translateexpand_more

Telangana News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 05:02 pm
ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడరాదని సూచన చేసింది. సురక్షిత ప్రదేశాల్లోనే తలదాచుకోవాలని చెప్పింది. Also Read: వైఎస్ జగన్‌తో రాజధాని రైతుల భేటీ.. భూసేకరణ నిలిపివేస్తామని హామీ

10TV Telugu02 Jun, 03:57 pm
ఫ్యామిలీతో సింగపూర్ వెకేషన్ లో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా.. క్యూట్ పిక్స్ వైరల్

తమిళ నటుడు విష్ణు విశాల్(Vishnu Vishal) తన భార్య, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, కుమార్తె మీరాతో కలిసి సింగపూర్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పాపకు ఇది మొదటి అంతర్జాతీయ పర్యటన కావడంతో ఈ ట్రిప్ తమకెంతో ప్రత్యేకమని జ్వాలా పేర్కొన్నారు. గతంలో తానూ ఇక్కడికి టోర్నమెంట్ల కోసం వచ్చానని గుర్తుచేసుకుంటూ, కుటుంబంతో దిగిన అందమైన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Andhra Jyothy02 Jun, 03:41 pm
నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్

<p><strong>హైదరాబాద్, జూన్02: </strong>తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో మొత్తం 290 ఉద్యోగాలకు మంగళవారం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో19 ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>జూన్ 6 నుంచి జులై 13వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్‌ పోస్టులకు, జూన్ 8 నుంచి జులై 15వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు, జూన్ 10 నుంచి జులై 17వ తేదీ వరకు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తామని జారీ చేసిన నోటిఫికేషన్‌లో టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పూర్తి నోటిఫికేషన్ల సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని టీజీపీఎస్సీ వెల్లడించింది. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: rgb(247, 2, 2)">ఈ వార్తలు కూడా చదవండి.. </span></strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/pawan-kalyan-criticized-by-ponnam-prabhakar-over-telangana-remarks-vvnp-1529050.html"><strong>తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు.. నీ అయ్యా జాగీరు కాదు: పొన్నం</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/pawan-kalyan-announces-jana-sena-party-expansion-in-telangana-confirms-future-electoral-contest-vvnp-1529043.html"><strong>తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్</strong></a></p><p style="text-align: start"><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>TG News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p>

10TV Telugu02 Jun, 03:35 pm
ముంబయి దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న భారత్ భాగ్య విధాత’ ట్రైలర్

Bharat Bhhagya Viddhaata trailer: 2008 నాటి 26/11 ముంబయి దాడుల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘భారత్‌ భాగ్య విధాత(Bharat Bhhagya Viddhaata trailer)’. ఆ భయానక ఉగ్రదాడుల సమయంలో ముంబయిలోని ‘కామా అండ్‌ ఆల్‌బ్లెస్‌’ ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషించారు. BuchiBabu Sana: ‘పెద్ది’ ట్రైలర్ పై ట్రోలింగ్.. అయితే సరైన దారిలోనే ఉన్నాం.. బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్ దర్శకుడు మనోజ్‌ తపాడియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఈ మూవీ అధికారిక ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఉత్కంఠ రేకెత్తించే సీన్లతో సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. కంగనా రనౌత్ తన నటనతో మరోసారి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆపద సమయంలో వైద్యులు, నర్సులు రోగుల ప్రాణాలను కాపాడటానికి చేసిన పోరాటం అందరినీ కదిలించేలా ఉంది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రం దేశభక్తిని, మానవత్వాన్ని చాటిచెప్పేలా ఉంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

10TV Telugu02 Jun, 03:10 pm
పెద్ది' ట్రైలర్ పై ట్రోలింగ్.. అయితే సరైన దారిలోనే ఉన్నాం.. బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్

BuchiBabu Sana: ‘ఉప్పెన’ వంటి అందమైన ప్రేమకథ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు(BuchiBabu Sana) స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ఈ భారీ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా పాటలకు వచ్చిన భారీ రెస్పాన్స్‌తో పోలిస్తే, ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంపై కాస్త కలవర పరిచింది. ఈ విషయం పెద్ది టీం వరకు కూడా వెళ్లిందట. తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఈ విషయంపై స్పందించారు. Buchibabu sana: ఇకపై నా ప్రతి సినిమాకు ఆయనే మ్యూజిక్ అందిస్తారు.. ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు కీలక ప్రకటన ట్రైలర్‌లోనే కథను ఎక్కువగా చూపిస్తే థియేటర్స్ లో ఆ ఉత్కంఠ తగ్గిపోతుందనే ఉద్దేశంతోనే అలా చేశామని బుచ్చిబాబు వివరించారు. సినిమాలోని అత్యంత కీలకమైన 50 నిమిషాల ఫుటేజీని ట్రైలర్ కోసం అసలు తాకనే లేదని, అందుకే ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇందులో కనిపించలేదని పేర్కొన్నారు. గతంలో ఘన విజయం సాధించిన ఎన్నో చిత్రాల ట్రైలర్లు కూడా ఆరంభంలో యావరేజ్‌గానే అనిపించాయని, కాబట్టి తాము సరైన దారిలోనే వెళ్తున్నామని నవ్వుతూ నమ్మకం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా కథను తాను ‘ఉప్పెన’ విడుదల కాకముందే సిద్ధం చేసుకున్నానని బుచ్చిబాబు వెల్లడించారు. రామ్‌చరణ్‌కు ఈ కథ వినిపించగా, ఆయన చిన్న మార్పు కూడా చెప్పకుండా వెంటనే ఓకే అన్నారని గుర్తుచేసుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం మొదట ఖుషీ కపూర్‌ను అనుకున్నప్పటికీ, ఆమె మరీ చిన్నమ్మాయిలా కనిపిస్తుందనే కారణంతో.. చివరకు ఆమె సోదరి, ప్రముఖ నటి జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.

10TV Telugu02 Jun, 02:42 pm
ఇకపై నా ప్రతి సినిమాకు ఆయనే మ్యూజిక్ అందిస్తారు.. పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు కీలక ప్రకటన

Buchibabu sana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్ర పెద్ది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలను అందించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు.. రెహమాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. Raveena Tandon: నటి రవీనా టండన్ ఇంట్లో రూ.25 లక్షల వజ్రాభరణాల చోరీ.. పనిమనిషే పక్కా ప్లాన్ చేసి ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేయడం తన జీవితంలోనే మర్చిపోలేని అనుభూతి అని బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయనతో సాగిన జర్నీ ఒక అద్భుతమని, ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో బుచ్చిబాబు(Buchibabu sana) ఒక క్రేజీ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. రెహమాన్ వర్కింగ్ స్టైల్‌కు తాను పూర్తిగా ఫిదా అయ్యానని చెప్పారు. అందుకే ఇకపై తాను తీయబోయే అన్ని సినిమాలకూ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటారని స్పష్టం చేశారు. ఒక దర్శకుడు సంగీత దర్శకుడిపై ఈ స్థాయి నమ్మకాన్ని ఉంచడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ జూన్ 4న థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. దీంతో, బుచ్చిబాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Andhra Jyothy02 Jun, 02:36 pm
తెలంగాణ అమరవీరుల కలలు కన్న రీతిలో రాష్ట్రం లేదు

<p><strong>ఇంటర్నెట్ డెస్క్: </strong>తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, టీజీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ, అభివృద్ధి పథంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>'చిన్న రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాం. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. అమరవీరుల కలలు కన్న రీతిలో ఇంకా రాష్ట్రం వెనుకబడి ఉంది. చిన్నమ్మ సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు అధికారంలో ఉన్నారు. రాష్ట్రా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో జార్ఖండ్ ఏర్పాటు కానివ్వం అన్నవారే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాలన్నది బీజేపీ సంకల్పం' అని నితిన్ నబీన్ అన్నారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>'తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పీఎం కిసాన్ యోజన ,ముద్ర లోన్లు, జన్ ధన్ ఖాతాలు అందించాం. మౌలిక వసతులు,రోడ్లు,రహదారులు,రైల్వేలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వికసిత భారత్ కావాలంటే వికసిత తెలంగాణ కావాలి. ఒక అవినీతి పరుడు చేతుల్లోంచి మరో అవినీతి పరుడి చేతుల్లోకి వెళ్ళింది. తెలంగాణ కలలును సాకారం చేస్తాం' అని నితిన్ నబీన్ పేర్కొన్నారు.</p><br/><p><strong><span style="color: rgb(247, 2, 2)">ఈ వార్తలు కూడా చదవండి..</span></strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/pawan-kalyan-announces-jana-sena-party-expansion-in-telangana-confirms-future-electoral-contest-vvnp-1529043.html"><strong>తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/telangana-fight-inspires-pawan-kalyan-ap-deputy-cm-vvnp-1529041.html"><strong>తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Asianet News Telugu02 Jun, 02:32 pm
తెలంగాణ మీ జాగిరా.? పూర్తిగా ఓపెన్ అయిన ప వ న్ క ళ్యాణ్

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

10TV Telugu02 Jun, 02:22 pm
ఎక్కువ ప్యాకేజీ ఇస్తే జగన్ కి కూడా మద్దతిస్తారు..!- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో ప్యాకేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల సినిమాలో నటిస్తారు.. రాజకీయాల్లో సైతం ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే పవన్ మద్దతిస్తున్నారు అని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ ఆయనకి కూడా మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జైల్లో కలవడమే పవన్ ప్లస్ పాయింట్ అని అన్నారు. ”పవన్ కల్యాణ్ తెలంగాణకి క్షమాపణ చెప్తారని అనుకున్నా. నరదృష్టి ఉన్న దగ్గరికి పవన్ ఎందుకు రావాలి? పవన్ వెళ్ళి గుజరాత్ లో పోటీ చేయాలి. నల్లగా అయిపోతాననే పవన్ విజయవాడ వెళ్ళడం లేదు. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు? పవన్ ఇంగ్లీషులో మాట్లాడింది అమిత్ షా కి అర్థం కావడానికే. కేసీఆర్, అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి భూముల వ్యవహారమే తెలీదు. పవన్ కబ్జా చేసిన భూమి దగ్గరికి వెళ్తే కేసులు పెడతారా? రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి పవన్ డిప్రెషన్ లో ఉన్నారు” అని అనిరుధ్ రెడ్డి అన్నారు. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

10TV Telugu02 Jun, 01:56 pm
తెలంగాణ మా అయ్య జాగీరే- పవన్ కల్యాణ్ కు మంత్రి పొన్నం కౌంటర్

Ponnam Prabhakar – Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. మిస్టర్ పవన్ కల్యాణ్… ఇది మా అయ్య జాగీరే అని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ.. 4 కోట్ల మంది ప్రజల జాగీరు. మీ అయ్య జాగీరు కాదు అని ఎదురుదాడికి దిగారు. ”పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి చేసేదేంటి? పవన్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్ తో ఒక క్యారెక్టర్ చేయిస్తా. తెలంగాణపై పవన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్. గద్దర్ కు కార్ కొనిచ్చినా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తనకి ఆంధ్రాలోనే దిక్కు లేదని పవన్ చెప్పుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా వాళ్ళని మేము ఏమీ అనలేదు. మేం ఆంధ్రా వాళ్ళని ఏదో అన్నట్టు పవన్ అబద్ధాలు చెబుతున్నారు. పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు మీ అయ్యా జాగీరా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? పవన్ తిరిగితే జనాలు వస్తారు. కానీ, ఓట్లు వేయరు. పవన్ వచ్చినా, పోయినా మాకేం సంబంధం లేదు. తెలంగాణ ఎప్పుడైనా ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుంది. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు” అని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Telugu Times02 Jun, 01:21 pm
హరీష్ రావుకు ఆటా ఆహ్వానం

బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, హరీష్ రావును అమెరికా తెలుగుసంఘం (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించింది. ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలనుఈ సందర్భంగా హరీష్ రావుకు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగువారి పరిస్థితులపై చర్చించారు. పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో తెలంగాణ ను దేశంలో నంబర్ వన్ గా నిలిపామని అన్నారు. ఉద్యమంలో ఎన్నారైల పాత్రపై కూడా చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు ప్రజలకు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడగట్టారో వివరించారు. హరీష్ రావు ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ఇండియా కో ఆర్డినేటర్ వేణు సంకినేని, ఈశ్వర్ బండా ఉన్నారు. ఆటా మహా సభలకు హాజరయ్యేందుకు హరీష్ రావు సానుకూలంగా స్పందించారు.

10TV Telugu02 Jun, 01:08 pm
నటి రవీనా టండన్ ఇంట్లో రూ.25 లక్షల వజ్రాభరణాల చోరీ.. పనిమనిషే పక్కా ప్లాన్ చేసి

Raveena Tandon: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ సోదరుడు రాజీవ్ టండన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో ముంబై జుహు పోలీసులు ఎట్టకేలకు ఒక మహిళను అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబరులో రాజీవ్ టండన్ ఇంట్లోని లాకర్ నుండి దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, ఖరీదైన చేతి వాచీలు మాయమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపగా, రవీనా టండన్ తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న 47 ఏళ్ల రాశి ఛాబ్రియా ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. Vasanthi Krishnan: సప్తశృంగి దేవి సన్నిధిలో బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి.. డివోషనల్ ఫోటోలు వైరల్! గత 2020 నుండి ఈ కుటుంబంతో నమ్మకంగా ఉంటూ, ఇంట్లోని విలువైన వస్తువులు ఉండే గదుల్లోకి సైతం స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని రాశి ఛాబ్రియా సంపాదించుకుంది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అదును చూసి లాకర్‌లోని నగలను దొంగిలించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో తొలుత నేరాన్ని ఖండించినా, ఆ తర్వాత రెండు వాచీలను తిరిగి ఇచ్చేసి మిగిలిన నగలు జగదీష్ అనే వ్యక్తి వద్ద ఉన్నాయని ఒప్పుకుంది. అంతేకాకుండా, నగల విషయమై ఒత్తిడి తెస్తే టండన్ కుటుంబాన్ని నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీసులు మే 21న నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, మే 29 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇక రవీనా టండన్(Raveena Tandon) గతంలో తెలుగులో పలు చిత్రాల్లో నటించగా, ప్రస్తుతం ఆమె కుమార్తె రషా తడానీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో రషా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

SkyC Media02 Jun, 12:55 pm
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టిస్తూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎవరి సొత్తు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ పుట్టిందే హైదరాబాద్ గడ్డపై అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము కేవలం రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే వ్యతిరేకించామని పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. తాము బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనుమతులు నిరాకరిస్తే ఇళ్ల నుంచే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ పక్క రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఆయన అభివర్ణించారు. పవన్‌కు అహంకారం ఎక్కువైందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాంగ్రెస్, జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు ఇంటర్‌స్టేట్ రాజకీయ వివాదంగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2026 నుంచి 2028 మధ్య కాలంలో తెలంగాణలో బలం పుంజుకోవాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని యువత, అర్బన్ ఓటర్లే లక్ష్యంగా జనసేన వ్యూహాలు రచిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం జనసేనకు పెద్ద సవాలుగా మారనుంది. టీడీపీ, జనసేన కూటమి తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాబోయే రోజుల్లో జనసేన తెలంగాణలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ వ్యూహం కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu Times02 Jun, 12:42 pm
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ప్రవాసులకు మహేష్ బిగాల శుభాకాంక్షలు

Mahesh Bigala: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఓషియానియా వంటి అన్ని ఖండాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ సంబరాలు.. అమెరికా, కెనడా, లండన్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, బహ్రెయిన్ ,ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సహా గల్ఫ్ దేశాలు అలాగే ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికా, టాంజానియా వరకు అనేక దేశాల్లో తెలంగాణ పండుగ వాతావరణం వైభవంగా కొనసాగుతోంది. మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, ఉద్యమ విశేషాలను అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పేలా ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. ముఖ్య అతిథిగా కేటీఆర్.. ఈ సారి వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మలేషియాలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కేటీఆర్ రాక కోసం మలేషియాలోని తెలుగు సంఘాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని మహేష్ బిగాల వెల్లడించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రగతి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేయడానికి ఈ వేడుకలు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని మరింత పెంపొందించేందుకు ప్రతి ప్రవాస తెలంగాణవాసి బాధ్యతగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

10TV Telugu02 Jun, 12:40 pm
సప్తశృంగి దేవి సన్నిధిలో బిగ్ బాస్ ఫేమ్ వాసంతి.. డివోషనల్ ఫోటోలు వైరల్

ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల ప్రసిద్ధ సప్తశృంగి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ పవిత్ర క్షేత్రంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబంతో కలిసి దిగిన భక్తిరస చిత్రాలను వాసంతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అవి ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Sakshi02 Jun, 12:21 pm
తెలంగాణలో జనసేన ఉంటుంది

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

10TV Telugu02 Jun, 12:03 pm
తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

10TV Telugu02 Jun, 11:58 am
చరణ్ కంటి నుండి రక్తం.. పెద్దాయన ఫోన్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. బుచ్చిబాబు ఎమోషనల్

Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ఒక భయానక ప్రమాదం గురించి దర్శకుడు బుచ్చిబాబు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయమై రక్తం వచ్చిందని, ఆ దృశ్యం కెమెరాలోనే రికార్డ్ అయిందని ఆయన తెలిపారు. Trisha Krishnan: కుక్క ఫోటోతో కౌంటర్.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చిన త్రిష కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోకు తన సెట్స్‌లో అలా గాయం కావడంతో తనకు చేతులు, కాళ్లు ఆడలేదని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఆ వెంటనే ఇంటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో, తనపై గట్టిగా తిడతారేమోనని విపరీతమైన భయంతో గుండె ఆగినంత పనైందని పేర్కొన్నారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబు(Buchibabu)కు చిరంజీవి ఊహించని విధంగా ఎంతో కూల్‌గా మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చారు. చిరంజీవి గారు దర్శకుడిని అస్సలు తిట్టకుండా, ఎంతో పరిణతితో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారని బుచ్చిబాబు చెప్పారు. “కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు” అని చిరంజీవి ధైర్యం చెప్పిన తీరు, ఆయన ఇచ్చిన సపోర్ట్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని బుచ్చిబాబు ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

Oneindia Telugu02 Jun, 11:58 am
తెలంగాణ మీ అయ్య జాగీరా ? బెదిరింపులపై పవన్ ఫైర్

ఆంధ్రలో తనను తిరగనివ్వనని అంటే, తన వారాహికి అనుమతి ఇచ్చింది తెలంగాణాయే అని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. ఇక్కడి జనసైనికులే తనకు అండగా నిలిచారన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేద్దామని మా నాయకులు అంటే.. ప్రజలు కోరుకుంటే చూద్దామని చెప్పినట్లు వెల్లడించారు. ఇక్కడ కూర్చొన్నా ఆంధ్రలోనే అధికారం కోరుకుంటానని, తెలంగాణలో కేవలం మార్పు మాత్రమే కోరుకుంటానన్నారు. ఈ మధ్య మాట్లాడితే ఆంధ్ర ఆంధ్ర అంటున్నారని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదని, వాళ్లంతా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఇక్కడ ఉండే వారు కాదన్నారు. దీన్ని ఎవరూ మర్చిపోరన్నారు. హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతావని, ఇక్కడేం పని అని అడుగుతున్నారని, మీరెవరు నన్ను బెదిరించడానికి అన్నారు. బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణా అని ప్రశ్నించారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే తనకు బెదిరింపులు ఎక్కువన్నారు. తెలంగాణలో రానివ్వనంటారని, ఆంధ్రలో అయితే కోనసీమలో తల తీసేయమంటారన్నారు.తాను 2019లో ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు ఇక్కడ ఉంటే అలాంటి పరిస్ధితి రానిచ్చే వాళ్లం కాదన్నారు. తెలంగాణలో తాను సాధించేది ఏమీ లేదన్నారు. ప్రెస్ మీట్ కూడా ఇంట్లోనే ఎందుకు పెట్టానంటే, దాడి చేసే వాళ్లకు అవకాశం కోసమేననన్నారు. బాంచెన్ సారు కాల్మొక్తా అనే వాళ్లం అయితే పార్టీ ఎందుకు పెడతామన్నారు. మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా అన్నారు. 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నాయకుడిని అయినా ఒక్క మాట అనలేదన్నారు. తనకు పౌరుషం చచ్చిపోలేదని, తెలంగాణపై ప్రేమ కూడా చావలేదన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు మాట్లాడతానన్నారు. తెలంగాణలో జనసేన ఎదగాలని కోరుకుంటున్నానని, ఇక్కడి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన హెడ్ ఆఫీసును మంగళగిరిలో పెట్టుకున్నానన్నారు. తన గుండెల్లో తెలంగాణ ఉందని, తనను ఎంత తిట్టినా బెదిరిపోనున్నారు. ఏపీలో వైసీపీ గూండాల బెదిరింపుల కంటే ఇక్కడి వాళ్ల బెదిరింపులు ఎక్కువేమీ కాదన్నారు. ఓ విశ్లేషించే వ్యక్తి వల్లే ఈ గొడవ ప్రారంభమైందన్నారు. ఆయన మీడియాలో అమిత్ షా, తాను మాట్లాడుకున్నట్లు చెప్తే దాన్ని ఖండించామన్నారు. తనను ఓ మాట అంటే జనసైనికులు కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి వదిలేయమని చెప్పానన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా అభివృద్ది లేకపోవడానికి ఇంకా ఆంధ్రోళ్లు, పవన్ కళ్యాణే కారణమా అని అడిగారు. ఆంధ్రా ప్రజలు, తెలుగు సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారణం మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులే అన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిలో పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన్నూ ఉరి తీయాలన్నారు. గుజరాతీలు సూరత్ లో, నాందేడ్ లో స్థానికులు తెలుగు వాళ్లు వద్దని తరిమేస్తే దేశం నిలబడుతుందా అని పవన్ అడిగారు. నాగేశ్వర్ ను ప్రశ్నిస్తే తనకు తెలంగాణ అంటే పడదు, వ్యతిరేకం అని, చెరువు కబ్జా చేశానని ఆరోపణలు చేస్తున్నారని, తనకేం పనిలేదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవమని, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువును ఆక్రమించుకున్నాడని తేలితే దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న ఓ అనలిస్ట్ .. వామపక్ష భావజాలాన్ని వదిలి ప్రాంతీయవాదానికి వచ్చారన్నారు. గద్దర్ మీద తన ప్రేమ ఈనాటిది కాదన్నారు. ఆయనకు తాను బండి కొనిచ్చానన్నారు. బతికున్నప్పుడు గద్దర్ కు మీరేం చేశారని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన వైఎస్ కు కొమ్ముకాసిన వ్యక్తులు ఇవాళ తన నాలుకలు కోస్తామంటున్నారని పవన్ విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రకు వస్తే తాను స్వాగతించానని, గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టి, గతంలో జనసేనలో పనిచేసిన వ్యక్తిని ఏపీకి అధ్యక్షుడిగా పెడితే స్వాగతించామన్నారు. ఆంధ్రాలో సీఎంకు దిక్కులేని పవన్ కళ్యాణ్.. ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కానీ ఇక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామనే భయం అన్నారు. 2 వేల మంది జనసైనికులతో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వనంటే ఎలా అన్నారు. ఓ అనలిస్ట్ కూర్చుని అమిత్ షా గురించి మాట్లాడితే, తాను దాన్ని ప్రశ్నిస్తే ఇందులో ప్రాంతీయత ఎక్కడ ఉందని, తెలంగాణలో అవమానం ఎక్కడుందని, కులాలు ఎక్కడ వచ్చాయని, మాకు నొచ్చుకునే హక్కు కూడా లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పీకలు కోసుకుంటా కానీ తనకు భయం అయితే రాదన్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అడుగుతున్నారని, అక్కడి కాంట్రాక్టర్లు ఇక్కడ బాగానే ఉన్నారని, మీరు ఎవరిని పిచ్చోళ్లని చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిజంగా వద్దనుకుంటే పవన్ కళ్యాణ్ ను రానివ్వబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నారు. తన ప్రేమను శంకిస్తే .. ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదని, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణలో తిరిగేందుకు సిధ్దమన్నారు. ప్రతీ సమస్య మీదా మాట్లాడతామనని, ప్రతీ అన్యాయాన్నీ ఎదుర్కొంటానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగమని మర్చిపోవదన్నారు. మీరు బెదిరిస్తే భరించేది లేదన్నారు. దశాబ్దం

Namasthe Telangana02 Jun, 11:36 am
జూలూరుపాడులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు, జూన్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యల్లంకి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించగా, పార్టీ సీనియర్ నాయకులు యదలపల్లి వీరభద్రం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారిందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దుకుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, పరిపాలనా రంగాల్లో కొత్త రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర అభివృద్ధి మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, భూక్యా సేవా, భూక్యా జోహార్ లాల్, యల్లంకి సత్యనారాయణ , సాయిన్ని హరీష్, తాళ్లూరి రామారావు, పురస్తపురవు రామకృష్ణ, బండారి వెంకయ్య, లేళ్ల సీతయ్య, ధర్మరాజుల నరసింహారావు, నిమ్మటూరి కనకయ్య, పొన్నెబోయిన పుల్లయ్య, నూతి నరసింహారావు, బానోత్ హనుమంతరావు, ఈసం వెంకటేశ్వర్లు, మోదుగు నరసింహారావు, పోతురాజు కృష్ణ, ఉప సర్పంచులు బాదావత్ నరేష్, నూనావత్ నవీన్, కుంజా రవిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలూరుపాడులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

10TV Telugu02 Jun, 11:28 am
ఎయిర్ టెల్ యూజర్లకు బ్రహ్మాండమైన ఆఫర్.. 20 యాప్స్ జస్ట్ రూ. 99కే

Airtel Xstream Play : ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. టెలికం దిగ్గజం సమ్మర్ ఓటీటీ సేల్‌ ప్రవేశపెట్టింది. ఇందులో లిమిటెడ్ టైమ్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు రూ.99కే ఆఫర్ చేస్తోంది. సాధారణంగా ఈ ప్రీమియం ప్లాన్ ధర రూ.149 ఉంటుంది. ఆసక్తిగల యూజర్లు తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. స్ట్రీమింగ్ ఆప్షన్‌లను కూడా పొందవచ్చు. రూ. 99కే ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం ప్లాన్ : కేవలం రూ. 99కే ఎయిర్‌టెల్ ఒకే లాగిన్‌తో 20 విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ అందిస్తుంది. ప్లాన్ వివరాలు : ధర : రూ. 99 (లిమిటెడ్ టైమ్ ఆఫర్) సాధారణ ధర : రూ. 149 వ్యాలిడిటీ : 1 నెల రోజుకు అయ్యే ఖర్చు : రూ. 3.30 రూ. 99 ప్లాన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో మొత్తం 20 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఇందులో అనేక రకాల ఎంటర్‌టైన్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. సబ్‌స్క్రైబర్‌లకు షోలు, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ యాక్సస్ పొందవచ్చు. Read Also : Gold Deposit Scheme : బాబోయ్.. ఇంట్లో బంగారం ప్రభుత్వానికి ఇచ్చేయాలా? ఎయిర్‌టెల్ రూ. 279 ప్లాన్‌లో అన్ని ఓటీటీ ఒకే ప్యాక్‌లో లభిస్తాయి. ఒకవేళ మీకు నెట్‌ఫ్లిక్స్ లేదా జియోహాట్‌స్టార్ వంటి ప్రీమియం, పాపులర్ పొందిన ఓటీటీలు అవసరమైతే.. వారికోసం ఎయిర్‌టెల్ నెలకు రూ. 279 కే ‘ఆల్ ఓటీటీ ఇన్ వన్ ప్యాక్’ను ప్రారంభించింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌ బండిల్ వివరాలు ఇలా ఉన్నాయి. ధర : రూ. 279 వ్యాలిడిటీ : ఒక నెల డేటా బెనిఫిట్ : 1GB డేటా పోస్ట్ డేటా ఛార్జీలు : ప్రతి MBకి 50 పైసలు అదనంగా 20 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఈ కాంబో అన్నింటినీ సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌లో పొందవచ్చు. అర్హులైన యూజర్లకు సబ్సిడీతో అనేక ప్లాన్లు లభిస్తున్నాయి. ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్, రూ.279 బండిల్‌ అన్ని మెయిన్ ప్లాట్‌ఫారమ్‌లు ఒకే దగ్గర పొందవచ్చు.

Oneindia Telugu02 Jun, 11:21 am
తెలంగాణతో బంధం కొత్తదేం కాదు..! ఆ గొంతుకలు..పవన్ కామెంట్స్

జనసేన పార్టీని తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లోనే స్థాపించామని, తెలంగాణ మీద తమ పార్టీకి ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. తన చుట్టు పక్కల ఉన్న నాయకులంతా 2007-08 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న నాయకులే అన్నారు. ఈ రోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ తనది కాదన్నారు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాక ముందే ఇక్కడి సంస్కృతి, పోరాట స్ఫూర్తి నుంచి ఉత్తేజం పొందామని, సినిమాలు, సంస్కృతి పరంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఇవాళ తమను విమర్శించే గొంతులు 2007లో లేవన్నారు. తాను తెలంగాణ నలుమూలలా పెరిగిన వాడిని, వెళ్లిన వాడిని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పోరేషన్లలో మువ్వన్నెల జెండా తాము ఎగురవేశామన్నారు. ఇది కొత్తగా వచ్చిన ప్రేమ కాదన్నారు. ఆదిలాబాద్ జిల్లాల్లో, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు తనను విమర్శిస్తున్న నాయకులు ఎప్పుడూ తిరగలేదన్నారు. ఆదిలాబాద్ గోండు తండాల్లో, గెలుస్తానో లేదో తిరగని పరిస్ధితుల్లో తాను తిరిగామన్నారు. ఓట్లు పడతాయని కాదని, తనకు తెలంగాణ అంటే ఇష్టమన్నారు. తెలంగాణపై తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. సామాజిక తెలంగాణలో అన్ని కులాలు బాగుండాలని చెప్పి మరీ వచ్చామన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ, ఆంధ్రను విభజించిన తీరు తప్పని మాత్రమే చెప్పానన్నారు. తెలంగాణ సంస్కృతీ, ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ తాను వ్యతిరేకం కాదన్నారు.

10TV Telugu02 Jun, 10:53 am
పెళ్ళైంది కాని నో కహాని’ పోస్టర్ రిలీజ్.. రాజ్ తరుణ్ చేతుల మీదుగా

Raj Tarun : శ్రీహరి, స్మిత జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘పెళ్ళైంది కాని నో కహాని’. మై3 సినిమాస్ బ్యానర్ పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శక నిర్మాతలు నాకు పరిచయం ఉన్నవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి అన్నారు. అనంతరం హీరో శ్రీహరి మాట్లాడుతూ.. మా సినిమా పోస్టర్ లాంఛ్ చేసేందుకు హీరో రాజ్ తరుణ్, ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి గారికి కృతజ్ఞతలు. ‘పెళ్ళైంది కాని నో కహాని’ సినిమా బాగా వచ్చింది. నెలన్నరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా ఫుల్ ఫన్ ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నారు. Also Read : Buchibabu Sana : ఎన్టీఆర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.. బుచ్చిబాబు కామెంట్స్ వైరల్.. డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి మాట్లాడుతూ.. పెళ్ళైంది కాని నో కహాని సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు సినిమా వెళ్తోంది. వచ్చే నెలలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

10TV Telugu02 Jun, 10:25 am
వైఎస్ జగన్ తో రాజధాని రైతుల భేటీ.. భూసేకరణ నిలిపివేస్తామని హామీ

YS Jagan : అమరావతి రాజధాని పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. వైఎస్ జగన్ తో భేటీ అయిన వారిలో ఉండల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు సహా మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. Also Read : Annamalai : బీజేపీకి అన్నామలై రాజీనామా.. నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ అందజేత..? రైతులతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని అన్నారు. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. రైతులకు సంతోషపెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్టపెట్టేలా ఏమీ ఉండకూడదుదని జగన్ అన్నారు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్‌ను సూచించామని జగన్ పేర్కొన్నారు. విజయవాడలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్‌పోర్టు అంటున్నారు. మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ, ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు 2కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి. దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలని జగన్ విమర్శించారు. రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్‌ను గ్రోత్‌ కారిడర్‌గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్‌ కారిడర్‌కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్‌ అభివృద్ధి చెందుతుందని జగన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ ను కలిసిన తరువాత రాజధాని రైతులు మాట్లాడుతూ.. మా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ ఉండటం లేదు. ఎమ్మెల్యే, మంత్రి, అధికారులు ఎవరూ కలవడానికి అవ్వడం లేదు. ఉండవల్లిలో పండని పంటలు లేవు.. అలాంటి పొలాలను ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఏడాది పొడవునా పంటలు పండుతాయి. ఎకరానికి 3లక్షలు సంపాదిస్తాం. మా బాధలన్నీ వైఎస్ జగన్ కు చెప్పుకున్నాం. భూసేకరణ నుండి మా భూములు తప్పించండని వేడుకుంటున్నాం. ప్రతిరోజూ ఏదోక విధంగా మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. జగన్ మాకు అండగా ఉంటానని చెప్పారు. న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. 12ఏళ్లుగా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక భూసేకరణ నిలిపివేస్తామని హామీ ఇచ్చారని జగన్ కలిసిన రాజధాని రైతులు పేర్కొన్నారు.

10TV Telugu02 Jun, 10:25 am
ఎన్టీఆర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.. బుచ్చిబాబు కామెంట్స్ వైరల్

Buchibabu Sana : బుచ్చిబాబు సాన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. ప్రస్తుతం బుచ్చిబాబు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. గతంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ చెప్పాడు. ఆ సినిమా ఓకే అయింది చేస్తారు అనుకున్నారు కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఆ తర్వాతే పెద్ది మొదలయింది. అయితే ఎన్టీఆర్ పెద్ది కథని రిజెక్ట్ చేసాడని, ఆ కథనే రామ్ చరణ్ చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. Also Read : Ram Charan : జనసేన కోసం రామ్ చరణ్ త్యాగం.. బాబాయ్ కోసమే అబ్బాయి తప్పుకున్నాడా? బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కి నేను చెప్పిన కథ వేరు, పెద్ది కథ వేరు. ఆ రెండూ ఒకటి కాదు. ఎన్టీఆర్ కి చెప్పిన కథతో సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ సర్ పిలిస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి సినిమా చేస్తాను. ఎన్టీఆర్ సర్ చేతిలోనే ఉంది. పెద్ది తర్వాత ఇంకా ఏది ఓకే చేయలేదు. ఓ నాలుగు మంచి కథలు అయితే ఉన్నాయి అని తెలిపారు. దీంతో భవిష్యత్తులో బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఆశించొచ్చు అని తెలుస్తుంది.

Namasthe Telangana02 Jun, 10:16 am
తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ జావిద్ కు ఘన సన్మానం

బచ్చన్నపేట, జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు ఎండీ జావిద్‌ను జనగామ జిల్లా బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అలాగే తెలంగాణ అమరవీరులకు బచ్చన్నపేట చౌరస్తాలో అమర వీరుల స్థూపం వద్ద ఘన మంగళవారం నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిదన్నారు. వారిని గౌరవించుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, నాయకులు ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, కొండి వెంకటరెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్, సిద్ధిరాం రెడ్డి, ఉపసర్పంచ్ బైరి రజిత, బొమ్మెన ఆంజనేయులు, అల్వాల ఎల్లయ్య. ఎండీ షబ్బీర్, శివరాత్రి రాజు, మచ్చ సతీష్, గంధమల్ల మహేష్, కర్ణాకర్, దిలీప్, ఎండీ అజీమ్, చింతల వెంకటయ్య పాల్గొన్నారు.

10TV Telugu02 Jun, 09:50 am
బీజేపీకి అన్నామలై రాజీనామా.. నితిన్ నబిన్ కు రాజీనామా లేఖ అందజేత

Annamalai : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ అన్నామలై తిరస్కరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే, అన్నామలై రాజీనామా విషయంపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. Also Read : Trump – Netanyahu : ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే.. అన్నామలై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరారు. వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏడాది తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. సాంప్రదాయకంగా ద్రావిడ ప్రధాన పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో అన్నామలై బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచారు. ఉధృతమైన ప్రచారాలు, విస్తృతమైన క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకోవడం ద్వారా, ఆయన పార్టీ సంస్థాగత విస్తరణకు సాయ పడటంతో పాటు, గణనీయమైన వ్యక్తిగత అనుచర వర్గాన్ని కూడా నిర్మించుకున్నారు. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు బీజేపీలో అధ్యక్ష మార్పు జరగాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పట్టుబట్టడంతో అన్నామలై స్థానంలో నూతన అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం నియామకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై బరిలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే బీజేపీ ప్రచారంలో కూడా అన్నామలై ప్రముఖ పాత్ర పోషించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర ఓటమి తరువాత అన్నామలై బీజేపీ వీడి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజాగా.. అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారని, రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి అందజేసినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అన్నామలై భేటీ అవుతారని తెలిసింది. ఆ భేటీ తరువాత అన్నామలై నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అన్నామలై మొదట ఒక ఉద్యమాన్ని, ఆ తర్వాత పార్టీని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను చేర్చుకోవడం, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడం అన్నామలై లక్ష్యం అని చెబుతున్నారు. ఈ కొత్త ఉద్యమం పెద్ద ఎత్తున పని చేస్తుందని, విభిన్న వృత్తిపరమైన సామాజిక నేపథ్యాల నుండి స్వచ్ఛంద కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.

10TV Telugu02 Jun, 09:36 am
రాజశేఖర్ కోసం విజయ్ సేతుపతిని తీసేశారా.. 'రౌడీ జనార్ధన' టీం షాకింగ్ డెసిషన్

Rowdy Janardhana: తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అది అయన నటనకు, డేట్స్‌కు ఉన్న డిమాండ్. ఈ కారణంగానే చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు ఈ నటుడు. ఇటీవల, స్టార్ దర్శకుడు సుకుమార్ సైతం ‘పుష్ప’ చిత్రం కోసం చాలా కాలం వేచి చూశారు. అయినప్పటికీ సేతుపతి అందుబాటులోకి రాకపోవడంతో ఆ పాత్ర ఫాహద్ ఫాజిల్‌ను వరించింది. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నుండి కూడా ఆయనకు భారీ ఆఫర్లు వస్తుంటాయి. Arjun Sarja: ఫేక్ కలెక్షన్స్ వేసి మోసం చేయలేను.. అర్జున్ సర్జా సంచలన కామెంట్స్.. నెటిజన్స్ ఫిదా కానీ, బయటి భాషా చిత్రాల ఎంపికలో సేతుపతి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్లమ్ డాగ్’ మినహా ఆయన మరే ఇతర చిత్రానికి సులువుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘రౌడీ జనార్ధన(Rowdy Janardhana)’. ఈ చిత్రంలోని పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదటి నుండి విజయ్ సేతుపతినే అనుకున్నారు టీం. ఆయనను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఆ పాత్రను మలిచారు. సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అడిగినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాత దిల్ రాజు కూడా సిద్ధపడ్డారు. అందుకే, ఆయన కోసం వెయిట్ చేస్తూ, విలన్ సీన్లను మినహాయించి మిగతా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. కానీ, సేతుపతి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ నిరీక్షణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులోనే సినిమాను విడుదల చేయాలని టార్గెట్‌గా పెట్టుకోవడంతో, ఇక ఆలస్యం చేయడం కుదరదని ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ను ఆ విలన్ పాత్ర కోసం సంప్రదించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవలే రాజశేఖర్ ‘బైకర్’ చిత్రంలో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తన రూట్‌ను మార్చుకుంటున్న రాజశేఖర్ ఈ భారీ ప్రాజెక్టులో నటిస్తే సినిమాకు ఖచ్చితంగా సరికొత్త మైలేజ్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఇంతకాలం హీరోగా, నటుడిగా మెప్పించిన రాజశేఖర్, విలన్ గా ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.

10TV Telugu02 Jun, 09:34 am
కోట్ల ప్రైజ్ మ నీని ఆర్ సీబీ ఆట గాళ్లు ఎలా పంచుకుంటారు? భువ నేశ్వ ర్ కుమార్

RCB : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజేత‌గా నిలిచింది. విజేత‌గా నిలిచినందుకు ప్రైజ్‌మ‌నీ కింద ఆర్‌సీబీకి 20 కోట్ల మొత్తం ల‌భించింది. ఈ మొత్తాన్ని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటారు అన్న విష‌యం పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంది. ఇక ఇదే విష‌యాన్ని మిస్ట‌ర్ నాగ్స్ ఆర్‌సీబీ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను అడిగాడు. 17 ఏళ్ల సీజ‌న్ల పాటు క‌ప్పు కోసం నిరీక్షించిన ఆర్‌సీబీ ఎట్ట‌కేల‌కు 18వ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచింది. అదే ఉత్సాహంలో 19వ సీజ‌న్‌లోనూ క‌ప్పును ముద్దాడింది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబైఇండియ‌న్స్ తరువాత వ‌రుస‌గా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జ‌ట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. RCB bench players : ఛాంపియ‌న్ జ‌ట్టులో భాగ‌మై.. ఒక్క మ్యాచ్ ఆడ‌ని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు.. వేలంలో కోట్ల వ‌ర్షం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించిన త‌రువాత మైదానంలో ఆర్‌సీబీ ఆట‌గాళ్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ స‌మ‌యంలోనే ఆర్‌సీబీ డిజిట‌ల్ హోస్ట్ మిస్ట‌ర్ నాగ్స్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప‌లువురు ఆట‌గాళ్లను ఇంట‌ర్వ్యూలు చేశాడు. Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. ఇక భువ‌నేశ్వ‌ర్ కుమార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం 20 కోట్ల ప్రైజ్‌మ‌నీని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటార‌ని మిస్ట‌ర్ నాగ్స్ అడిగాడు. ఇందుకు భువీ ఎంతో తెలివిగా స‌మాధానం ఇచ్చాడు. న‌గదును ఎలా పంచుకుంటారు అనే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, దాని గురించి తెలుసుకోవ‌డానికి త‌న‌కు ఎంతో ఆస‌క్తిగా ఉంద‌ని స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎలాంటి వివాదాంలో ఇరుక్కోకుండా భువీ చాలా చ‌క్క‌గా చెప్పాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

10TV Telugu02 Jun, 09:34 am
ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే

Trump – Netanyahu : లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్‌తో జరుగుతున్న సున్నితమైన చర్చలకు ఈ సంఘర్షణ ఆటంకం కలిగించకుండా వాషింగ్టన్ నివారించేందుకు ప్రయత్నిస్తోంది. Also Read : Donald Trump Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఆ పరికరాల తయారీ రంగానికి గుడ్‌న్యూస్.. తగ్గనున్న ధరలు బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు ఆదేశించండం, దక్షిణ లెబనాన్‌లో భూతల కార్యకలాపాలను విస్తరించడం వంటి చర్యల తరువాత ఈ అసాధారణ ఘర్షణ చోటు చేసుకుంది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులుచేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నారని, ఇరాన్ తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘నీకు పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నిన్ను కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. దీనికారణంగా అందరూ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అంటూ ట్రంప్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఇరాన్ విషయంలో ఇన్నాళ్లూ ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు భిన్న దిశల్లో పయణిస్తున్నట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గుతుందా.. లేదంటే ట్రంప్ ను ధిక్కరించి తన వ్యూహాన్ని అమలు చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.