
ఒకప్పుడు హీరోయిన్ గా చెలామణి అయిన సుష్మిత సేన్ (Sushmita Sen) ఇప్పుడు వయసు కారణంగా సినిమాల్లో నటించడం లేదు. అడపాదడపా వెబ్ డ్రామాలు చేస్తోంది. త్వరలో 51వ బర్త్ డే జరుపుకోనున్న సుష్మితకి ఇంకా పెళ్లి కాలేదు. ఐతే ఇద్దరి పిల్లలని దత్తత తీసుకొంది. ఇక వ్యాపారవేత్త లలిత్ మోడీని ఆ మధ్య పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ వారి బ్రేకప్ వెంటనే జరిగింది. డేటింగ్ పేరుతో లలిత్ డబ్బులు వాడేసింది అనే ఆరోపణలను అతను కొట్టి పారేశారు. ఆమెని గోల్డ్ డిగ్గర్ అని ఆ మధ్య జనం ట్రోల్ చేశారు. గోల్డ్ డిగ్గర్ అంటే ధనవంతులతో ప్రేమాయణాలు సాగించే అమ్మాయిలు. తనకన్నా సుష్మిత ఎక్కువ సంపాదించింది అన్నట్లుగా వివరణ ఇచ్చారు. తాము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు తాను ఒక్క రూపాయి కూడా ఆమె కోసం ఖర్చు పెట్టలేదని చెప్పారు లలిత్. సుష్మితకి తాను నగలు, వజ్రాలు బహుమతిగా కూడా ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. “సుష్మిత డబ్బుల కోసం డేటింగ్ చేసే మనిషి కాదు. ఆమె కష్టపడి పైకి వచ్చింది. స్వతంత్ర భావాలున్న వ్యక్తి. ఆమెకి ఎన్నో వజ్రాలు, నగలు ఉన్నాయి. అన్నీ ఆమె సంపాదించుకున్నవే,” అని చెప్పారు లలిత్.