translateexpand_more

Brs Party News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana31 May, 12:25 pm
పూటకో పార్టీ మారుతవ్ .. నువ్వా నా గురించి మాట్లాడుతున్నవ్

Harish Rao | తాను పార్టీ మారే వ్యక్తి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి చిల్లరాయన.. ఇప్పటికీ చాలా సార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు అసలు ఓ క్రెడిబులిటీ ఉందా..? నాలుగు పార్టీలు మారినోడు.. రోజుకు నాలుగు అబద్దాలు మాట్లాడేటోడు. 400 అబద్దపు హామీలిచ్చి అడ్డదారిలో అధికారమెక్కినోడు. పంద్రాగస్టుకల్లా రుణమాఫీ చేస్తమని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు. ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్‌ రెడ్డి మాటలకు ఓ విలువ ఉన్నదా..? అని అన్నారు. అబద్దాలు చెప్పుడు.. అడ్డమైన మాటలు మాట్లాడుడు. అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు. అబద్దాల గారడీతో కాలం వెళ్లదీసుడు తప్ప. నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా రేవంత్‌ రెడ్డి అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా..? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని 65 రోజులైనా రైతు బంధు ఎగబెట్టింది నువ్వు కాదా…అసలు నాలుగు పార్టీలు మారింది నువ్వు.. పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రేవంత్‌ రెడ్డి నా గురించి మాట్లాడుతడా..? నేనిప్పటికీ వందసార్లు చెప్పిన నా జీవితమంతా కేసీఆర్.. నేను బతికున్నంత కాలం బీఆర్‌ఎస్‌ అని వందసార్లు.. ఇంకా వందసార్లు చెప్తా. అసలు నీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కుందా..?

AP7AM01 Jun, 10:48 am
కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాశారని, అందుకే వారికి మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం జడ్జీలు, జర్నలిస్టులు, నటీనటులు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేసి, వారిని బెదిరించి నియంత్రించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దీన్ని ఒక రాక్షస క్రీడగా, క్రూరమైన, వ్యవస్థీకృత నేరంగా అభివర్ణించారు. ఈ చర్యల వల్ల ఎంతోమంది బాధితులుగా మారారని ఆయన పేర్కొన్నారు."కేసీఆర్‌కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదు" అని తేల్చిచెప్పిన యెన్నం, ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే, తమకు ఓటు వేయని వారిని గుర్తించి వేధించేందుకు మళ్లీ భారీస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే లక్షలమంది ఫోన్లపై నిఘా పెడతారని ఆరోపించారు.

TeluguOne30 May, 06:59 am
బాల్క సుమన్ అరెస్ట్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గతంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి కేసులో కూడా బాల్క సుమన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. తాజాగా మరోసారి అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, అధికార పార్టీ మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటోందని చెబుతోంది. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చెల్లెలి మార్ఫింగ్ ఫోటోలతో అన్నకు బెదిరింపులు...యువకుడి అరెస్ట్

Sakshi31 May, 08:32 am
సర్ ’పై అప్రమత్తంగా ఉండాలి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్‌లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్‌ ప్రారంభమవుతుందని.. సర్‌’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి

Zee Telugu31 May, 11:30 am
దమ్ముంటే రేవంత్ రెడ్డి 420 హామీలు అమలు చేయాలి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Congress 420 Promises: తెలంగాణలో సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించి ప్రతి సవాల్‌ విసిరారు. దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని రేవంత్‌ రెడ్డి ప్రకటించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్‌ చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి రేవంత్‌ రెడ్డి మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: Alcohol Consumption: దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌.. మద్యపానంలో జాతీయ రికార్డు బద్దలు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, యువ నాయకుడు మన్నె క్రిశాంక్‌తో కలిసి పాల్గొన్న కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. 'డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కట్టకుంటే ఎన్నికల్లో పోటీ చేయం, మోటార్లకు మీటర్లు పెట్టకుంటే పోటీ చేయం అన్న సవాళ్లు కాకుండా, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే పోటీ చేయమని ప్రకటించాలి' అంటూ కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్‌ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పాడనని గుర్తుచేశారు. 'సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని

Zee Telugu31 May, 04:36 pm
ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లు కలకలం.. తెలంగాణ బీజేపీ ఖండన

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Eatala Rajender Poster: తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఈటల రాజేందర్‌పై జరుగుతున్న ప్రచారం ఒక్కసారిగా కలకలం రేపింది. బీఆర్‌ఎస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా కొనసాగిన ఈటల బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుండడం రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ క్రమంలో ఉన్నఫళంగా హైదరాబాద్‌లో పోస్టర్లు, బ్యానర్లు కలకలం రేపాయి. బీజేపీకి శాపంగా ఈటల మారాడని ప్రచారం జరగడంతో తెలంగాణ బీజేపీ స్పందించింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక ప్రకటన విడుదల చేశారు. తమ ఎంపీ ఈటల రాజేందర్‌పై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకత్వం ఖండించింది. ఈటలను కించపరిచేలా ఏర్పాటుచేసిన బ్యానర్లను తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ప్రకటించారు. ఇది ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని.. తెలంగాణ బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల అసురక్షిత భావానికి నిదర్శనం అని తెలంగాణ బీజేపీ తెలిపింది. 'దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌.. ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని కించపరిచే ప్రయత్నం చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ఠ' అని తెలంగాణ బీజేపీ నాయకత్వం తెలిపింది. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేని అధికార పార్టీతో పాటు ఇతర ప్రత్యర్థి శక్తుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరగాలని

Zee Telugu01 Jun, 07:00 pm
స్వరాష్ట్ర తెలంగాణకు 12 ఏళ్లు.. రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు ఇలా తెలపండి

Happy Telangana Formation Day 2026 Wishes In Telugu: బానిస బతుకులు బరిసెల్లా తిరగబడిండ్రు. కనిపించిన ప్రతిదీ వారి చేతిలో ఆయుధంగా మారింది. ఎలాంటి హింసాత్మకంగా ఉద్యమం కొనసాగి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. స్వరాష్ట్రంగా ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విషెస్‌ ఇలా చెప్పండి. Telangana Formation Day 2026 Wishes: పరాయి ప్రాంతపు వారి పాలనలో దోపిడీకి గురయిన తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షలు తీర్చుకుని ప్రత్యేక రాష్ట్రంగా 14 ఏళ్లు పూర్తయ్యింది. 60 ఏళ్ల ఉమ్మడి ఏపీ, పదేళ్ల తర్వాత అభివృద్ధికి దిక్సూచిగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు మీకు తెలిసిన బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి 60 ఏళ్ల తండ్లాట.. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష వేలాది మంది అమరవీరుల బలిదానాలు లక్షలాది మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు నిత్యవసంతం నా తెలంగాణ.. నిండైన మాగాణం నా తెలంగాణ నిజామ్‌ను పరుగెత్తించిన పౌరుషం నా తెలంగాణ ప్రజా వ్యతిరేక దురంహకారులకు బుద్ధి చెప్పింది నా తెలంగాణ ఆత్మగౌరవ పతాక నా తెలంగాణ.. అమరుల త్యాగాల ఫలం నా తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరి.. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఈ శుభదినాన అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పాటు వివక్షకు గురయిన ప్రాంతం 6 దశాబ్దాల పోరాట తెలంగాణ 12 ఏళ్ల అభివృద్ధి తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంగా రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలం ఉద్యమ సారథి కేసీఆర్‌ పోరాట ఫలితం 60 ఏళ్ల పరాయి పాలన అంతమైన చారిత్రక సందర్భం 4 కోట్ల ప్రజల స్వరాష్ట్ర కల సాకారమైన శుభదినం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు ఇప్పుడు ఇంకెన్నడూ కాదని నిర్విరామ పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన తెలంగాణ కేసీఆర్‌ పదేళ్ల పాలనతో వలసల తెలంగాణ.. అభివృద్ధిలో భారీ విజయాన్ని సాధిస్తూ.. అనేక అవార్డులు పొందుతున్న శుభ సందర్భంగా మీకు ఇదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు.

AP7AM30 May, 03:22 pm
మోటార్లకు మీటర్లు... బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకే 'రైతు డిస్కం' ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ, బీఆర్ఎస్‌కు సంచలన సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించినా, ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, తాము మీటర్లు పెట్టకుండా ఉచిత విద్యుత్‌ను విజయవంతంగా కొనసాగిస్తే, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందా? అని నిలదీశారు.'రైతు డిస్కం' ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన, అంతరాయం లేని ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, జవాబుదారీతనం పెంచడమే దీని లక్ష్యమని తెలిపారు. దేశంలోనే ఇలాంటి ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. బ్లాక్‌మెయిల్ చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని, ఎలాంటి ప్రతిపాదన లేకుండానే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావుపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని, వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లోనే ఉంటానని కేసీఆర్‌పై ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు.ధాన్యం కొనుగోలు అంశాన్ని కూడా ప్రస్తావించిన సీఎం, మద్దతు ధర

Andhra Jyothy27 May, 03:40 pm
మహిళల సంక్షేమం గురించి బీఆర్ఎస్ ఆలోచించలేదు

పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా, మే 27: పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, చివరకు మహిళల భవిష్యత్తుకు భరోసానిచ్చే 'అభయహస్తం' ప్రాజెక్టును కూడా కాలరాసి పక్కన పడేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా లోకానికి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తోందని.. అందులో భాగంగానే మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్ల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 66 వేల కోట్ల రుణాలను ఇప్పించిన ఘన చరిత్ర ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళల క్షేమం, వారి ఆర్థిక పురోభివృద్ధే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల దిగజారుడు ప్రకటనలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి

Andhra Jyothy23 May, 11:34 pm
ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామనడం బీఆర్‌ఎస్‌ బాధ్యతారాహిత్యం

- Home » Telangana » Sridhar Babu Criticizes BRS Over Future City Issue and Reaffirms Life Sciences Park Plan in Telangana ABN , Publish Date - May 24 , 2026 | 05:04 AM ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కాన... - స్వార్థ రాజకీయాలతో ఆ పార్టీ ‘చీప్‌, డైవర్షన్‌ పాలిట్రిక్స్‌’ ఆ భూముల్లో లైఫ్‌ సైన్సెస్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కానీ... - సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Zee Telugu25 May, 04:44 pm
సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్,...

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ...

Zee Telugu24 May, 10:53 am
KT Rama Rao: మూసీ ప్రాజెక్టు పేరిట రేవంత్‌ రెడ్డి రూ.లక్షల కోట్ల దోపిడీ: కేటీఆర్‌

- జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. - ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. - గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Zee Telugu24 May, 09:53 am
KTR: కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్‌ పోతుంది.. కరెంట్‌ కష్టాలు వస్తాయి: కేటీఆర్‌

- జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. - ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. - గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Namasthe Telangana28 May, 11:29 am
తెలంగాణ పట్ల అక్కసు వెళ్లగక్కుతున్న టీడీపీ.. బక్కని నర్సింహులు కామెంట్స్ పై జీవన్ రెడ్డి

Jeevan Reddy | టీడీపీ నాయకుడు బక్కని నరసింహులు ఒక తెలంగాణ బిడ్డ అయి ఉండి తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం టీడీపీ అహంకార పూరిత చర్యలకు నిదర్శనం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. టీడీపీ మహానాడులో బక్కని నర్సింహులు కామెంట్స్‌పై జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ నేటికీ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ పట్ల టీడీపీకి ఉన్న అక్కసు వెళ్లగక్కుతున్నారు. నరసింహులు వ్యాఖ్యలు టీడీపీకి సంబంధం లేకుంటే తక్షణమే చంద్రబాబు నాయుడు ఖండించాలి. ఇంతవరకు నరసింహులు వ్యాఖ్యలను ఖండించకపోవటంతో ఆయన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలుగా భావించాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమాల గడ్డ.. నైజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి, నక్సల్ బరి ఉద్యమానికి ప్రతీక.. తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని త్యాగం చేసి, ఉద్యమ పార్టీ నెలకొల్పి, దేశంలో అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఒప్పించి, రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసిఆర్ దక్కుతుందన్నారు. – బక్కని నర్సింహులు pic.twitter.com/cYHOO1dS9D

Zee Telugu25 May, 03:30 pm
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు...

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడ...

AP7AM01 Jun, 12:42 pm
పవన్ కల్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పన్నెండేళ్లు పూర్తయిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బీఆర్ఎస్ పార్టీ కావాలనే వైషమ్యాలు రెచ్చగొడుతోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే సభల పేరుతో తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే మాత్రం తాము చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత జగన్ తో కలిసి కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నాడు ఏపీ ఎన్నికల్లో జగన్ వ్యతిరేకులను ఓడించడానికి కేసీఆర్ అన్ని విధాలుగా తెరవెనుక సహాయం చేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంటూ నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎండగట్టారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల కంటే తమ ప్రభుత్వమే ప్రజా సంక్షేమంలో ముందుంటుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. గతంలో ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించిన యెన్నెం.. స్వయంగా కేసీఆర్ తన కుమారుడికి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే కేటీఆర్ అని పేరు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి నేపథ్యం ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.