translateexpand_more

Andhrapradesh News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 01:06 am
టీడీపీ కార్యకర్తలను వేధించిన సీఐపై వేటు తప్పదు

పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెపెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సీఐ శంకర్ రావు వ్యవహారశైలి, గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆమె స్పందించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐగా శంకర్ రావు పనిచేశారని, ఆ సమయంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, తీవ్రంగా వేధించారని జూన్ 1న ‘ఈనాడు’ పత్రికలో కథనం ప్రచురితమైంది. ప్రస్తుత పాయకరావుపేట ఎమ్మెల్యే గౌతు శిరీష వంటి నేతలను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారని ఆ కథనంలో ఆరోపించారు. ఇంతటి వివాదాస్పద నేపథ్యం ఉన్న అధికారిని హోంమంత్రి సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ విమర్శలపై మంత్రి అనిత స్పందిస్తూ ఆ సీఐ వల్ల పలాస ప్రాంత కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులపై తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. "కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుంది. వారిని గౌరవించుకోవడం నా ప్రథమ కర్తవ్యం. కార్యకర్తల వల్లే నేను నా నియోజకవర్గంలో పనిచేయగలుగుతున్నా" అని ఆమె అన్నారు. అధికారుల గత చరిత్రపై కొన్నిసార్లు ముందస్తు సమాచారం ఉండకపోయినా, ఈ విషయంలో మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. మే 2న పాయకరావుపేట సీఐగా శంకర్ రావు బాధ్యతలు చేపట్టడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

10TV Telugu27 May, 08:34 am
స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు కీలక సూచనలు చేసిన వైఎస్ జగన్.. అలాచేస్తే ఇబ్బందులు తప్పవ్

YS Jagan : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. Also Read : Nara lokesh : మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన.. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే వైసీపీ కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరాలి.. ప్రభుత్వం వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని సీరియస్ గా తీసుకుంటా అంటూ నేతలకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఏకగ్రీవాలు జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ ఛార్జి ఫెయిల్యూర్ గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు..? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది. అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి అంటూ నేతలకు జగన్ సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ‘వెన్ను

Andhra Jyothy23 May, 06:34 pm
COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌ తనిఖీ

- Home » Andhra Pradesh » Ananthapuram » Collector's inspection in wards ABN , Publish Date - May 24 , 2026 | 12:04 AM పట్టణంలోని గంగా నగర్‌, హనుమేష్‌ నగర్‌లో శనివారం కలెక్టర్‌ ఒ. - ఆనంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. - పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హాజరయ్యారు.

10TV Telugu26 May, 01:32 am
Rain Alert : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. గత నాలుగు రోజులు నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి....

Rain Alert : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. గత నాలుగు రోజులు నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 నుంచి 48డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు వేడిగాలులు ప్రభావ...

Andhra Jyothy23 May, 06:15 pm
SCHOOL: అసంపూర్తిగా ‘నాడు - నేడు’ పనులు

- Home » Andhra Pradesh » Ananthapuram » Unfinished school building ABN , Publish Date - May 23 , 2026 | 11:45 PM మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. - పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. - పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు.

10TV Telugu29 May, 01:35 am
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. ఈదురు గాలులు, పిడుగుల హెచ్చరికలు

Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీగా ఈదురుగాలులు, ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. Also Read : Gold Rate Today : మహిళలకు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే.. ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షానికితోడు ఈదురుగాలులు బీభత్సం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉమ్మడి ప్రకాశం, కడప జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఉమ్మడి కృష్ణా , గుంటూరు జిల్లాల్లోనూ వర్షం కుురుస్తోంది. విజయవాడ, జగ్గయ్యపేట, మైలవరం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. విజయవాడలో భారీ ఈదురుగాలలో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగ్ నగర్, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ద్రోణి ప్రభావంతో ఇవాళ పల్నాడు, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో.. మొత్తంగా ఇవాళ రాత్రికి రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నంద్యాల జిల్లాలనూ

10TV Telugu27 May, 08:12 am
మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

Nara lokesh : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండ్రోజుల మహానాడు పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ మహానాడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళా నాయకులకు శుభవార్త చెప్పారు. Also Read : Gold Rate Today : మహిళలకు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే.. నిజానికి, నారా లోకేశ్ ఇవాళ ఉదయమే తన సోషల్ మీడియా ఖాతాలో.. నేడు ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాను అంటూ ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సస్పెన్ష్ రేకెత్తించారు. దానికి అనుగుణంగా.. టీడీపీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామంటూ మహానాడు వేదికగా నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాసైనా.. అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని అన్నారు. తెలుగుదేశం సిద్ధాంతాలే మన బలం. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అదీ సీబీఎన్ కృషి వల్లేనని లోకేశ్ పేర్కొన్నారు. వైసీపీపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. మాది గూగుల్‌.. మీది గొడ్డలి. మాది ఫైటర్‌ జెట్‌.. మీది ఫ్యాక్షన్‌. మాది కియా అయితే.. మీది కిడ్నాప్‌ అని లోకేశ్‌ విమర్శించారు.