translateexpand_more

Ktr News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 06:59 am
డిసెంబర్ లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఆపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని వ్యాఖ్యానించారు. లివింగ్ లెజెండ్ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ వచ్చాక నోరుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'ఎత్తిన జెండా దించనని.. జెండా దించితే రాళ్లతో కొట్టిచంపమని అన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 2028 డిసెంబర్‌లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నెత్తురు పారిన చోట సాగు నీళ్లు తీసుకువచ్చింది కేసీఆర్ అని తెలిపారు. లక్షా 65 వేల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అని.. అల్పకులు ఏది పడితే అది మాట్లాడతారని మండిపడ్డారు. దేశమంతా కాంగ్రెస్‌ను వదిలించుకుందన్నారు. తెలంగాణను కాంగ్రెస్.. కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని వ్యాఖ్యానించారు. రైతులు.. అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. కృష్ణా, గోదావరిని గురువుకు గురుదక్షిణగా రేవంత్ ఇస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ వచ్చి చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బయటికి వస్తారా.? రైతుబంధు లేదు.. కానీ రాహుల్ గాంధీ బంధు టింగ్ టింగ్ అని వెళ్తోంది. తెలంగాణ తల్లి ఒడ్డాణం, కిరీటం ఎత్తుకుపోతున్నారు’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌‌మీట్.. ఆసక్తికర పోస్ట్ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్‌ గౌడ్

10TV Telugu02 Jun, 06:50 am
తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ

KTR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం పలువురు తెలంగాణ కళాకారులను కేటీఆర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. Also Read : Pawan Kalyan : అటు సభకు నో పర్మిషన్.. ఇటు తెలంగాణ ఆవిర్భావం వేళ పవన్ కామెంట్స్.. ‘ఈ నేల నుంచే..’ వేటగాడు చెప్పే పిట్టకథలు నిజం కావొద్దు అనుకుంటే సింహం తన కథ తను చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గురించి మనమందరం చెప్పుకోవాలని అన్నారు. 2028 డిసెంబర్‌లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. అందరి జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్. అబద్ధాలు, అభూత కల్పనలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొనితెచ్చుకున్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను మరో 20 యేండ్లు వెనక్కి నెట్టింది. కేసీఆర్ హయంలో వడ్డించిన విస్తరాకును కుక్కలు చింపిన విస్తరాకుల రేవంత్ రెడ్డి చేశాడు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. యూరియా ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంటలు కొనలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం సంక్షోభంలో కూరుకొని పోయింది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క ఇటుక పెట్టకుండా 4 లక్షల కోట్ల అప్పు చేశారు. రైతు బంధు బంద్ ఆగింది, రాహుల్ బంద్ కొనసాగుతుంది. అధికారంకోసం ఆరాటం ఏం లేదు, అధికారం వస్తే వస్తుంది లేకపోతే లేదు. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తూ ముష్కరులపాలైందన్న కేటీఆర్.. మనమందరం కలిసి తెలంగాణను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.