
హైదరాబాద్ మెట్రో రైలులో నిబంధనలు ఉల్లంఘిస్తూ, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించిన ఒక ప్రయాణికుడికి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. మెట్రో రైలు లోపల ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా, క్రమశిక్షణ తప్పి, సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తించినందుకు గానూ ఆ వ్యక్తిపై చర్యలకు హైదరాబాద్ మెట్రో ఉపక్రమించింది.మెట్రో ప్రయాణికుడి దుశ్చర్యహైదరాబాద్ మెట్రోలో నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో రెండ్రోజుల క్రితం చైతన్య అనే ప్రయాణికుడు ప్రయాణించాడు. ఆ వ్యక్తి సీట్లో కూర్చుని, తన రెండు కాళ్లను మెట్రో కోచ్ కిటికీకి ఉన్న గ్లాస్ స్క్రీన్‌పై పైకి పెట్టి చాలా నిర్లక్ష్యంగా కూర్చున్నాడు. పక్కనే ఇతర ప్రయాణికులు ఉన్నప్పటికీ అతను ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ప్రయాణించాడు.సోషల్ మీడియాలో వైరల్ వీడియో అక్కడ ఉన్న ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా పట్టించుకోకుండా అదే ధోరణిలో ప్రవర్తించాడు. మెట్రో ఆస్తులను పాడుచేసేలా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఉన్న ఈ దృశ్యాన్ని అదే కోచ్‌లో ఉన్న మరొక ప్రయాణికుడు తన మొబైల్‌లో వీడియో తీశాడు.సదరు ప్రయాణికుడు ఆ వీడియోను ఎక్స్ వేదికగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.జరిమానా విధించిన మెట్రో మెట్రోలో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్య ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో మెట్రో అధికారులు తక్షణమే స్పందించారు. సిసిటివి ఫుటేజ్ మరియు ప్రయాణికుడి ప్రయాణ వివరాల ఆధారంగా అతనిని గుర్తించిన అధికారులు, మెట్రో చట్టాల ప్రకారం సదరు ప్రయాణికుడికి రూ. 250 జరిమానా విధించారు.తెలంగాణా బరాబర్ మా అయ్య జాగీరే: పవన్ కళ్యాణ్ కు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్!పోలీస్ కేసు నమోదు.. ప్రయాణికులకు మెట్రో విజ్ఞప్తి ప్రభుత్వ ఆస్తులను గౌరవించాలని, మెట్రో అనేది అందరిదని గుర్తుంచుకోవాలని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.అంతేకాదు అతనిపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో అధికారులు మెట్రో ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మెట్రో రైళ్లు మరియు స్టేషన్ల ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా, మెట్రో నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.