translateexpand_more

Peddi Movie Release Date June 4 News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 05:07 pm
ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం

విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్‌లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్‌లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతటి గొప్ప సబ్జెక్టును తన ముందుకు తెచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఆయన గురువు సుకుమార్‌కు చరణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ లాంగ్ తన పర్సనల్ మూవీ లైబ్రరీలో 'పెద్ది' ఎప్పటికీ టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. "బుచ్చిబాబు నాకు ఈ కథను ఒక సినిమా స్క్రిప్ట్‌లా చెప్పలేదు. ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని నా కళ్లకు కట్టాడు. ఇది ఏదో పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. అట్టడుగుకి పడిపోయిన ఒక సాధారణ మనిషి, తిరిగి లేచి ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా" అని చరణ్ వివరించారు. ఈ సినిమా కోసం పడ్డ శ్రమ గురించి అందరూ మాట్లాడుతుంటే.. "ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు.. ఇష్టంతో, అమితమైన ప్రేమతో చేసిన ప్రయాణం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అనిపించేలా చేసిన సినిమా ఇది" అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు. గతంలో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే తనకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు 'పెద్ది' ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసిందని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.

NTV Telugu29 May, 03:27 am
ఏపీలో పెరిగిన పెద్ది’ టికెట్ ధర.. స్పెషల్ జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం

మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ దగ్గరపడుతున్ననేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి, సినిమా విడుదలకు ఒక రోజు ముందే అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సినిమా రిలీజ్ రోజు అనగా జూన్ 4 నుండి జూన్ 10వ తేదీ వరకు (మొదటి వారం రోజుల పాటు) ప్రస్తుతమున్న టికెట్ ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు మేకర్స్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాకు మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ‘పెద్ది’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ సాధించడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

NTV Telugu01 Jun, 05:11 pm
మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్ టైన్ చేస్తా

దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చరణ్ ఆకాశానికెత్తారు. ప్రీ రిలేజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ "ఈ కథ విన్నాక అసలు బుచ్చిబాబు బుర్ర ఎలా పనిచేస్తుందిరా బాబు అని ఆశ్చర్యపోయాను. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో భారతదేశంలోనే టాప్ 3 లేదా టాప్ 4 దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది" అని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు ఇంతటి వెన్నుముకగా నిలుస్తున్న అభిమానుల గురించే చరణ్ అత్యంత ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభిన్నమైన సినిమా ఒప్పుకోవడానికి తన మనసులోని ఏకైక బలం అభిమానుల ప్రేమేనన్నారు. "మీ కోసమే ఈ సినిమా చేశాను. మీ ఆనందం కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించడానికైనా నేను వెనకాడను. మా నాన్నగారి (చిరంజీవి) కొడుకుగా పుట్టడం, కళ్యాణ్ బాబాయ్ (పవన్ కళ్యాణ్) ఇంట్లో పెరగడం వల్ల కష్టపడటం, సినిమాలు చేయడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. బహుశా వేరే పనులేవైనా తెలిసి ఉంటే నేనింత పెద్ద నటుడిని అయ్యేవాడినేమో కాదేమో! నాకు తెలిసింది ఒకే ఒక్కటి.. అదే సినిమా. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను.. ఇది రాసి పెట్టుకోండి" అంటూ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు. రామ్ చరణ్ ఎనర్జీ, సినిమాపై ఆయనకున్న నమ్మకం చూస్తుంటే జూన్ 4న థియేటర్లలో 'పెద్ది' సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది!