translateexpand_more

Abn Telugu News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 07:23 am
త్విశా శర్మ కేసు.. కీలక సాక్షిపై సమర్థ్ స్నేహితుల దాడి

<p><strong>భోపాల్, జూన్ 2:</strong> నటి త్విశా శర్మ కేసులో కీలక సాక్షి అయిన నీరజ్ దూబేపై దాడి జరిగింది. నిందితుడు సమర్థ్ సింగ్ స్నేహితులు నీరజ్‌పై దాడి చేశారు. మే 30వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలో నీరజ్ దూబే సెలూన్ నడుపుతున్నాడు. త్విశా శర్మ కేసులో నీరజ్ కీలక సాక్షిగా మారాడు. దీంతో సమర్థ్ స్నేహితులు నీరజ్‌ను టార్గెట్ చేశారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>కోర్టులో సాక్ష్యం చెప్పొద్దంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. మే 30వ తేదీన నీరజ్‌ తన సెలూన్ సమీపంలో ఉండగా ఐదుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వచ్చీరాగానే నీరజ్‌ను చుట్టుముట్టి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఎదురు తిరిగిన నీరజ్‌పై దాడికి దిగారు. ‘నువ్వు ఎందుకు ఈ కేసులో కీలక సాక్షిగా మారావు?’ అని ప్రశ్నించారు. కోర్టులో సమర్థ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని బెదిరించారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>నీరజ్‌ను విచక్షణా రహితంగా కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. దాడి జరిగిన వెంటనే నీరజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నీరజ్‌కు భరోసా ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై నీరజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ప్రాణాలు పోతాయేమోనని చాలా భయపడ్డాను. నాకు రక్షణ కల్పించమని, న్యాయం చేయమని పోలీసులను కోరాను’ అని అన్నాడు.</p><br/><p>ఇవి కూడా చదవండి</p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/sanjay-manjrekar-urges-caution-over-vaibhav-sooryavanshi-india-selection-hype-srav-1529009.html">టీమిండియాలోకి వైభవ్ ఎంపికపై హడావిడి వద్దు: సంజయ్ మంజ్రేకర్</a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/ktr-predicts-kcr-return-cm-2028-attacks-congress-government-suchi-1529008.html">2028 డిసెంబర్‌లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy02 Jun, 04:15 am
దారుణం.. ఆరుగురు కుటుంబసభ్యులను కాల్చి చంపిన వ్యక్తి

<p><strong>న్యూయార్క్, జూన్ 2: </strong>కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆరుగురు కుటుంబసభ్యులను అతి కిరాతకంగా తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం మధ్యాహ్నం 12.12 గంటల సమయంలో మస్కటిన్‌, పార్క్ ఎవెన్యూలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు మస్కటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఇంట్లో నలుగురు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ నలుగురిని కాల్చి చంపిన వ్యక్తిని 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్‌లాండ్‌గా గుర్తించారు. పోలీసులు ఇంటి దగ్గరకు రావడానికి ముందే అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. మిల్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తిని చంపేశాడు. తర్వాత గ్రాండ్‌వ్యూ ఎవెన్యూలో మరో వ్యక్తిని కాల్చి చంపాడు. అనంతరం ఓ బ్రిడ్జి దగ్గర తుపాకితో కాల్చుకుని ర్యాన్ విల్లిస్ ఆత్మహత్య చేసుకున్నాడు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>పోలీసులు అతడి శవాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ర్యాన్ విల్లిస్‌ చేతిలో హత్యకు గురైన వారందరూ అతడి కుటుంబసభ్యులేనని తేలింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడైంది. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.</p><br/><p>ఇవి కూడా చదవండి</p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-hoists-national-flag-on-telangana-formation-day-vk-1528985.html">రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి</a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cbse-osm-row-centre-seeks-report-over-coempt-contract-warns-of-actionf-sgr-1528982.html">సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy02 Jun, 01:38 am
ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. 33 ఏళ్ల తర్వాత

<p><strong>పాట్నా, జూన్ 2:</strong> 84 ఏళ్ల ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 33 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చటం గమనార్హం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 1992 నవంబర్ 10వ తేదీన వైశాలి జిల్లా, రాఘవ్‌పూర్ గ్రామానికి చెందిన దీప్ రాయ్, ఆయన కుటుంబసభ్యులు అదాలత్ రాయ్ ఇంటి దగ్గర ఉన్న రోడ్డుపై గాజు పెంకులు పేర్చారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>అదాలత్ రాయ్, ఆయన భార్య రామ్‌శకీ దేవి.. ‘రోడ్డుపై గాజు పెంకులు ఎందుకు పేరుస్తున్నారు’ అని దీప్ రాయ్ కుటుంబాన్ని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన దీప్ రాయ్ కుటుంబం అదాలత్ రాయ్ దంపతులపై దాడికి పాల్పడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 1993, మార్చి 13వ తేదీన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1999 జూన్ నెలలో కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. దాదాపు 30 ఏళ్ల నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతూనే ఉంది. నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. కోర్టు పది మంది సాక్ష్యులను విచారించింది. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>ఆధారాలను రివ్యూ చేసిన తర్వాత కోర్టు తుది తీర్పును వెలువరించింది. 84 ఏళ్ల దీప్ రాయ్‌ని దోషిగా తేల్చింది. జూన్ 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈ రోజు దీప్ రాయ్‌కి శిక్ష ఖరారు చేయనుంది. 84 ఏళ్ల దీప్ రాయ్ కేసు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీప్ రాయ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సరిగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.</p><br/><p>ఇవి కూడా చదవండి</p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cbse-answer-sheets-scanned-with-mobile-phones-rahul-gandhi-allegations-against-government-over-exam-tender-scam-student-future-impact-1528967.html">సీబీఎస్ఈ జవాబుపత్రాలు ఫోన్లతో స్కానింగ్‌</a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cockroach-janata-party-chief-abhijeet-deepke-to-visit-india-on-june-6-join-neet-protest-at-jantar-mantar-delhi-1528966.html">6న భారత్‌కు ‘కాక్రోచ్‌’ అధినేత</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>