translateexpand_more

Bollywood News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 01:08 pm
నటి రవీనా టండన్ ఇంట్లో రూ.25 లక్షల వజ్రాభరణాల చోరీ.. పనిమనిషే పక్కా ప్లాన్ చేసి

Raveena Tandon: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ సోదరుడు రాజీవ్ టండన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో ముంబై జుహు పోలీసులు ఎట్టకేలకు ఒక మహిళను అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబరులో రాజీవ్ టండన్ ఇంట్లోని లాకర్ నుండి దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, ఖరీదైన చేతి వాచీలు మాయమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపగా, రవీనా టండన్ తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న 47 ఏళ్ల రాశి ఛాబ్రియా ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. Vasanthi Krishnan: సప్తశృంగి దేవి సన్నిధిలో బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి.. డివోషనల్ ఫోటోలు వైరల్! గత 2020 నుండి ఈ కుటుంబంతో నమ్మకంగా ఉంటూ, ఇంట్లోని విలువైన వస్తువులు ఉండే గదుల్లోకి సైతం స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని రాశి ఛాబ్రియా సంపాదించుకుంది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అదును చూసి లాకర్‌లోని నగలను దొంగిలించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో తొలుత నేరాన్ని ఖండించినా, ఆ తర్వాత రెండు వాచీలను తిరిగి ఇచ్చేసి మిగిలిన నగలు జగదీష్ అనే వ్యక్తి వద్ద ఉన్నాయని ఒప్పుకుంది. అంతేకాకుండా, నగల విషయమై ఒత్తిడి తెస్తే టండన్ కుటుంబాన్ని నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీసులు మే 21న నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, మే 29 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇక రవీనా టండన్(Raveena Tandon) గతంలో తెలుగులో పలు చిత్రాల్లో నటించగా, ప్రస్తుతం ఆమె కుమార్తె రషా తడానీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో రషా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

SkyC Media02 Jun, 10:56 am
కాలా హిరాన్ ప్రాజెక్టుపై సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు పంపడం ఇప్పుడు పరిశ్రమలో సంచలనంగా మారింది. కాలా హిరాన్ అనే ప్రాజెక్ట్ లేదా సినిమాను నిర్మిస్తున్న మేకర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ చర్యలు చేపట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, పోలికలు మరియు వ్యక్తిత్వాన్ని వాడుకున్నారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సదరు ప్రాజెక్ట్ నిర్వాహకులకు న్యాయపరమైన హెచ్చరికలు జారీ చేయడం విశేషం. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాలా హిరాన్ మేకర్స్ తన అనుమతి తీసుకోకుండానే కథను సిద్ధం చేశారని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారు. తన వ్యక్తిగత గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు పంపి సదరు చిత్ర బృందాన్ని వివరణ కోరారు. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి చర్యల వల్ల స్టార్స్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌లో అనుమతి లేకుండా ప్రముఖుల జీవిత విశేషాలను వాడటం తరచూ వివాదాలకు దారితీస్తోంది. సెలబ్రిటీల ఖ్యాతిని వాడుకుని ప్రాజెక్టులపై క్రేజ్ పెంచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా జరిగిన ఈ పరిణామంతో కాలా హిరాన్ ప్రాజెక్ట్ మేకర్స్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు మరియు తదుపరి అడుగులపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ నోటీసుపై కాలా హిరాన్ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వారు న్యాయపరమైన నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైతే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ తన లీగల్ టీమ్ ద్వారా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. తగిన అనుమతులు లేకుండా ఏ ఒక్కరూ తన వ్యక్తిత్వాన్ని వాడకూడదని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కుతుందా లేదా అనేది చూడాలి. చిత్ర పరిశ్రమలో ఇలాంటి నోటీసులు రావడం కొత్త కాకపోయినా సల్మాన్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు పంపిన తర్వాత కాలా హిరాన్ మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ సమస్యను వారు సామరస్యంగా పరిష్కరించుకుంటారా లేక చట్టపరంగా ఎదుర్కొంటారా అనేది వేచి చూడాల్సిందే.

Chitrajyothy02 Jun, 10:32 am
బాబోయ్.. ఈ ముగ్గురి అల్లరి మాములుగా లేదు

షాహిద్‌ కపూర్ (Shahid Kapoor), రష్మిక, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్‌టెయిల్‌ 2’ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. షాహిద్‌ కపూర్ (Shahid Kapoor), రష్మిక (Rashmika Mandanna), కృతి సనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాక్‌టెయిల్‌ 2’. హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైయాంకేజీలే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ (Cocktail 2 Trailer)ను మంగళవారం విడుదల చేశారు. దీనిలో రష్మిక, కృతి చేసిన అల్లరి చూసేయండి

Chitrajyothy02 Jun, 10:12 am
సుస్మితను గోల్డ్ డిగ్గర్ అనడం అన్యాయం

బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌పై వస్తున్న ఆరోపణలను లలిత్‌ మోదీ తిప్పికొట్టారు. ఆమెను గోల్డ్‌ డిగ్గర్‌ అని కామెంట్‌ చేయడం సరికాదన్నారు. బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌పై వస్తున్న ఆరోపణలను లలిత్‌ మోదీ తిప్పికొట్టారు. ఆమెను గోల్డ్‌ డిగ్గర్‌ అని కామెంట్‌ చేయడం సరికాదన్నారు. సుస్మితా సేన్‌ డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తి అని ఇటీవల ఆమెపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే! దీనిపై ఓ ఇంటర్వ్యూలో లలిత్‌ మోదీ మాట్లాడారు. ‘సుస్మిత నాకు నాకెంతో స్పెషల్‌. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను ఈ స్థాయిలో ఉండటం వెనుక ఆమె సహాయం ఎంతో ఉంది. మేం ఎప్పుడు బయటకు వెళ్లినా దేనికీ నా చేత డబ్బు ఖర్చు చేయనిచ్చేది కాదు. తానే అన్ని బిల్స్‌ పే చేసేది. నేనే ఆమె డబ్బులపై ఆధారపడ్డాను. నిజానికి నేను ఆమెకు కెప్ట్‌ బాయ్‌ఫ్రెండ్‌లా ఉన్నాను. ఆమె మాత్రం ఎవరి దగ్గర ఏదీ ఆశించదు. సుస్మిత సినీరంగం, వ్యాపార రంగంలో కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గర ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. అవన్నీ ఆమె స్వయంగా సంపాదించుకుంది. ఆమెకు డైమండ్‌ స్టోర్స్‌ కూడా ఉన్నాయి. ఆమెను గోల్డ్‌ డిగ్గర్‌ అనిపిలవడం అన్యాయం. ‘ఆమె గోల్డ్‌ డిగ్గర్‌ కాదు.. నేనే డైమండ్‌ డిగ్గర్‌ని’. ఆమె వ్యక్తిత్వం తెలియని చాలామంది ఆమె పై కామెంట్స్‌ చేస్తుంటారు’ అని అన్నారు.

AP7AM02 Jun, 02:40 am
సుస్మిత సేన్ తో బంధంపై ఏళ్ల తర్వాత స్పందించిన లలిత్ మోదీ.. సంచలన నిజాలు వెల్లడి

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, విశ్వసుందరి సుస్మితా సేన్ మధ్య 2022లో నడిచిన ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు కోసం ఆశపడే వ్యక్తి) అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలపై లలిత్ మోదీ ఏళ్ల తర్వాత స్పందించారు. సుస్మితపై వచ్చిన విమర్శలన్నీ అవాస్తవమని, తమ బంధంలో ఖర్చులన్నీ ఆమే భరించేదని స్పష్టం చేశారు.ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. "ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం చాలా తప్పు. వాస్తవానికి మా ప్రయాణాల్లో ఖర్చులన్నీ ఆమే చూసుకునేది. చెప్పాలంటే.. నేనొక కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా (ఆమె పోషణలో ఉన్న ప్రియుడిలా) ఉండేవాడిని" అని మోదీ అన్నారు. తమలో ఎవరైనా డిగ్గర్ ఉంటే, అది వజ్రాల కోసం వెతికిన తానేనని ఆయన చమత్కరించారు. సుస్మిత తన కంటే ముందే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం కూడా ఉందని తెలిపారు.2022 జులైలో లలిత్ మోదీ.. సుస్మితతో కలిసి విహారయాత్రల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆమెను తన 'బెటర్ హాఫ్' అని ప్రకటించారు. దీంతో సుస్మితపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. లలిత్ మోదీ సంపద కోసమే ఆమె బంధం కొనసాగిస్తోందని ఆరోపణలు గుప్పించారు.అయితే ఆనాటి ట్రోలింగ్‌పై సుస్మిత కూడా ఎంతో హుందాగా స్పందించారు. "నేను బంగారం కంటే లోతుగా తవ్వుతాను. నాకు ఎప్పటినుంచో వజ్రాలంటేనే ఇష్టం. వాటిని ఇప్పటికీ నేనే

Bollywood News Keyword | Telugu Digital