translateexpand_more

Latest News News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times02 Jun, 12:42 pm
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ప్రవాసులకు మహేష్ బిగాల శుభాకాంక్షలు

Mahesh Bigala: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఓషియానియా వంటి అన్ని ఖండాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ సంబరాలు.. అమెరికా, కెనడా, లండన్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, బహ్రెయిన్ ,ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సహా గల్ఫ్ దేశాలు అలాగే ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికా, టాంజానియా వరకు అనేక దేశాల్లో తెలంగాణ పండుగ వాతావరణం వైభవంగా కొనసాగుతోంది. మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, ఉద్యమ విశేషాలను అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పేలా ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. ముఖ్య అతిథిగా కేటీఆర్.. ఈ సారి వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మలేషియాలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కేటీఆర్ రాక కోసం మలేషియాలోని తెలుగు సంఘాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని మహేష్ బిగాల వెల్లడించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రగతి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేయడానికి ఈ వేడుకలు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని మరింత పెంపొందించేందుకు ప్రతి ప్రవాస తెలంగాణవాసి బాధ్యతగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Vaartha02 Jun, 11:41 am
స్విమ్మింగ్ చేస్తున్నారా? చర్మం పాడవకుండా ఉండాలా

Swimming : స్విమ్మింగ్ పూల్‌లోని నీటిని శుభ్రం చేయడానికి వాడే క్లోరిన్ వల్ల చర్మం పొడిబారడం, నల్లబడటం, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. దీని నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ఈత కొట్టడానికి ముందు, తర్వాత సరైన స్కిన్ కేర్ రూటీన్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచి వ్యాయామం అయినప్పటికీ, ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రం కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. స్విమ్మింగ్ పూల్స్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి క్లోరిన్ వంటి రసాయనాలను వాడుతుంటారు. ఈ క్లోరిన్ నీరు చర్మంపై పడటం వల్ల చర్మం పొడిబారడం ట్యాన్ అవ్వడం (నల్లబడటం), దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి స్విమ్మింగ్ చేస్తూనే చర్మాన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో, అందుకు సంబంధించిన బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కిన్ కేర్ రూటీన్ గురించి తెలుసుకుందాం. Read Also : Peanuts : అమితంగా పల్లీలు తింటే ప్రమాదమా? పూల్‌లోకి దిగడానికి ముందు సాధారణ నీటితో ఒకసారి స్నానం చేయాలి. దీనివల్ల చర్మకణాలు ముందే నీటిని గ్రహిస్తాయి, ఫలితంగా పూల్‌లోని క్లోరిన్ నీరు చర్మంలోకి ఎక్కువగా ఇంకకుండా ఉంటుంది. ఓపెన్ పూల్స్‌లో స్విమ్ చేసేటప్పుడు సూర్యరశ్మి, క్లోరిన్ కలయిక వల్ల చర్మం త్వరగా నల్లబడుతుంది. అందుకే ఈతకు వెళ్లే 20 నిమిషాల ముందే ముఖం , చేతులు, కాళ్లకు కనీసం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ను రాయాలి. చర్మంపై రక్షణ పొరను ఏర్పరచడానికి స్విమ్మింగ్‌కు ముందు బాడీ లోషన్ లేదా కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల క్లోరిన్ ప్రభావం చర్మంపై నేరుగా పడదు. స్విమ్మింగ్ పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. చర్మంపై పేరుకుపోయిన క్లోరిన్ రసాయనాలను తొలగించడానికి మైల్డ్ బాడీ వాష్ లేదా యాంటీ-క్లోరిన్ సోప్‌ను ఉపయోగించవచ్చు. క్లోరిన్ నీటి వల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోయి చర్మం పొడిగా మారుతుంది. అందుకే స్నానం చేసిన వెంటనే చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ లోషన్‌ను రాసుకోవాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా ఉండటానికి స్విమ్మింగ్ తర్వాత తగినంత నీరు లేదా కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. స్విమ్మింగ్ వల్ల కలిగే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూనే.. పైన పేర్కొన్న చిన్న చిన్న చర్మ సంరక్షణ నియమాలను పాటించడం ద్వారా మీ చర్మాన్ని నల్లబడకుండా, పొడిబారకుండా కాపాడుకోవచ్చు. Food Adulteration: ఆహార భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ Tamil Nadu BJP Leader: బీజేపీకి అన్నామలై రాజీనామా.. కొత్త పార్టీ వైపు అడుగులు? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Peanuts : అమితంగా పల్లీలు తింటే ప్రమాదమా? Sleeplessness : నిద్రలేమి వేధిస్తోందా? మీ అలసటకు చెక్ పెట్టే సూపర్ టిప్స్! Vitamin D: విటమిన్ డి లోపిస్తే వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు Fiber in Food: రోజూ తినే ఫుడ్‌లో ఫైబర్ సరిపోతోందా? లేకపోతే వచ్చే ప్రమాదకర జబ్బులివే! Afternoon Nap: మధ్యాహ్నం నిద్ర మెదడుకు మంచిదేనా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! Sadhguru Jaggi Vasudev: రోజూ గుడ్లు తినొద్దు..ప్రొటీన్ కోసం ఇవి తినండి:సద్గురు తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... ఐపీఎల్ (IPL) సీజన్ ముగింపు వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఒక ఊహించని... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... తెలంగాణలోని అంగన్‌వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటి నుంచో... లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని...

Andhra Jyothy02 Jun, 07:23 am
త్విశా శర్మ కేసు.. కీలక సాక్షిపై సమర్థ్ స్నేహితుల దాడి

<p><strong>భోపాల్, జూన్ 2:</strong> నటి త్విశా శర్మ కేసులో కీలక సాక్షి అయిన నీరజ్ దూబేపై దాడి జరిగింది. నిందితుడు సమర్థ్ సింగ్ స్నేహితులు నీరజ్‌పై దాడి చేశారు. మే 30వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలో నీరజ్ దూబే సెలూన్ నడుపుతున్నాడు. త్విశా శర్మ కేసులో నీరజ్ కీలక సాక్షిగా మారాడు. దీంతో సమర్థ్ స్నేహితులు నీరజ్‌ను టార్గెట్ చేశారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>కోర్టులో సాక్ష్యం చెప్పొద్దంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. మే 30వ తేదీన నీరజ్‌ తన సెలూన్ సమీపంలో ఉండగా ఐదుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వచ్చీరాగానే నీరజ్‌ను చుట్టుముట్టి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఎదురు తిరిగిన నీరజ్‌పై దాడికి దిగారు. ‘నువ్వు ఎందుకు ఈ కేసులో కీలక సాక్షిగా మారావు?’ అని ప్రశ్నించారు. కోర్టులో సమర్థ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని బెదిరించారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>నీరజ్‌ను విచక్షణా రహితంగా కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. దాడి జరిగిన వెంటనే నీరజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నీరజ్‌కు భరోసా ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై నీరజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ప్రాణాలు పోతాయేమోనని చాలా భయపడ్డాను. నాకు రక్షణ కల్పించమని, న్యాయం చేయమని పోలీసులను కోరాను’ అని అన్నాడు.</p><br/><p>ఇవి కూడా చదవండి</p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/sanjay-manjrekar-urges-caution-over-vaibhav-sooryavanshi-india-selection-hype-srav-1529009.html">టీమిండియాలోకి వైభవ్ ఎంపికపై హడావిడి వద్దు: సంజయ్ మంజ్రేకర్</a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/ktr-predicts-kcr-return-cm-2028-attacks-congress-government-suchi-1529008.html">2028 డిసెంబర్‌లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy02 Jun, 04:15 am
దారుణం.. ఆరుగురు కుటుంబసభ్యులను కాల్చి చంపిన వ్యక్తి

<p><strong>న్యూయార్క్, జూన్ 2: </strong>కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆరుగురు కుటుంబసభ్యులను అతి కిరాతకంగా తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం మధ్యాహ్నం 12.12 గంటల సమయంలో మస్కటిన్‌, పార్క్ ఎవెన్యూలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు మస్కటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఇంట్లో నలుగురు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ నలుగురిని కాల్చి చంపిన వ్యక్తిని 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్‌లాండ్‌గా గుర్తించారు. పోలీసులు ఇంటి దగ్గరకు రావడానికి ముందే అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. మిల్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తిని చంపేశాడు. తర్వాత గ్రాండ్‌వ్యూ ఎవెన్యూలో మరో వ్యక్తిని కాల్చి చంపాడు. అనంతరం ఓ బ్రిడ్జి దగ్గర తుపాకితో కాల్చుకుని ర్యాన్ విల్లిస్ ఆత్మహత్య చేసుకున్నాడు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>పోలీసులు అతడి శవాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ర్యాన్ విల్లిస్‌ చేతిలో హత్యకు గురైన వారందరూ అతడి కుటుంబసభ్యులేనని తేలింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడైంది. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.</p><br/><p>ఇవి కూడా చదవండి</p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-hoists-national-flag-on-telangana-formation-day-vk-1528985.html">రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి</a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cbse-osm-row-centre-seeks-report-over-coempt-contract-warns-of-actionf-sgr-1528982.html">సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy02 Jun, 01:38 am
ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. 33 ఏళ్ల తర్వాత

<p><strong>పాట్నా, జూన్ 2:</strong> 84 ఏళ్ల ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 33 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చటం గమనార్హం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 1992 నవంబర్ 10వ తేదీన వైశాలి జిల్లా, రాఘవ్‌పూర్ గ్రామానికి చెందిన దీప్ రాయ్, ఆయన కుటుంబసభ్యులు అదాలత్ రాయ్ ఇంటి దగ్గర ఉన్న రోడ్డుపై గాజు పెంకులు పేర్చారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>అదాలత్ రాయ్, ఆయన భార్య రామ్‌శకీ దేవి.. ‘రోడ్డుపై గాజు పెంకులు ఎందుకు పేరుస్తున్నారు’ అని దీప్ రాయ్ కుటుంబాన్ని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన దీప్ రాయ్ కుటుంబం అదాలత్ రాయ్ దంపతులపై దాడికి పాల్పడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 1993, మార్చి 13వ తేదీన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1999 జూన్ నెలలో కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. దాదాపు 30 ఏళ్ల నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతూనే ఉంది. నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. కోర్టు పది మంది సాక్ష్యులను విచారించింది. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>ఆధారాలను రివ్యూ చేసిన తర్వాత కోర్టు తుది తీర్పును వెలువరించింది. 84 ఏళ్ల దీప్ రాయ్‌ని దోషిగా తేల్చింది. జూన్ 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈ రోజు దీప్ రాయ్‌కి శిక్ష ఖరారు చేయనుంది. 84 ఏళ్ల దీప్ రాయ్ కేసు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీప్ రాయ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సరిగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.</p><br/><p>ఇవి కూడా చదవండి</p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cbse-answer-sheets-scanned-with-mobile-phones-rahul-gandhi-allegations-against-government-over-exam-tender-scam-student-future-impact-1528967.html">సీబీఎస్ఈ జవాబుపత్రాలు ఫోన్లతో స్కానింగ్‌</a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cockroach-janata-party-chief-abhijeet-deepke-to-visit-india-on-june-6-join-neet-protest-at-jantar-mantar-delhi-1528966.html">6న భారత్‌కు ‘కాక్రోచ్‌’ అధినేత</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>