక్కటి స్పందన అందుకుంటోంది. ‘కొన్నిసార్లు అపరిచితులతో అనుకోకుండా మాట్లాడడం వల్ల స్ఫూర్తిదాయకమైన కథనాలు బయటకు వస్తుంటాయి. నాకు కూడా అలాంటి సంఘటనే ఎదురైంది. ఈ రోజు ఒక మహిళా ఆటో డ్రైవర్ను కలిశా. తను చక్కటి వస్త్రధారణతో, నిండైన ఆత్మవిశ్వాసంతో, జీవితంపై స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా కనిపించింది. దాంతో ఆమెను పలకరించా. పురుషాధిక్య రంగంలో పనిచేయడం ఎలా ఉందని అడిగా. దానికి ఆమె ఇచ్చిన సమాధానంతో మరికొంతసేపు మాట్లాడాలనిపించింది. ‘మేడమ్.. ఇప్పుడు చాలా బాగుంది. మహిళలుగా మనం చాలా ధైర్యవంతులం. మనసు పెడితే ఏదైనా సాధించగలుగుతాం. నేను తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేశా. అయితే తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత, వర్క్ లైఫ్ బ్యాలన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశా. ఆ తర్వాత ఈ ఆటో కొని నడుపుతున్నా.