translateexpand_more

Tv9 Telugu News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 03:29 am
నీకు నేను నాకు నువ్వు అంటున్న మ్యూజిక్ డైరెక్టర్

సాధారణంగా ఒకే రంగంలో ఉన్న నిపుణుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుల విషయంలో ఈ ధోరణికి భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ, సంగీత దర్శకులు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, అద్భుతమైన ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. "నీకు నేను, నాకు నువ్వు" అన్నట్లుగా వారి మధ్య బంధం కొనసాగుతోంది. ఇటీవలి ఉదాహరణలను గమనిస్తే, తమన్ కోసం అనిరుధ్ ఒక పాటను పాడగా, ఇట్లు అర్జున చిత్రంలోని అనిరుధ్ పాడిన "హైరే" పాటకు విశేష స్పందన లభించింది. తమన్, అనిరుధ్ ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఇదే విధంగా, తమన్ తన స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలకు ఎలాంటి ఈగోలు లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మొన్నటికి మొన్న చెన్నై లవ్ స్టోరీ చిత్రంలోని "వదలని" సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు కీరవాణి నుంచి సింజిత్ వరకు పలువురు సంగీత దర్శకులు హాజరయ్యారు. మొత్తంగా, టాలీవుడ్ సంగీత దర్శకుల మధ్య పోటీతో పాటు బలమైన ఐక్యత కూడా ఉంది. మరిన్ని వీడియోల కోసం : పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా? సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు! ‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..

TV9 Telugu01 Jun, 06:34 am
ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్

మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులు ఏం ఆలోచిస్తున్నాయి, వాటికి ఏం కావాలో అర్థం చేసుకోవడం చాలా మంది యజమానులకు ఒక పెద్ద సవాలు. అవి చేసే శబ్దాలను, వాటి భావాలను మనం అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా! సరిగ్గా అలాంటి ఆలోచనతోనే చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ AI ఆధారిత పెట్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. చాలా సినిమాల్లో జంతువులు మనుషులతో మాట్లాడుతుంటాయి. ఇప్పుడు అది నిజ జీవితంలో కూడా జరగబోతోంది. జంతువులు మనతో మాట్లాడే రోజులు వచ్చేశాయి..ఆ ఊహే ఎంత బాగుందో కదా! అదే నిజం కానుంది. ఒక చైనీస్ స్టార్టప్ కంపెనీ అటువంటి AI పెంపుడు జంతువుల ట్రాన్స్‌లేటర్‌ను సృష్టించింది. అది జంతువుల శబ్దాలు, భావోద్వేగాలు, వాటి ప్రవర్తనను దాదాపు 95 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ పరికరం పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య సంభాషణను ఈజీ చేయగలదని ఆ కంపెనీ చెబుతోంది. అలీబాబా క్లౌడ్‌ ఏఐ సాంకేతికతతో పనిచేసే ఆ స్మార్ట్‌ కాలర్‌ పరికరం.. జంతువుల అరుపులు, వాటి శరీర కదలికలను బట్టి అవి ఆకలితో ఉన్నాయా.. సంతోషంగా ఉన్నాయా.. అని సుమారు 95 శాతం కచ్చితత్వంతో కనిపెడుతుంది. వాటి హావభావాలను మైక్రో ఫోన్లు, మోషన్‌ సెన్సార్ల ద్వారా 1.2 సెకన్లలోనే పసిగట్టి.. ‘నన్ను ఒంటరిగా వదిలేయ్‌’, ‘నాతో ఆడుకో’ వంటి భావాలను వాక్యాల రూపంలోకి మార్చి, స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా యజమానులకు వినిపిస్తుంది. యజమానులు మాట్లాడే మాటలను కూడా జంతువులకు అర్థమయ్యే ‘పెట్‌ ఫ్రెండ్లీ’ శబ్దాలుగా ఈ గ్యాడ్జెట్‌ మార్చగలదట. అంటే రెండు వైపులా మాట్లాడుకోవచ్చన్నమాట!.. ఇందుకోసం దాదాపు 10 లక్షల జంతువుల వాయిస్‌ డేటా శాంపిల్స్‌ సేకరించి ఏఐ మోడల్‌కు శిక్షణ

TV9 Telugu01 Jun, 05:08 am
కథ తర్వాత.. కాంబినేషన్ కలిపేయ్ బాసూ

టాలీవుడ్‌లో రిపీట్ కాంబినేషన్ల ట్రెండ్ ప్రస్తుతం బలంగా కొనసాగుతోంది. సీనియర్ నటులతో పాటు జూనియర్లు కూడా గతంలో తమకు విజయాలను అందించిన దర్శకులతో తిరిగి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్‌లో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లు ట్రంప్ కార్డులుగా మారడం గమనించవచ్చు.శ్రీవిష్ణు, సామజవరగమన చిత్ర దర్శకుడు రామప్పరాజు కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీవిష్ణుకు కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇమేజ్ లభించింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రెండో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.విజయ్ దేవరకొండ సైతం టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్‌తో కలిసి రణబాలి అనే పీరియాడిక్ చిత్రాన్ని చేస్తున్నారు. 1854 నుండి 1878 మధ్య రాయలసీమ నేపథ్యంలో సాగే యోధుడి కథ ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా? ‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..

TV9 Telugu31 May, 08:40 am
అప్పట్లో సెన్సేషన్.. అనితా ఓ అనితా సింగర్ ఇప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. కానీ ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతను, ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ బాధితులను ఉర్రూతలూగించిన పాట ‘అనితా.. ఓ అనిత’. యూట్యూబ్, సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ప్రతీ ఒక్కరి ఫోన్ రింగ్‌టోన్‌గా, కాలర్ ట్యూన్‌గా ఈ పాట మారుమోగిపోయేది. ఈ పాట కేవలం ఒక ఆల్బమ్ సాంగ్ మాత్రమే కాదు, ఎంతోమంది ప్రేమికుల వ్యథకు నిలువుటద్దంలా నిలిచింది. ఈ పాట వెనుక ఉన్న కథ కూడా ఎంతో విషాదకరమైనది. ఈ పాటను రాసి, పాడింది నాగరాజు అనే వ్యక్తి. తాను ప్రాణంగా ప్రేమించిన ‘అనిత’ కుటుంబ సభ్యుల అంగీకారం లేక దూరమవ్వడంతో, ఆ విరహ వేదనను భరించలేక, తన మనసులోని బాధను పాట రూపంలోకి మార్చారు. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. నెల రోజుల పాటు కష్టపడి రాసిన ఈ పాట, విడుదలైన తర్వాత సంచలనం సృష్టించింది. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు నిజాలే పాటగా మారడంతో, అది ప్రజలకు అంతలా కనెక్ట్ అయ్యింది. అయితే, ఈ పాట తర్వాత నాగరాజు జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఒకానొక దశలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం పాన్ షాప్ కూడా పెట్టుకున్నారంటే ఆయన పడిన కష్టాలు అర్థం చేసుకోవచ్చు. కానీ, తనపై తనకున్న నమ్మకంతో మళ్లీ కళా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం

TV9 Telugu31 May, 02:29 am
ఆ హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది.. ఆర్జీవీ అలా అంటారనుకోలేదు.. టాలీవుడ్ హీరో

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా మారారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. హీరోగానే కాకుండా నటుడిగా, విలన్ పాత్రలతోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సమవర్తి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే డైరక్టర్ ఆర్జీవీతో తనకున్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ నటించిన సినిమా జ్యోతిలక్ష్మీ. ఈ చిత్రంలో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఒక పాటను చూసి డైరెక్టర్ ఆర్జీవీ పూరీతో మాట్లాడుతూ.. "హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది." అని అన్నారట. ఈ విషయం తెలిసి తాను కాస్త బాధపడ్డానని.. కనీసం సినిమా పూర్తిగా చూడకుండా కేవలం ఒక పాట చూసి వర్మ ఎలా అంటారని ఫీలయ్యానని అన్నారు. కానీ తర్వాత కథ ఊహించని మలుపు తిరిగింది. ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

TV9 Telugu01 Jun, 02:33 am
ఇదెక్కడి క్రేజ్ మావ.. థియేటర్లలోకి వచ్చినట్లే తెలీదు.. కట్ చేస్తే.. ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతుంది

ఇటీవల కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ ఏడాది క్రితం బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఓ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సత్తా చాటుతుంది. ధర్మ మహేష్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా పేరు డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మించారు. డ్రింకర్ సాయి మూవీకి తిరుమల శెట్టి దర్శకత్వం వహించగా.. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు, హై బడ్జెట్ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు మేకర్స్. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. 2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం అంతగా కమర్షియల్ హిట్ కాలేదు. ఐఎమ్డీబీలో 8.7 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ట్రాప్ ట్రెండింగ్ చిత్రాల్లో మొదటి స్థానంలో ఉందంటే ఓటీటీలో ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చెప్పక్కర్లేదు. మే 27 నుంచి ఈ చిత్రం జీ5లో అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య

TV9 Telugu31 May, 06:37 am
ఫిదా అయిపోవాల్సిందే భయ్యా.. జీవితం గురించి చెప్పిన త్రివిక్రమ్.. అస్సలు మిస్ అవ్వకండి

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినమాలకు, ఆయన డైలాగ్స్, మాటలు అంటే యువతకు తెగ ఇష్టం. ఆయన సినిమాల్లో సత్యాలు, కుటుంబ బంధాలపై ఇప్పటివరకు ఎన్నో విషయాలను అందిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులకు చేరవేస్తుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ జీవితం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కళలకు సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి ఉండదని, అవి కేవలం సమాజంలోని లోపాలను లేదా జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. ఈ మార్పుల దిశగా చట్టసభలు కృషి చేయాలన్నారు. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్.. ఋగ్వేదం మానవ శాస్త్రాన్ని (ఆంథ్రోపాలజీ) వివరిస్తుందని, ప్రకృతిని అర్థం చేసుకోవడం, భయాన్ని అధిగమించడం, నియంత్రించడం ద్వారా ఫ్యాన్లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు వంటి ఆవిష్కరణలకు దారితీసిందని వివరించారు. యజుర్వేదం జీవనశైలిని మెరుగుపరచడం, యాంత్రికీకరణ (మెకనైజేషన్) గురించి తెలియజేస్తుందని, సామవేదం సంగీతం, కళలు, సాహిత్యం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని అన్నారు. ఆకలి, దాహం ఉన్నప్పుడు సంగీతం కంటే మంచి నీళ్లే ముఖ్యమని, ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాతే కళలను ఆస్వాదించగలమని బాలమురళీకృష్ణ కీర్తనను ఉదాహరణగా చెప్పారు. ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? సినిమాను అందమైన అబద్ధం అని పిలవడం సరికాదని, అది సమాజంలో ఏం జరుగుతుందో చూపే ఒక “అందమైన అద్దం” అని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి సినీ దర్శకుడు, రచయిత, నటుడు, అలాగే మీడియాలో ఉన్న ప్రతి

TV9 Telugu01 Jun, 05:28 am
ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్

డైరెక్టర్ తేజ సంచలన చిత్రం ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, తన గ్లామర్, నటనతో మెప్పించిన హీరోయిన్ రీమా సేన్. ఆ తర్వాత ‘మనసంతా నువ్వే’, ‘అదృష్టం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ, గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కో-స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ , దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లో వర్క్ చేసిన స్టార్ హీరోల గురించి రీమా సేన్ మాట్లాడుతూ.. మొదటగా తన తొలి చిత్రం ‘చిత్రం’ , ‘మనసంతా నువ్వే’ కో-స్టార్ ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావించారు. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఉదయ్ కిరణ్ చాలా సైలెంట్ పర్సన్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన ఒక ఇంట్రోవర్ట్ (ఎక్కువగా మాట్లాడని వ్యక్తి) అని, సెట్స్‌లో ఎంతో పద్ధతిగా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవారని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ ఎంతో ప్రైమ్ అండ్ ప్రాపర్‌గా ఉంటూ, "రీమా గారు.. ఎలా ఉన్నారు?" అంటూ చాలా సాఫ్ట్‌గా మాట్లాడేవారని ఆమె తెలిపారు. ఇక మాస్ మహారాజా రవితేజ గురించి రీమా సేన్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. రవితేజ తనకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని ఆమె స్పష్టం చేశారు. ‘అదృష్టం’ , ‘వీడే’ చిత్రాలలో రవితేజతో కలిసి నటించిన రీమా.. ఆయనతో ఉన్న బాండింగ్ గురించి చెప్తూ, "రవితేజ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఆయనతో నాకు చాలా గొప్ప ఫ్రెండ్‌షిప్ ఉంది"

TV9 Telugu01 Jun, 03:49 am
ఆ పాట వల్లనే తెలుగులో నాకు మంచి పేరు వచ్చింది.. ఎప్పటికీ మర్చిపోలేను.. సింగర్ చిత్ర

దక్షిణాది సినీ ప్రియులకు సింగర్ చిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా వివిధ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తనదైన ముద్ర వేసింది. టాలీవుడ్‌లో ఆమెకు, ఆమె పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని దశాబ్దాలుగా వేలాది అద్భుతమైన పాటలతో శ్రోతలను అలరిస్తున్న చిత్ర.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సంగీత ప్రయాణం, కెరీర్‌లో అందుకున్న అత్యుత్తమ ప్రశంసలు, బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గీతాంజలి’ తెచ్చిపెట్టిన విజయం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో ప్రేక్షకుల నుంచి అందుకున్న అత్యుత్తమ కాంప్లిమెంట్ (ప్రశంస) ఏంటని అడగ్గా, చిత్ర ఎంతో వినమ్రంగా సమాధానమిచ్చారు. సాధారణంగా అందరూ బాగా పాడతారని చెప్తారని, కానీ తన మనసుకు బాగా నచ్చిన, ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస మాత్రం ఒకటేనని అన్నారు. నాన్‌-తెలుగు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తాను పాడే తెలుగు పాటలు వింటుంటే, ఒక ‘తెలుగు అమ్మాయి’ పాడుతున్నట్లే ఉంటుందని ప్రేక్షకులు చెప్పడం తనకు లభించిన అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో.. ఇదే ఇంటర్వ్యూలో మణిరత్నం-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘గీతాంజలి’ సినిమా ప్రాముఖ్యతను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇళయరాజా సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా తర్వాతే చిత్రకు తెలుగులో అవకాశాల వెల్లువ కురిసింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో, మెలోడీల నుంచి ఊరమాస్ సాంగ్స్ వరకు అన్ని రకాల పాటలు పాడే అవకాశాలు

TV9 Telugu01 Jun, 03:05 am
ట్రోల్స్, ఫేక్ అకౌంట్స్, పైరసీపై యుద్ధం

రామ్ చరణ్ పెద్ది చిత్రం నిర్మాతలు, సోషల్ మీడియాలో పెరుగుతున్న ప్రతికూలత, నకిలీ ఖాతాలు, సైబర్ నేరాలు, పైరసీ బెదిరింపులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. టీవీ9 నివేదిక ప్రకారం, పెద్ది బృందం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి స్పష్టమైన హెచ్చరిక సందేశాన్ని జారీ చేసింది.ఈ చర్యలలో హైకోర్టు రక్షణను ఆశ్రయించడం కూడా ఉంది, తద్వారా ఆన్‌లైన్ దుష్ప్రచారాన్ని, సినిమాకు హాని కలిగించే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. టాలీవుడ్‌లో సైబర్ క్రైమ్‌ను అరికట్టడానికి, సినిమా విడుదలకు ముందు లేదా తరువాత పైరసీని నిరోధించడానికి ఇలాంటి చర్యలు చాలా ముఖ్యమైనవి. పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?

TV9 Telugu31 May, 01:48 pm
అతను చాలా మంచి నటుడు.. సరైన అవకాశాలు వస్తే రాణిస్తాడు

ప్రముఖ డైలాగ్ రైటర్, నటుడు బీవీఎస్ రవి తన రచనా ప్రస్థానానికి సత్యం సినిమా ఎలా ఉపయోగపడిందో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. సత్యం సినిమా కోసం కథా రచన అనుభవాలను బీవీఎస్ రవి పంచుకున్నారు. మొదట శ్రీచందన అనే కథను సుమంత్ కోసం రాశానని, దానిని అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియకు వివరించానని చెప్పారు. సుప్రియకు ఆ కథను బాగా నచ్చి సుమంత్‌కు వినిపించారు. అయితే, సుమంత్ కూడా ఓకే తెలిపిన తర్వాత, నాగార్జున గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అనూహ్య పరిణామం ఎదురైంది. అప్పటికే మన్మథుడు చిత్రీకరణలో ఉన్న నాగార్జున, తమ కాలేజీ కథ సుమంత్‌కు సరిపోదని, అతనికి వరుస ఫ్లాపులు ఉన్నాయని, కాబట్టి మరో కథను చేయమని సూచించారని బీవీఎస్ రవి గుర్తుచేసుకున్నారు. హీరో మంచివాడై ఉండి, అందరూ తిడుతుంటే, అతని గొప్పదనం ఎవరికీ తెలియని కథను తీసుకురావాలని నాగార్జున చెప్పారట. నాగార్జున సూచనల తర్వాత, బీవీఎస్ రవికి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చెల్లెలి కాపురం సినిమా గుర్తుకొచ్చిందట. ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే ఒక కవి, తన చెల్లెలి పెళ్లి కోసం మరో కవి దగ్గర ఘోస్ట్ రైటర్‌గా పనిచేసే కథాంశం అది. దానికి మార్పులు చేసి కొత్త కథను రూపొందించారట. ఈ కొత్త కథాంశం నాగార్జునకి బాగా నచ్చింది. అక్కడికక్కడే సినిమాను నిర్మించడానికి సుప్రియకు సూచనలు ఇచ్చారటనాగ్ . అలాగే రవి మాట్లాడుతూ.. సత్యం సినిమా విజయానికి సంగీత దర్శకుడు చక్రి, గీత రచయితలు కందికొండ, భాస్కరభట్లల పాత్ర ఎంతో కీలకమని బీవీఎస్ రవి అన్నారు. చక్రి పాటల కోసం పడిన తపనను, కందికొండ 'మధురమే

TV9 Telugu31 May, 12:38 pm
స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి.. చివరకు 22ఏళ్ల వయసులోనే

తెలుగు సినిమా రంగంలో ఫటాఫట్ జయలక్ష్మి ఒక ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె అసలు పేరు నీరజా రెడ్డి, 1958 నవంబర్‌లో చెన్నైలో జన్మించారు ఆమె. జయలక్ష్మి తండ్రి, దశరథరామి రెడ్డి, నెల్లూరుకు చెందిన ప్రముఖ కో-డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే డబ్బింగ్ ఇంచార్జ్. రజినీకాంత్‌కు కూడా ఆయన వాయిస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినీ వాతావరణంలో పెరిగిన జయలక్ష్మి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆమె నటనా రంగ ప్రవేశానికి ప్రముఖ నటి వాణిశ్రీ ప్రోత్సాహం లభించింది. వాణిశ్రీ ఆమెను ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో ఒక పాత్రలో నటించేలా చేశారు. ఆ తర్వాత ఆమె ప్రతిభ ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దృష్టిని ఆకర్షించింది. బాలచందర్ గారి చిత్రాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేయడం ద్వారా జయలక్ష్మి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆమె కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించారు. ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే రజినీకాంత్‌తో కలిసి ముల్లు మలరం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆరడిరుందు అరబతు వరై చిత్రంలో రజినీకాంత్ భార్య పాత్రలో ఆమె చేసిన త్యాగపూరిత నటనకు రజినీకాంత్ ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనను "నన్ను మించిపోయింది" అని రజినీకాంత్ పేర్కొన్నారు. బాలచందర్ దర్శకత్వంలో స్వర్గం నరకం చిత్రంలో ఆమె ఈగోయిస్టిక్, పొసెసివ్ పాత్రలో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాత్ర సంసారాన్ని స్వర్గం చేసుకోవాలన్నా, నరకం చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉందనే కాన్సెప్ట్‌ను చూపించింది. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ తో యుగపురుషుడు, కృష్ణ గారితో రామ్ రాబర్ట్ రహీం వంటి చిత్రాల్లోనూ

TV9 Telugu31 May, 11:07 am
వారెవ్వా..! ఈ హీరోయిన్.. మహేష్ బాబు అతిథి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా.!! ఎంత మారిపోయింది

సూపర్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన సూపర్ స్టైలిష్ మూవీ అతిథి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. కానీ ఈ సినిమాకు ఉన్న క్రేజే వేరు.. ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇటీవలే అతిథి సినిమా రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో సందడి చేసింది. మరోసారి అతిథి సినిమాను థియేటర్స్ లో చూసి తెగ ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్ ఈక్రమంలో అతిథి సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అతిథి సినిమాలో

TV9 Telugu31 May, 08:06 am
నా కోసం ఆ డైరెక్టర్ ఇంటికొచ్చేసాడు.. చెప్పుతో కొడుతా అని.. మిర్చి మాధవి కామెంట్స్

సీరియల్ మిర్చి మాధవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు. తన సినీ జీవితం ప్రారంభంలో ఎదురైన ఒక వ్యక్తిగత చేదు అనుభవాన్ని మాధవి వివరించారు. ఒకప్పుడు తాను అమాయకురాలిగా, ఇన్నోసెంట్‌గా ఉండేదాన్నని తెలిపారు. ఒకసారి, దిల్సుఖ్ నగర్‌లోని తన ఇంటికి ఒక వ్యక్తి దర్శకుడని చెప్పుకుంటూ వచ్చాడని, ఆ సమయంలో తన తల్లి, ఇంట్లో పని చేసే అమ్మాయి ఉన్నారని చెప్పారు. సినిమా అవకాశాల కోసం వచ్చిన ఆ వ్యక్తి, తాను మామూలు కాటన్ చీర కట్టుకున్నప్పుడు, దాన్ని మార్చి “ఫాలీ” (సింథటిక్) చీర కట్టుకోమని అడిగాడని తెలిపారు. అప్పుడు వెంటనే తనకు ఆ వ్యక్తి ఉద్దేశం అర్థమైందని, అతన్ని “దొంగనా కొడుకు” అని తిట్టి, చెప్పు తీసుకొని కొడతాను బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పానని మాధవి వెల్లడించారు. ఆ సమయంలో షాక్‌కి గురైనా, తలుపులు లాక్ చేసి ముగ్గురు ఆడవాళ్లం ఉన్నప్పుడు ఏమి జరిగేదో అని తర్వాత భయపడినట్లు తెలిపారు. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్.. ఆ ఘటన తర్వాత తన తల్లి, అప్పట్లో ఫిర్యాదు చేస్తే ప్రయాస అవుతుందని భావించి, దానిని వదిలేయమని చెప్పినట్లు మాధవి గుర్తు చేసుకున్నారు. తప్పు జరిగినప్పుడు తాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని, తన హక్కుల కోసం 100% నిలబడతానని ఆమె తేల్చి చెప్పారు. తనను తాను “బ్లడీ ఫూల్” అని తిట్టుకుంటూ స్వీయ విశ్లేషణ చేసుకుంటానని, లేకపోతే నార్సిసిస్ట్ అవుతామని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరినీ ఉద్ధరించనని, డబ్బులు చెల్లిస్తేనే శిక్షణ ఇస్తానని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. పరిశ్రమలో తన విషయంలో ఏదైనా

TV9 Telugu31 May, 07:57 am
జ్యోతిక తర్వాత నా ఫేవరేట్ హీరోయిన్ ఆమెనే.. అద్భుతమైన హీరోయిన్.. హీరో సూర్య

తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కాంబినేషన్లలో హీరో సూర్య, నటి అసిన్ కాంబో ఒకటి. ముఖ్యంగా గజినీ (Ghajini) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగాఓ ఇంటర్వ్యూలో నటి అసిన్ గురించి హీరో సూర్య మాట్లాడిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో సూర్య తన ఫేవరెట్ కో-స్టార్స్ గురించి ప్రస్తావిస్తూ, తన భార్య జ్యోతిక తర్వాత తనకు నచ్చిన బెస్ట్ యాక్ట్రెస్ అసిన్ అని స్పష్టం చేశారు. అసిన్ ఎంతో ప్రొఫెషనల్ ,అద్భుతమైన నటి మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా అని కొనియాడారు. స్క్రీన్ పై ఆమె ప్రెజెన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, మేకప్‌కు ముందు.. మేకప్ తర్వాత ఆమె లుక్స్, హావభావాలు పూర్తిగా మారిపోతాయని సూర్య నవ్వుతూ పంచుకున్నారు. విభిన్న భాషలను చాలా త్వరగా నేర్చుకోవడంలో అసిన్ ది బెస్ట్ అని సూర్య ప్రశంసించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒక అగ్ర స్థానానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా టాలెంట్ ఉండాలని, అసిన్ లో ఆ ప్రతిభ పుష్కలంగా ఉందని అన్నారు. బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి 'గజినీ' హిందీ రీమేక్‌లో నటించడం, అక్కడ కూడా అంతే కాన్ఫిడెంట్‌గా మెప్పించడం ఆమె కమిట్‌మెంట్‌కు నిదర్శనమని సూర్య పేర్కొన్నారు. ఆ నమ్మకమే ఆమెను అంతటి స్థాయికి తీసుకెళ్లిందని, కెరీర్‌లో ఆమె ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందంటూ ఆకాంక్షించారు. అదే ఇంటర్వ్యూలో మరో నటి తమన్నా గురించి కూడా సూర్య చిన్న వ్యాఖ్య చేశారు. తమన్నా కూడా చాలా చిన్న వయసులోనే భాషలను సులువుగా

TV9 Telugu30 May, 01:44 pm
కాజల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్

కాజల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్కాజల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్ 30 May 2026 Pic credit - Instagram Phani Ch నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ జాతర మొదలైనట్టే! ప్రస్తుతం ఆయన వరుస హిట్స్ తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న 'NBK 111' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అ దిరిపోయే అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ సినిమాకు ముందుగా నయనతార హీరోయిన్‌గా అనుకోగా కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం లేదా మరేదైనా కారణం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య, కాజల్ కలిసి 'భగవంత్ కేసరి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం నందమూరి అభిమానులకు ఒక తీపి కబురు అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. బాలయ్య మార్క్ డైలాగులకు తోడు, కాజల్ గ్లామర్ మరియు యాక్టింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. దర్శకుడు బాబీ గతేడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు బాలయ్యను మరింత ఊరమాస్ లుక్‌లో చూపించడానికి పక్కా ప్లాన్ చేశారు. మరిన్ని వెబ్ స్టోరీస్‌ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్‌లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న

TV9 Telugu31 May, 06:16 am
అతడు తల్చుకుంటే మళ్లీ స్టార్ హీరో అవకాశాలున్నాయ్.. కానీ.. రాజీవ్ కనకాల కామెంట్స్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజీవ్ కనకాల. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఇండస్ట్రీలో తనకున్న సన్నిహిత స్నేహాల గురించి , తోటి నటుల కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) , లవర్ బాయ్ తరుణ్ (Tarun) లతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. కెరీర్ ప్రారంభం నుండి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనిపై రాజీవ్ మాట్లాడుతూ… “గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్టీఆర్‌ని కలవడం కొంచెం తగ్గింది. దానికి కారణం ఆయన తన సినిమాలతో ఎంతో బిజీగా ఉండటం, అలాగే ఇద్దరికీ కుటుంబ బాధ్యతలు పెరగడమే. కానీ మా మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఇటీవల ‘RRR’ సినిమాలో కూడా నేను నటించాను, అందులో ఎన్టీఆర్ పాత్రను ఇంట్రడ్యూస్ చేసేది నా పాత్రే కావడం విశేషం. అప్పుడప్పుడు లొకేషన్‌కి రమ్మని ఎన్టీఆర్ పిలుస్తుంటారు, కానీ కుదరక వెళ్ళలేకపోతుంటాను” అని తెలిపారు. ఒకప్పుడు వరుస విజయాలతో లవర్ బాయ్‌గా దూసుకుపోయిన తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తరుణ్‌తో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని రాజీవ్ చెప్పారు. తరుణ్ కెరీర్ గురించి మాట్లాడుతూ, ఆయన తలుచుకుంటే ఇప్పటికైనా ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్రలే కాకుండా, హీరోగానే ఉంటూ విభిన్నమైన, కొత్త తరహా పాత్రలను

TV9 Telugu31 May, 04:06 am
స్టార్ హీరో కావాల్సినోడు.. ఒక్క రాత్రితో జీవితం ముగిసిపోయింది.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే

మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో యశో సాగర్ గుర్తున్నాడా.. ? 2008లో విడుదలైన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ మూవీతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాలో స్నేహా ఉల్లాల్ సరసన నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు, తన 23వ ఏట డిసెంబర్ 25, 2012న జరిగిన రోడ్డు ప్రమాదంలో యశో సాగర్ మరణించారు. పూణే నుండి బెంగళూరుకు కారులో వస్తుండగా, కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా సమీపంలో కారు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆయన స్నేహితుడు విశ్వనాథ్ రెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరణించే సమయంలో ఆయన 'మిస్టర్ ప్రేమికుడు' అనే తన రెండవ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో.. తాజాగా టాలీవుడ్ నటుడు పింగ్‌పాంగ్ సూర్య ఓ ఇంటర్వ్యూలో యశో సాగర్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. యశో సాగర్ చాలా మంచి వ్యక్తి అని, అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నారు. షూటింగ్ రాయచూర్‌లో జరిగిందని, అక్కడ ఒక పవర్ ప్లాంట్ కాలనీలో కాఫీ డే సెట్ వేసినట్లు వివరించారు. ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్‌ను చూసినప్పుడు రాజమౌళి, చంద్ర సిద్ధార్థ్ వంటి గొప్ప దర్శకులను చూసిన అనుభూతి కలిగిందని సూర్య తెలిపారు. కరుణాకరన్, అప్పటికి కొత్తవారైన హీరో

TV9 Telugu01 Jun, 12:43 pm
గ్రాండ్ గా పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా చేరుకున్న అభిమానులు

పెద్ది ఈవెంట్ గ్రాండ్ జరగనుండటంతో భారీగా అభిమానులు చేరుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.. విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఏర్పాటు చేసిన మూవీ టీమ్.. రామ్ చరణ్ కటౌట్స్ తోపాటు బుచ్చిబాబు, జాన్వీకపూర్ కటౌట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు పహిల్వాన్ గెటప్ లో ఉన్న కటౌట్స్ వైరల్ అవుతున్నాయి మరికాసేపట్లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే స్టేడియం కు భారీగా అభిమానులు చేరుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన ( నేడు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు ‘పెద్ది’ టీమ్. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. అభిమానులు ఇప్పటికే స్టేడియం బయట భారీగా చేరుకున్నారు.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

TV9 Telugu31 May, 01:39 am
ఏందీ మేడమ్ ఈ గ్లామర్ మేకోవర్.. బలగం నటిని గుర్తుపట్టారా

తెలుగు సినీ రంగంలో ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో బలగం ఒకటి. ఈ సినిమా ఎంతో మంది నటీనటుల జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా తెలంగాణ పల్లె సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అప్పటి వరకు కమెడియన్ గా, సహయ నటుడిగా రాణించిన వేణు యెల్దండి ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్.. ఈ సినిమాలోని ప్రతీ సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా జానపద గీతాలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ద్వారా పాపులర్ అయినవారిలో రూపాలక్ష్మీ ఒకరు. ఇందులో కొమురయ్య కూతురు లచ్చవ్వ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన, సహజత్వం లచ్చవ్వ పాత్రకు ప్రాణం పోశాయి. బలగం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాతో ఆమె పెరు మారుమోగింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. చాలా కాలంగా సైలెంట్ అయిన ఆమె తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియోతో మరోసారి తెరపై హాట్ టాపిక్ అయ్యింది. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ

TV9 Telugu31 May, 02:24 am
మెగా ఫైనల్ కు ముందే గుజరాత్ టైటాన్స్ కు షాక్.. ఆర్సీబీ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లేనా

IPL 2026 Final : ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైన వేళ, గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఒక ఊహించని తిప్పలు ఎదురయ్యాయి. మే 31 ఆదివారం నాడు నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో టైటిల్ పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ మహా సంగ్రామానికి కేవలం 24 గంటల ముందు గుజరాత్ జట్టు ప్రయాణంలో వాతావరణం పెద్ద రచ్చ సృష్టించింది. చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ చేరుకోవాల్సిన శుభ్‌మన్ గిల్ సేన.. ఉత్తర భారతదేశంలో ముంచెత్తిన తుఫాను, భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. న్యూ చండీగఢ్ వేదికగా మే 29న జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ఘనంగా అడుగుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం శనివారం (మే 30) మధ్యాహ్నమే గుజరాత్ టీమ్ చండీగఢ్ నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్ ఎక్కాల్సింది. కానీ పంజాబ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న ఇసుక తుఫాను, ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో గిల్ అండ్ కో ప్రయాణం గంటల కొద్దీ ఆలస్యమైంది. విమానం ఆలస్యం కావడంతో శనివారం అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత గానీ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు అహ్మదాబాద్‌లోని తమ హోటల్ గదులకు చేరుకోలేకపోయారు. సాధారణంగా ఇలాంటి పెద్ద మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి చాలా అవసరం. శనివారం నాడు గుజరాత్ టీమ్ ఎలాంటి ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకోనప్పటికీ, ప్రయాణంలో జరిగిన ఆలస్యం వల్ల ఆటగాళ్లు తీవ్ర అలసటకు గురయ్యారు. సరిగ్గా రెస్ట్ తీసుకునే టైమ్ కూడా

TV9 Telugu31 May, 02:55 am
బాక్సాఫీస్ రికార్డ్.. విడుదలకు ముందే రూ.350 కోట్లు.. 10 రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్స్

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా దృశ్యం 3. మలయాళీ నటుడు మోహన్ లాల్ హీరోగా, డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. జార్జ్ కుట్టి మోహన్ లాల్ కుటుంబంలో వెలుగులోకి వచ్చిన తదుపరి రహస్యాలు.. వరుణ్ హత్య కేసు కొనసాగింపు.. ఆ తర్వాత ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అనేది సినిమా. మే 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ తమ మూడవ చిత్రంలోనే అందరినీ ఆశ్చర్యపరచడంతో, దృశ్యం 3 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా దూసుకుపోతుంది. విడుదలై పది రోజులు గడిచినప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ప్రస్తుతం థియేటర్లను ఊపేస్తున్న ఈ సినిమా శనివారం మరిన్ని కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం ఇప్పుడు మరో మైలురాయిని దాటింది. నివేదికల ప్రకారం పదవ రోజు రూ.5.05 కోట్ల వసూల్లు రాబట్టింది. అంతకు ముందు రోజు దేశంలో రూ.4.30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.105.94 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నిన్న ఒక్క రోజే విదేశాలలో రూ.6 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.219.69 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో

TV9 Telugu31 May, 03:33 pm
నా అందానికి రహస్యం అదే.. సీరియల్ బ్యూటీ లహరి ఆసక్తికర కామెంట్స్

ప్రముఖ సీరియల్ నటి లహరి ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ అలాగే వ్యక్తిగత జీవితం గురించి వివరించారు. తన సహజ సౌందర్య రహస్యంపై అడిగిన ప్రశ్నకు, ఇది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని, తన తల్లి నుంచి వచ్చిన బహుమతి అని ఆమె తెలిపారు. అలాగే ప్రత్యేకంగా తన చర్మ సంరక్షణకు ఎక్కువ కష్టపడనని, సాధారణ ఆహారపు అలవాట్లతో ఉంటానని లహరి తెలిపారు. కెరీర్ విషయానికి వస్తే, లహరి ఇప్పటివరకు దాదాపు ఇరవై సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చారు లహరి. ప్రస్తుతం పలు ఈవెంట్‌లతో పాటు తన యూట్యూబ్ ఛానెల్‌తో కూడా తాను బిజీగా ఉన్నానని, కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తున్నానని చెప్పారు. షూట్ గ్యాప్‌లలో కుటుంబాన్ని చూసుకుంటానని, సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని లహరి తెలిపారు. ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే తాను చేసిన అన్ని పాత్రలను ఇష్టపడతానని, తనకు నచ్చని పాత్ర అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. సీరియల్ కథలు, పాత్రల కొనసాగింపు జనాల రేటింగ్స్‌పై ఆధారపడి ఉంటాయని ఆమె వివరించారు. ప్రేక్షకులు చూడకపోతే సీరియల్‌ నిలిచిపోతుందని, ఒక పాత్రను ఎక్కువగా చూస్తే కొనసాగిస్తారని, లేకపోతే తీసేస్తారని లహరి పేర్కొన్నారు. సీరియల్ పరిశ్రమలో ఏమైనా జరగవచ్చని, రచయితల చేతుల్లో కూడా పూర్తి నియంత్రణ ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ప్రతికూలతలను, దుఃఖాన్ని తన దరిచేరనీయనని లహరి తెలిపారు. ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్ చిన్న విషయాలను సీరియస్‌గా తీసుకోనని, దానివల్ల మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటానని చెప్పారు. తాను ప్రశాంతమైన

TV9 Telugu31 May, 05:03 am
ప్రతీ పార్టూ పవర్ ఫులే.. మటన్ అంటేనే మంచిది మావ.. 99శాతం మందికి తెలియని రహస్యం ఇది

చికెన్, ఫిష్, రొయ్యల బిర్యానీలు, కర్రీలు ఎన్ని ఉన్నా.. మటన్ (మేక మాంసం) బిర్యానీ, కూరల రుచి – దాని డిమాండ్ వేరు. ఫంక్షన్లు, పార్టీలలో మటన్ లేకపోతే ఆ విందు అసంపూర్ణంగా భావిస్తారు. మటన్ కేవలం రుచికి మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. మటన్‌లో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్ B12, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, రక్తహీనతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. మటన్ మాంసం మాదిరిగానే.. ప్రతి భాగం కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మటన్‌లో ఉండే ప్రతి భాగం.. లివర్, కాళ్లు, తలకాయ.. బోటి.. ఇలా అన్ని విభిన్న ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.. వాటి గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. మటన్ లివర్: మటన్ లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఐరన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. వారాంతంలో మటన్ లివర్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మేక కాళ్లు -పాయ: మేక కాళ్లతో చేసే సూప్ ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. మేక కాళ్లను కాల్చి తయారుచేసే ఈ సూప్ తాగడం వల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు వంటి సాధారణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు విరిగిన వారికి లేదా ఎముకల బలహీనత ఉన్నవారికి మటన్ బోన్ సూప్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎముకలను బలంగా మారుస్తుంది. మేక తలకాయ: మేక తలకాయలో కొవ్వు శాతం కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ,

TV9 Telugu30 May, 05:31 am
ఇండియన్స్ అంటే.. అక్కడ కూలీలే’.. భారతీయ మూలాలపై గర్వంగా చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని, భారత సంతతికి చెందిన కమలా ప్రసాద్ తన పూర్వీకుల మూలాలు భారత్‌లో ఉండటం పై గర్వంగా ఉందన్నారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు. కమల మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని చూసే వారికి తగిన విధంగా సమాధానమిచ్చారు. ట్రినిడాడ్‌లో ఈ రోజుకీ భారతీయులను ‘కూలీలు’ అని పిలుస్తారు కానీ తను ఆ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదనీ ఆ ‘కూలీల’ కష్టం, రక్తం, చెమట వల్లే ఆ దేశం అభివృద్ధి చెందిందనీ కమల అన్నారు. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నాననీ ఆమె అన్నారు. తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి ఆందోళన కానీ, సిగ్గు కానీ లేదనీ చెప్పుకొచ్చారు. ట్రినిడాడ్‌ జనాభాలో 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్‌ను కూడా తెచ్చారనీ ఆమె చెప్పారు. స్వదేశం వీడి శతాబ్దాలైనా..నేటికీ అక్కడి భారతీయులు తమ కట్టూబొట్టూ, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె తెలిపారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు కమలా ప్రసాద్ తెలిపారు. 1866 నుంచి 1917 వరకు, ఆ ద్వీపాన్ని భారతీయ కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్‌గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారట. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ ట్రినిడాడ్ దేశంలో పర్యటించారు. దాంతో

TV9 Telugu01 Jun, 02:09 am
కోహ్లీ బౌలర్ కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్ చేస్తే.. ఆ లిస్ట్ లో నెంబర్ వన్ గా

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 టైటిల్‌ను సగర్వంగా కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో రజత్ పాటిదార్ తన జట్టుకు వరుసగా రెండవ ఐపీఎల్ టైటిల్‌ను అందించినట్లయింది. ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన, ఆ తర్వాత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీ తోడవడంతో బెంగళూరు ఈజీగా విజయం సాధించింది. అయితే టైటిల్ చేజారినప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఒక అరుదైన అవార్డు లభించింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఈ సీజన్‌లో అత్యధికంగా 29 వికెట్లు పడగొట్టి ప్రతిష్టాత్మక పర్పుల్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య టైటిల్ కోసం జరిగినప్పటికీ, తెరవెనుక భువనేశ్వర్ కుమార్ – కగిసో రబాడాల మధ్య అత్యధిక వికెట్ల రేసు కూడా అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందే రబాడా కేవలం ఒకే ఒక్క వికెట్ ఆధిక్యంలో ఉన్నాడు. అంతకుముందు జరిగిన 16 మ్యాచ్‌లలో రబాడా 28 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 15 మ్యాచ్‌లలో 27 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీనివల్ల ఫైనల్ మ్యాచ్‌లో ఎవరైనా అద్భుతం చేస్తే పర్పుల్ క్యాప్ రేసు ఎటువైపైనా తిరిగే అవకాశం కనిపించింది. ఈ రేసులో మొదట ఆర్‌సీబీ స్టార్ భువనేశ్వర్ కుమార్ గుజరాత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయడం ద్వారా మొదటి అడుగు వేశాడు. అయితే ఈ వికెట్ కేవలం రబాడా వికెట్ల సంఖ్యను సమం

TV9 Telugu01 Jun, 02:47 am
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. రన్నరప్ తోపాటు హైదరాబాద్ కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా

IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 మహా సంగ్రామం ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విజేతగా అవతరించింది. ఈ అద్భుత విజయంతో ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ఆర్సీబీ జట్టు భారీగా ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌తో పాటు మిగిలిన జట్లకు దక్కిన ప్రైజ్ మనీని ఓసారి చూద్దాం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోట్ల వర్షం.. ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ పీఠాన్ని అధిరోహించింది. టోర్నీ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు సాధించిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించిన ఆర్సీబీకి బీసీసీఐ భారీ నజరానా అందించింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు ఏకంగా రూ. 20 కోట్ల సింహభాగాన్ని ప్రైజ్ మనీ రూపంలో కైవసం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచి తృటిలో కప్పు చేజార్చుకున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ. 12.5 కోట్ల నగదు బహుమతి లభించింది. మిగిలిన జట్లకు దక్కింది ఎంత? ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్ చేరలేకపోయిన మరికొన్ని జట్లు కూడా కోట్ల రూపాయలను ఆర్జించాయి. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఓటమిపాలై మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్ల భారీ నగదు లభించింది. అదేవిధంగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. కింగ్ కోహ్లీ విశ్వరూపం.. మ్యాచ్‌ను మార్చేసిన రన్ మెషీన్.. లక్షలాది మంది అభిమానులతో

TV9 Telugu01 Jun, 08:18 am
ప్రపంచ సినిమా ప్రేక్షకులను షేక్ చేస్తోన్న 7 కోట్ల హాలివుడ్ సినిమా

హాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక చిన్న సినిమా పెద్ద సంచలనంగా మారింది. యువ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. కేవలం 7 నుంచి 9 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, తాజాగా 148 మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా దాటేసింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1,400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాధారణ యువకుడు తన ప్రేమను పొందాలనే ఉద్దేశంతో ఓ అతీంద్రియ శక్తులు ఉన్న మాయా వస్తువును ఉపయోగిస్తాడు. అయితే అతను కోరుకున్న కోరిక నిజమవుతుంది. కానీ ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే భయానక పరిణామాలు, మానసిక సంఘర్షణలే ‘అబ్సెషన్’ కథ. ప్రేమ, వ్యామోహం, భయం అనే మూడు అంశాలను కలిపి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టేలా దర్శకుడు కథను నడిపించాడు. అతి తక్కువ లొకేషన్లు, పరిమిత పాత్రలు, చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ప్రస్తుతం హాలీవుడ్‌లో పెద్ద స్టూడియో సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండో వారంలో కూడా వసూళ్లు పెరగడం హాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం థియేటర్లలో ‘మైఖేల్’, ‘ది డెవిల్ వేర్స్ ప్రాడా 2’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నప్పటికీ.. ‘అబ్సెషన్’ తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాకు వస్తున్న అద్భుత స్పందనతో ఇప్పటికే సీక్వెల్‌పై చర్చలు మొదలైనట్లు హాలీవుడ్ వర్గాలు

TV9 Telugu30 May, 05:47 am
ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు

భారతదేశంలో నేడు ‘ఆధార్’ లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి వచ్చింది. కేవలం ఒక గుర్తింపు కార్డుగా ప్రారంభమైన ఆధార్, నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్‌ను నిలిపివేసి, సరికొత్త యాప్‌ను తీసుకురావడంతో పాటు భద్రతా నియమాలను కఠినతరం చేయడంతో ఆధార్ ప్రస్థానం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు ఆధార్ ఎప్పుడు ప్రారంభమైంది? కాలక్రమేణా ఇందులో ఎలాంటి మార్పులు వచ్చాయి? చిన్న పిల్లలు, విద్యార్థులకు ఆధార్ నియమాలు ఏమిటి? ఆన్‌లైన్‌లో ఏ వివరాలు మార్చుకోవచ్చు? నేను మీకు మొత్తం డీటైల్స్ చెబుతాను. చాలా ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ఆధార్ ఎప్పుడు ప్రారంభమైంది?.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆధార్ ప్రాజెక్టుకు 2009లో అంకురార్పణ జరిగింది. అధికారికంగా 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా తెంబిలి గ్రామానికి చెందిన ఒక మహిళకు దేశంలోనే మొట్టమొదటి ఆధార్ కార్డును జారీ చేశారు. పౌరుల వేలిముద్రలు, కంటిపాప స్కాన్ వంటి బయోమెట్రిక్ సమాచారంతో కూడిన 12 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. దీని ద్వారానే పదిహేడు వందలకు పైగా పౌర సేవలు, సామాజిక పథకాలు అందుతున్నాయి. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడానికి, మొబైల్‌ సిమ్‌ కార్డులు తీసుకోవడానికి ఆధార్‌ తోడ్పడుతోంది. దలకు ప్రత్యక్ష నగదు బదిలీ, ఇతర సంక్షేమ పథకాలను అందించడానికి-జన్‌ధన్‌ బ్యాంక్‌ అకౌంట్లు, ఆధార్‌ బయోమెట్రిక్‌ గుర్తింపు, మొబైల్‌ అనుసంధానతకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రత్యక్ష నగదు బదిలీలను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా 4.15 కోట్ల నకిలీ ఎల్‌పీజీ కనెక్షన్లు, 5.3 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులు తొలగించగలిగారు. దానివల్ల

TV9 Telugu29 May, 03:37 pm
రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో

కోలీవుడ్ , టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. నటుడిగా, డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా రాఘవ లారెన్స్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. సాధారణంగా తన సినిమాలతో, అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించే లారెన్స్, వ్యక్తిగత విషయాల్లో చాలా నిరాడంబరంగా ఉంటారు. ఓవైపు సినిమాల్లో నటించడం.. మరోవైపు సామాజిక సేవ చేయడంలో బిజీగా ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మందికి తనవంతు సాయం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన తన భార్య లతతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి.. రాఘవ లారెన్స్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. డ్యాన్స్ మాస్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, తన కష్టంతో, ప్రతిభతో నటుడిగా, దర్శకుడిగా ఎదిగారు. 1999లో వచ్చిన ‘స్పీడ్ డ్యాన్సర్’ అనే తెలుగు సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో ‘ఉన్నై కొడు ఎన్నై తరువెన్’ వంటి సినిమాలతో తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘ముని’ సినిమాతో దర్శకుడిగా మారి, ఆ తర్వాత ‘కాంచన’ సిరీస్‌తో హారర్-కామెడీ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్.. సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ,