translateexpand_more

Tollywood News News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media02 Jun, 12:08 pm
హైదరాబాద్ లో వారణాసి మూవీ కోసం ఐమాక్స్ కడుతున్న మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి ఐమాక్స్ ఫార్మాట్ విశేషాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ సర్టిఫైడ్ డిజిటల్ కెమెరాలతో షూట్ చేయడం విశేషం. నిజమైన 1.43:1 ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోతో వస్తున్న మొదటి ఇండియన్ మరియు నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని సాధారణ సినిమా లాగా తీసి ఆ తర్వాత ఐమాక్స్ లోకి మార్చడం లేదు. భారీ వర్టికల్ స్కేల్, ఎపిక్ ప్రపంచాలు మరియు యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చూపించడానికి మొదటి నుండి ఐమాక్స్ కోసమే చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని సరికొత్త దృశ్య అనుభూతిని ఈ సినిమా ద్వారా పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోల వివరాలను పరిశీలిస్తే 1.43:1 రేషియో చాలా ప్రత్యేకమైనది. ఇది పెద్ద ఐమాక్స్ స్క్రీన్ల పూర్తి ఎత్తును కవర్ చేస్తూ 40 శాతం అదనపు వర్టికల్ ఇమేజ్‌ను ఇస్తుంది. ఇదిలా ఉండగా డిజిటల్ ఐమాక్స్ లో ఉండే 1.90:1 రేషియో వెడల్పుగా ఉండి 26 శాతం అదనపు ఇమేజ్‌ను మాత్రమే అందిస్తుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో మహేష్ బాబు భాగస్వామ్యంతో వస్తున్న సరికొత్త ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ఐమాక్స్ స్క్రీన్ గురించి ఒక అప్‌డేట్ వచ్చింది. ఈ కొత్త థియేటర్ కేవలం 1.90:1 ఫ్లాట్ డిజిటల్ ఐమాక్స్ ఫార్మాట్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా ఈ స్క్రీన్ పై పూర్తి స్థాయి 1.43:1 వర్టికల్ వెర్షన్ ప్రదర్శించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మహేష్ బాబు అభిమానులు వారణాసి ఐమాక్స్ ఫార్మాట్ ను ఐమాక్స్ స్క్రీన్ లో చూడవచ్చు. అయితే రాజమౌళి షూట్ చేసిన పూర్తి స్థాయి పొడవైన వెర్షన్‌ను మాత్రం ఇక్కడి ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేరు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికతపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

SkyC Media02 Jun, 11:45 am
పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం పెద్ది. ఈ సినిమాకు సంబంధించిన పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా బడ్జెట్ మొత్తాన్ని తిరిగి రాబట్టడం విశేషం. నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమా కోసం 350 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను జూన్ 4 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుత మార్కెట్ లో ఒక పెద్ద సినిమా విడుదలకు ముందే పూర్తి బడ్జెట్ రికవరీ చేయడం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు పక్కా ప్రణాళికతో నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరలకు విక్రయించారు. దీంతో శాటిలైట్, డిజిటల్, ఓవర్సీస్ హక్కుల రూపంలో నిర్మాతలకు భారీగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ ఒప్పందాలు కూడా ఊహించని రీతిలో భారీ స్థాయిలోనే ముగిశాయి. ఫలితంగా సినిమా విడుదలకు ముందే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా బడ్జెట్ మొత్తం 100 శాతం రికవరీ అయిపోయింది. ఈ బిజినెస్ క్లోజ్ అవ్వడంతో పెద్ది నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లడమే కాకుండా అప్పుడే లాభాల్లోకి వచ్చేసారు. ఫలితంగా జూన్ 4 నుండి థియేటర్ల ద్వారా వచ్చే వసూళ్లు అన్నీ నిర్మాతలకు నికర లాభాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై డిస్ట్రిబ్యూటర్లకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. ప్రస్తుత పోటీ మార్కెట్ లో ఇటువంటి బిజినెస్ డీల్స్ క్లోజ్ అవ్వడం నిజంగా పెద్ద రికార్డు అని చెప్పాలి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తూ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచుతోంది. రాబోయే రోజుల్లో థియేట్రికల్ రన్ ద్వారా ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించే వసూళ్లు ఈ లాభాల శాతాన్ని మరింత పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం సాధించిన ప్రీ రిలీజ్ విజయం టాలీవుడ్ లోని ఇతర పెద్ద సినిమాలకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. రామ్ చరణ్ క్రేజ్ కారణంగానే బిజినెస్ వర్గాల్లో ఈ స్థాయి డిమాండ్ ఏర్పడిందని స్పష్టంగా అర్థమవుతోంది. జూన్ 4 న థియేటర్లలో బొమ్మ పడిన తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Chitrajyothy02 Jun, 10:29 am
దేవుడా.. రామ్ చరణ్ బాడీగార్డ్ మామూలోడు కాదు బాబోయ్

<p>అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే రామ్ చరణ్ (Ram Charan) బాడీగార్డ్ కి అదృష్టం వరించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. అతనే కనిపిస్తున్నాడు. నిజం చెప్పాలంటే బాడీగార్డ్ కే బాడీగార్డ్ కావాల్సివస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కె కుంట (Kevin K Kunta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇతగాడి పేరు మారుమ్రోగిపోతోంది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>తాజాగా పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కెవిన్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షాక్ అయ్యింది. అంతలా కెవిన్ ఏం చేశాడంటే.. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే.. హీరోల వీరాభిమానులు అందరిని దాటుకొని హీరోల వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవడానికి బాడీగార్డ్ లు వస్తారు. వారిని పక్కకు నెట్టి హీరో ఆ అభిమానికి సెల్ఫీ ఇస్తాడు. ఇది ప్రతిసారి జరిగేదే. కానీ, ఈసారి.. చరణ్ దగ్గరకు ఆ అభిమానిని పోనివ్వకుండా మధ్యలోనే కెవిన్ అడ్డుపడ్డాడు. అంతేకాకుండా అతడిని ఒక ఉదుటున ఎత్తిపట్టుకొని ఆమడ దూరంలో పడేశాడు. ఒక మనిషిని ఆ రేంజ్ లో ఎత్తుకొని పక్కన పడేయడం చూసిన జాన్వీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. </p><br/><p>అసలు కెవిన్ అలా ఎలా చేయగలిగాడు .. ఇతను మామూలోడు కాదు బాబోయ్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే కెవిన్ మామూలోడు కాదు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో నివసిస్తూ అక్కడ ప్రొఫెషనల్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా రికార్డులు సృష్టించాడు. ఇటలీలో నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌ గా నిలిచిన కెవిన్, ఎన్నో అంతర్జాతీయ రింగ్ ఫైట్స్‌లో పవర్‌ఫుల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. కేవలం రింగ్ లోపలే కాకుండా, రియల్ లైఫ్‌లో సెలబ్రిటీలు, అంతర్జాతీయ విఐపిలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఆ రేంజ్ రికార్డు ఉండబట్టే చరణ్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నాడు. కెవిన్ కి నెలకు రూ 4 లక్షల జీతమని టాక్. ఇక తన బాడీగార్డ్ గురుంచి చరణ్ సైతం చెప్పుకొచ్చాడు. కెవిన్ ని తన కోసం కాదని.. పిల్లల కోసం నియమించినట్లు తెలిపాడు. ఏదిఏమైనా నాలుగేళ్లుగా చరణ్ కి సెక్యూరిటీగా ఉంటున్న కెవిన్ కి ఇప్పుడు గుర్తింపు వచ్చింది.</p><iframe style="width:360px; height:640px; border:none; display:block; margin:0 auto;"src=" https://www.youtube.com/shorts/yAj-c92LIjQ" title="short video player" scrolling="no" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen loading="lazy"></iframe>

Chitrajyothy02 Jun, 09:27 am
బ్లాస్ట్.. ఏం సినిమారా బాబు.. మెంటలెక్కించేస్తోంది

ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తీసిపడేస్తున్నారు. కంటెంటే ఇప్పుడు కింగ్ అని నిరూపించిన సినిమాల్లో బ్లాస్ట్ జోన్ (Blast Zone) ఒకటి. ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తీసిపడేస్తున్నారు. కంటెంటే ఇప్పుడు కింగ్ అని నిరూపించిన సినిమాల్లో బ్లాస్ట్ జోన్ (Blast Zone) ఒకటి. అర్జున్ సర్జా (Arjun Sarja), అభిరామి, ప్రీతీ ముకుందన్ (Preity Mukundhan) కీలక పాత్రల్లో డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్లాస్ట్. తెలుగులో బ్లాస్ట్ జోన్ పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కేవలం ₹7 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన బ్లాస్ట్ చిత్రం, ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, కేవలం ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.58 కోట్ల నుండి రూ.25 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.09 కోట్ల షేర్ సాధించడమే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహించని విధంగా రూ.5.55 కోట్లు కొల్లగొట్టింది. భారీ ప్రమోషన్లు లేకపోయినా, కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపిస్తూ బ్లాస్ట్ జోన్ బాక్సాఫీస్ వద్ద నిజమైన బ్లాస్ట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏం సినిమా రా బాబు.. మెంటలెక్కించేస్తోంది.. అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాస్ట్ జోన్ కథ విషయానికొస్తే.. రాజారామన్ (అర్జున్ సర్జా) అనే ఒక సాధారణ కరాటే మాస్టర్. ఆయన భార్య (అభిరామి), కూతురు నీల (ప్రీతి ముకుందన్) కూడా మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నిపుణులు. సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా, క్రమశిక్షణతో బ్రతికే ఒక ఆదర్శవంతమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీరిది. ఇక నగరంలో ఒక పెద్ద ఇల్లీగల్ బిజినెస్ డీల్‌కు సంబంధించిన రూ. 1000 కోట్ల భారీ లంచం సొమ్ము చేతులు మారుతుంది. ఈ భారీ స్కామ్ వెనుక ఒక పవర్‌ఫుల్ అండర్ వరల్డ్ డాన్ (జాన్ కొక్కెన్) ఉంటాడు. అయితే, ఊహించని కొన్ని పరిస్థితుల వల్ల ఆ రూ. 1000 కోట్ల అక్రమ సొమ్ము మరియు దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఈ కరాటే మాస్టర్ రాజారామన్ చేతికి చిక్కుతాయి. ఆ డబ్బును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని ఆ క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్ రాజారామన్ కుటుంబంపై దాడికి దిగుతుంది. తన సామ్రాజ్యానికి అడ్డువచ్చిన ఈ చిన్న కుటుంబాన్ని సర్వనాశనం చేయాలన్న డాన్ ప్రయత్నాలు ఫలించాయా .. ? కరాటే మాస్టర్ కుటుంబం.. విలన్స్ కి చుక్కలు చూపించిందా.. ? లేక వారే డాన్ చేతిలో బలయ్యారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Chitrajyothy02 Jun, 04:35 am
మైథలాజికల్ ఫాంటసీ 'జటాయు' వర్కౌట్ అవుతుందా

<p>ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారు. గతంలో ఆయన అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్ కథలతో తీసిన సినిమాలు పరాజయం పాలు అయ్యాయి. దాంతో ప్రతి సినిమా కథ విషయంలోనూ, నటీనటుల ఎంపిక విషయంలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అయినా కూడా కొన్ని సినిమాలు ఊహించని ఫలితాలను అందుకుంటున్నాయి. </p><p>తాజాగా దిల్‌ రాజు 'జటాయు' పేరుతో ఓ మైథలాజికల్‌ ఫాంటసీ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్‌ దేవరకొండతో 'రౌడీ జనార్దన' మూవీ నిర్మిస్తున్న దిల్‌ రాజు... 'జటాయు' సినిమాను సైతం విజయ్‌ తోనే తొలుత ప్లాన్‌ చేశారట. కానీ విజయ్‌ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఇప్పుడు ఈ పాత్రను శ్రీకాంత్‌ తనయుడు, 'ఛాంపియన్‌' ఫేమ్‌ రోషన్‌ మేకాతో చేయించబోతున్నట్టు సమాచారం. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>'జటాయు' సినిమాను ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించబోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా ఆయన ఈ ప్రాజెక్ట్ మీదనే వర్క్‌ చేస్తున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇంద్రగంటి మోహనకృష్ణకు గత కొంతకాలంగా హిట్స్ లేవు. 'సమ్మోహనం' గౌరవప్రదమైన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత తీసిన 'వి' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీనిని దిల్‌ రాజ్‌ నిర్మించారు. 'వి' మూవీ కరోనా టైమ్‌లో రిలీజ్‌ కు సిద్థం కావడంతో తొలుత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసి, ఆ తర్వాత ధియేటర్లలో విడుదల చేశారు. ఇదేమంత గొప్ప విజయాన్ని అందుకోలేదు.</p><p>కెరీర్‌ ప్రారంభంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ సోషియో ఫాంటసీ మూవీని తెరకెక్కించారు. చలం 'దోషగుణం' కథ ఆధారంగా 'గ్రహణం' మూవీ తెరకెక్కించిన ఇంద్రగంటి ఆ తర్వాత రెండో సినిమాగా 'మాయాబజార్‌'ను తీశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాజా, భూమిక కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలై పరాజయంపాలైంది. మళ్ళీ ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ 'జటాయు' పేరుతో మైథలాజికల్‌ ఫాంటసీ మూవీ చేస్తారంటే... జన్‌ జీకి ఈ సినిమా ఎక్కుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి. నిజం చెప్పాలంటే దిల్‌ రాజు తనకు కథ నచ్చకపోతే మూవీని సెట్స్ పైకే తీసుకురారు. కానీ ఆయన 'జటాయు'పై ఇంత ఆసక్తి చూపుతున్నారంటే సమ్‌ థింగ్‌ స్పెషల్ గా ఈ మూవీ ఉంటుందనే విశ్వాసాన్ని సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం... మరి ఏం జరుగుతుందో!</p><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/bollywood/rashmika-mandanna-highest-remuneration-for-cocktail-2-rcb-72261.html"><strong>కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/janhvi-kapoor-counter-to-deepika-padukone-on-tollywood-work-culture-rcb-72257.html"><strong>టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/may-box-office-disappointment-31-releases-no-major-hit-may-72255.html"><strong>Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!</strong></a></p>

Tollywood News News Keyword | Telugu Digital