Vaartha30 May, 06:40 pm
Komuravelli house burglary: కొమురవెల్లి, మే 30: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీగా బంగారం, వెండి, నగదు అపహరించిన ఘటన శనివారం నాడు వెలుగులోకి వచ్చింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన సార్ల భానుప్రియ, సురేష్ దంపతులు తమ ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ అవకాశాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బెడ్రూమ్లోని బీరువాను పగలగొట్టి, అందులో భద్రపరిచిన సుమారు మూడు తులాలన్నర బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 1,03,500 నగదును దోచుకెళ్లారు. మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం కోసం ఇంటికి వచ్చిన యజమాని సార్ల సురేష్.. ప్రవేశ ద్వారం తాళాలు పగిలి ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యాడు. కంగారుగా లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువా ధ్వంసమై సామాన్లు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. దాంతో ఆయన వెంటనే కొమురవెల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీ తీవ్రతను బట్టి సిద్దిపేట నుండి క్లూస్ టీం (Clues Team) ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర కీలక సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిందితుల గుర్తింపు కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో తాళం వేసిన ఇళ్లను(Komuravelli house burglary) లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు