translateexpand_more

Cockroach Janta Party News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media03 Jun, 11:02 am
ఇన్ స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం

ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ సృష్టించిన హడావుడి గురించి కేటీఆర్ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ సాటిరికల్ మరియు మీమ్ ఆధారిత అకౌంట్ దాదాపు 10 నుంచి 15 మిలియన్ ఫాలోయర్స్ మార్కును దాటేసింది. యువతలో ఉన్న ఫ్రస్ట్రేషన్, సాధారణ అసంతృప్తి మరియు మీమ్స్ ఆధారంగా ఈ అకౌంట్‌కు ఇంతటి ఖ్యాతి లభించింది. అయితే ఈ పరిణామాన్ని అతి సరళీకరణ చేసి ఇదొక "జెన్ జీ విప్లవం" అని చెప్పడం మాత్రం కొంత అతిగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మే 2026 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బీజేపీ అధికారిక అకౌంట్‌కు సుమారు 8.7 మిలియన్ ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక అకౌంట్ కూడా దాదాపు 13 మిలియన్ ఫాలోయర్స్ చుట్టూనే ఉంది. దీంతో రెండు ప్రధాన రాజకీయ పార్టీల కంటే కూడా ఈ సాటిరికల్ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఇప్పుడు ఫాలోయర్స్ సంఖ్యలో ముందంజలో నిలిచింది. ఈ వేగవంతమైన వైరల్ ఫెనామెనాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఫాలోయర్స్ నాణ్యతపై రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన వివాదం రాజుకుంది. ఇందులో ఉన్న ఫాలోయర్స్ చాలామంది పాకిస్తాన్ మరియు ఇతర విదేశాల నుంచి వచ్చారని, భారతదేశం నుంచి తక్కువేనని బీజేపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వాహకులు తమ అకౌంట్‌కు ఉన్న ఫాలోయర్స్ లో 94 శాతం కంటే ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారని డేటా పెట్టారు. ఈ డేటా పాలిటిక్స్ సోషల్ మీడియాలో ఇంకా వివాదాస్పదంగానే కొనసాగుతోంది. ఈ ఉద్యమం మొదట కేవలం ఒక సాటిరికల్ మూవ్‌మెంట్‌గా ప్రారంభమైంది. ఫలితంగా ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు దీన్ని ఒక నిజమైన రాజకీయ ఆందోళనగా కూడా చూడటం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి వైరల్ ట్రెండ్స్ సోషల్ మీడియాలో తరచుగా వస్తూనే ఉంటాయని గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వారు చెప్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ పెరిగినంత మాత్రాన అవి ఎన్నికల్లో ఓట్లుగా మారవనేది వాస్తవం. ఎన్నికల్లో ఎప్పుడైనా గ్రౌండ్ రియాలిటీ, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు మరియు అభివృద్ధి వంటి అంశాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. బీజేపీ పాలనపై దేశంలోని యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉందనే పాయింట్‌ను కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. యువతలో నైరాశ్యం ఉందనే మాట నిజమే కావచ్చు. కానీ ఈ సమస్యలన్నింటికీ అంతా బీజేపీయే తప్పు అని చెప్పడం ఎంతమాత్రం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దేశంలో ఉన్న ఎన్నో రకాల సమస్యలు కాంగ్రెస్ పాలనలో కూడా ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రీజినల్ పార్టీల పాలనలో కూడా ఇవే సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి యువత అసంతృప్తిని కేవలం ఒకే పార్టీ ఖాతాలో వేయలేము. సోషల్ మీడియా ట్రెండ్స్ ఎలా ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ప్రజల నిజజీవిత సమస్యలే ఓటింగ్ సరళిని శాసిస్తాయి.

Samayam Telugu29 May, 09:35 am
కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా ఎందుకు బ్లాక్ చేశారు

రచయిత గురించిజౌడి జ్యోతిజౌడి జ్యోతి సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలతోపాటు తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జ్యోతి తెలంగాణ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ చదివారు. అనంతరం ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, ఫిల్మీబీట్ సంస్థల్లో ఆమె పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలతోపాటు రాజకీయ, సినిమా తదితర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కుటుంబంతో కలిసి కొత్త ప్రదేశాలను సందర్శించడం ఆమెకు ఇష్టం.... ఇంకా చదవండి

Zee Telugu27 May, 12:44 am
కాక్రోచ్ జనతాపార్టీ ఎజెండా ఏమిటి..? ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్న లింకు ఇదే

Cocroach Janatha Party in Political Parties: సమాజంలో స్థితిగతులను మార్చేవిధంగా దేశ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలని కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. నిరుద్యోగుల్లో అంతర్లీనంగా ఉన్న ఆవేదన... కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు దారితీసింది. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంశాలు ఇపుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాకు పనిచేసిన వారిలో ఒకరైన అభిజీత్ దిప్కే ఈ పార్టీని స్థాపించారు. దేశ వ్యవస్థల్లో పారదర్శకత, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాన్య ప్రజల హక్కులను కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా పనిచేసేలా తమ పార్టీ ఉంటుందని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులు బొద్ధింకల్లాంటివారన్న వ్యాఖ్యలతో ఆవేదనకు గురై ఆ పేరుతోనే రాజకీయ పార్టీ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. నిరుద్యోగుల చేత, నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల ద్వారా నిర్వహించే కాక్రోచ్ జనతా పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తుందని ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాలో ఫాలో అయ్యే వారి సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరిగిపోయింది. పార్టీ పెట్టిన రెండు వారాల్లోనే 20 మిలియన్లకు పైగా ఫాలోయర్లు పెరిగిపోయారు. అయితే ఇవన్ని ఎక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అమెరికా, టర్కీ వంటి దేశాల్లో ఉంటున్న వారే దీనికి ఫాలోవర్స్ పెరిగారు. మన దేశంలో పెద్దగా ఫాలోవర్స్ లేరు. అయితే అమెరికాలో భారత్ కు వ్యతిరేకంగా అంటే బీజేపీ వ్యతిరేకంగా పనిచేసే డీప్ స్టేట్ ఈ పార్టీ వెనక ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. గతంలో వారు ప్రయోగించిన ఆప్ పార్టీ ఫెల్యూర్ కావడంతో ప్లాన్ బీగా కాక్రోచ్ పార్టీ పేరుతో ముందుకొచ్చినట్టు కొంత మంది

Sakshi23 May, 08:06 pm
అభిజీత్‌ దీప్కే (కాక్రోచ్‌ జనతా పార్టీ) రాయని డైరీ

- May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM కొన్నిసార్లు అవకాశాలను భగవంతుడు కల్పిస్తాడు. - మరికొన్నిసార్లు భారత ప్రధాన న్యాయమూర్తి! - నాకసలు ఏ ఉద్యమమూ చేపట్టాలని లేదు.

10TV Telugu27 May, 01:05 pm
దేశంలో మరో కొత్త పార్టీ.. కాక్రోచ్ జనతా పార్టీ టైప్ లో.. ఇది కార్పొరేట్ మజ్దూర్.. దీనిలో చేరాలంటే

Corporate Majdoor Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ.. దేశంలో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ పార్టీ. ఈ కొత్త పార్టీకి యువత నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. దీనికి వచ్చిన అపూర్వ స్పందన చూసి జాతీయ పార్టీలే షాక్ అయ్యాయి. తాజాగా దేశంలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ టైప్ లోనే వచ్చింది. ఇంతకీ కొత్తగా వచ్చిన పార్టీ ఏంటి, అందులో చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసుకుందాం.. భారత దేశానికి ఇప్పుడే ఒక కొత్త రాజకీయ పార్టీ వచ్చింది. అది కూడా ఆఫీసు కార్యాలయాల కోసమే. అదే కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ అయిన వెను వెంటనే, ఒక మాజీ అమెజాన్ ఉద్యోగి ఈ ‘కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ’ని ప్రారంభించారు. వారి డిమాండ్లు ప్రతి ఆఫీసు ఉద్యోగికి తెలిసినవే. ఉద్యోగ భద్రత నుండి మానవతా దృక్పథంతో కూడిన పని పరిస్థితుల వరకు ఈ పార్టీ డిమాండ్లు ఉన్నాయి. ఇవి భారతీయ నిపుణులు ప్రతిరోజూ ఎదుర్కొనే విషయాలే. ఆ మాజీ అమెజాన్ ఉద్యోగి ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఇలా రాశారు. “‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ల ఫాలోవర్లను దాటిన తర్వాత, నేను నా సొంత పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. అదే ‘కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ’.” ‘కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ’ కొన్ని కీలక వాగ్దానాలు.. 1. వారానికి 4 రోజుల పని. 5 రోజుల పాటు పనిని ఆస్వాదిస్తున్నట్లు నటించడం చాలా ఎక్కువ కాబట్టి, 4 రోజుల పని వారం. 2. “క్విక్ కాల్?” అనే సందేశాలను చట్టపరంగా