translateexpand_more

K Annamalai News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 12:32 pm
తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ .. తీవ్ర మనస్తాపంతో అన్నామలై రాజీనామా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Annamalai Resignation: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయాలు సంచలనాలకు కేంద్రంగా మారింది. ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీలో చేరుతుండగా.. ఇతర పార్టీలలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీజేపీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేశారు. త్వరలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై రాజీనామాతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేస్తూ 5 పేజీల లేఖ రాశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై అనూహ్యంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. రాజ్యసభ అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కి పంపారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు స్పష్టమవుతోంది. రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై సమావేశమయ్యారు. అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా అన్నామలై వెనక్కి తగ్గకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమాచారం ప్రకారం అన్నామలై త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా ఆయన తదుపరి అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే కారణమా? రాజీనామా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీట్‌ ఇవ్వకపోవడంతో అన్నామలై తీవ్ర నిరాశకు గురయ్యారు. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంతో అతడికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి అసంతృప్తితో రగులుతున్న అన్నామలై చివరకు పార్టీని వీడారు. ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ శ్రేణులతో సింగం అని పిలిపించుకున్న వ్యక్తి అర్ధాంతరంగా బీజేపీ నుంచి వైదొలిగాడు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారి అన్నామలై ఓటమి పాలయ్యారు. అయితే టీవీకే పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విజయ్‌ మాదిరి అన్నామలై పార్టీని స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Andhra Jyothy02 Jun, 12:07 pm
అమిత్ షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం

<p><strong>న్యూఢిల్లీ: </strong>తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shan)ను మంగళవారంనాడిక్కడ కలుసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌లతో తొలుత సమావేశమైన అన్నామలై తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించారు. ఆ వెంటనే అమిత్‌షాను కూడా కలుసుకోవడంతో ఆయన కొత్త పార్టీని స్థాపించేందుకు నిశ్చయించుకున్నారనే ఊహాగానాలు మరింత ఊపందుకుంటున్నాయి. అయితే కొత్త పార్టీ ఆలోచనను అన్నామలై ఇంతవరకూ అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>న్యూఢిల్లీ పర్యటనలో అన్నామలైను పార్టీలోనే కొనసాగాలని బీజేపీ అధిష్ఠానం కోరిందని, రాజ్యసభ సీటు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేంతవరకూ ఢిల్లీలోనే ఉండాలని సూచించిందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అన్నామలై సైతం తన నిర్ణయాన్ని రెండ్రోజుల్లో తెలియజేస్తానని ఢిల్లీకి బయలుదేరే ముందు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>మరోవైపు, అన్నామలై మరో కొత్త అవతారం ఎత్తాలని, తమిళనాడును కాపాడాలని కోరుతూ మదురై, కోయంబత్తూరులో రెండ్రోజుల క్రితం పోస్టర్లు వెలిసాయి. జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజున ఆయన నుంచి ఒక కీలక ప్రకటన ఉంటుందని అన్నామలై అనుచరులు చెబుతున్నారు. అన్నామలై గత కొంతకాలంగా పలు అంశాల విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై మొదట్నించీ ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ టిక్కెట్‌ను కూడా నిరాకరించి ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యారు. అయితే ప్రచారంలోనూ ఆయనను పార్టీ పెద్దగా పట్టించుకోలేదని అన్నామలై వర్గీయులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానంతో అన్నామలై బహిరంగంగానే విభేదించారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర విద్యాశాఖను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన కోరారు. ఈ క్రమంలో సుహృద్భావ వాతావరణంలోనే పార్టీ నుంచి తప్పుకుని సొంత మార్గాన్ని ఎంచుకోవాలని అన్నామలై గట్టి నిశ్చయానికి వచ్చినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.</p><br/><p><strong><span style="color: #1d23dd">ఇవి కూడా చదవండి..</span></strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/vande-mataram-full-version-mandatory-at-every-function-was-difficult-to-justify-says-sashi-tharoor-avr-1529028.html"><strong><span style="color: #c70a0a">అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్</span></strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/mamata-banerjee-protests-over-alleged-attacks-on-tmc-leaders-in-kolkata-avr-1529036.html"><strong><span style="color: #c70a0a">టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన</span></strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

K Annamalai News Keyword | Telugu Digital