translateexpand_more

Peddi Pre Release Event Vijayawada News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 05:07 pm
ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం

విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్‌లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్‌లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతటి గొప్ప సబ్జెక్టును తన ముందుకు తెచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఆయన గురువు సుకుమార్‌కు చరణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ లాంగ్ తన పర్సనల్ మూవీ లైబ్రరీలో 'పెద్ది' ఎప్పటికీ టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. "బుచ్చిబాబు నాకు ఈ కథను ఒక సినిమా స్క్రిప్ట్‌లా చెప్పలేదు. ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని నా కళ్లకు కట్టాడు. ఇది ఏదో పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. అట్టడుగుకి పడిపోయిన ఒక సాధారణ మనిషి, తిరిగి లేచి ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా" అని చరణ్ వివరించారు. ఈ సినిమా కోసం పడ్డ శ్రమ గురించి అందరూ మాట్లాడుతుంటే.. "ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు.. ఇష్టంతో, అమితమైన ప్రేమతో చేసిన ప్రయాణం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అనిపించేలా చేసిన సినిమా ఇది" అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు. గతంలో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే తనకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు 'పెద్ది' ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసిందని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.

NTV Telugu01 Jun, 11:57 am
రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే

ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఎంత ట్రెండ్ అవుతుందో, రామ్ చరణ్ బాడీగార్డ్ కూడా అంతే ట్రెండ్ అవుతున్నాడు. నిజానికి నాలుగేళ్ల క్రితం నుంచే అతను చరణ్‌కు బాడీగార్డ్‌గా కనిపిస్తున్నాడు. కానీ, ఇటీవల వీడియోల్లో కనిపించడంతో అతను ఎవరా అని ఆరా తీయడం ఎక్కువైపోయింది. అయితే, ఈరోజు విజయవాడలో సాయంత్రం ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ విజయవాడ బయలుదేరి వెళ్లాడు. కానీ, రామ్ చరణ్ కన్నా ముందే సదరు బాడీగార్డ్ వెళ్లి విజయవాడలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ అతను బయటకు వస్తున్న క్రమంలో, రామ్ చరణ్ కోసం అక్కడికి వచ్చిన చాలామంది అభిమానులు సదరు బాడీగార్డ్‌తో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ విమానాశ్రయ సిబ్బంది ఆ బాడీగార్డ్‌కే బాడీగార్డులుగా మారి, అతన్ని అక్కడి నుంచి వాహనం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు విజయవాడలో జరుగుతుండగా, దానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం, రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నారు.

Samayam Telugu01 Jun, 04:48 pm
పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ .. తెలుగు స్పీచ్ తో అదరగొట్టిన జాన్వీ.. మానవా మానవా’ అంటూ నవ్వులు

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. ఇందులో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించింది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్‌ 4న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలోని గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి చరణ్ తో పాటుగా జాన్వీ, జగపతిబాబు, దివ్యందు శర్మ, ఏఆర్ రెహమాన్, రత్నవేలు తదితరులు హాజరయ్యారు. జాన్వీ తెలుగులో మాట్లాడి అలరించింది.''మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 'పెద్ది' సినిమా చూసినప్పుడు కూడా ఇదే ప్రేమతో బయటకి వస్తారని ఆశిస్తున్నాను. అదే మాకు ప్రతిరోజు కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉంటుంది. 'నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం' ఈ సినిమాలో ఉన్న మెసేజ్. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే.. సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్ గా కనెక్ట్ అయి ఉంది. మీరు నా పట్ల చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ ఫుల్ గా ఉన్నాను. ఈ సినిమాతో మీరంతా గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నాను. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను''''పెద్ది' సినిమా రిలీజ్ కు ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్ తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఆయనొక జెమ్. అద్భుమైన నటుడు. బుచ్చిబాబు సర్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. రాండీ నా ఫేవరెట్ డీఓపీ. రెహమాన్ గారు ఒక లెజెండ్. ప్రొడ్యూసర్ సతీష్ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ ని చాలా వండర్ఫుల్ గా మార్చారు. టీమ్ మొత్తం ఈ సినిమాకి తమ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్. మీరు మాకోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువసేపు చూస్తారు. థాంక్యూ సో మచ్'' అంటూ జాన్వీ కపూర్ తెలుగు స్పీచ్ తో అదరగొట్టింది. ఈ సందర్భంగా చిరంజీవి - శ్రీదేవి కలిసి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలోని 'మానవా మానవా' డైలాగ్ చెప్పమని యాంకర్ సుమ కనకాల కోరగా.. జాన్వీ కపూర్ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి నవ్వులు పూయించింది.