translateexpand_more

Ceasefire Agreement News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 01:49 am
ఇజ్రాయెల్-హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్ తో చర్చలు సానుకూలం

<p>ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు శాశ్వతంగా ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆకాంక్షించారు. ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగిపోవడంతో శాంతి చర్చల్లో ఇరాన్ చురుకుగా పాల్గొంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్'లో ఓ పోస్ట్ చేశారు (Israel Hezbollah ceasefire). </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>'ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపేందుకు హెజ్‌బొల్లా అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెజ్‌బొల్లాపై దాడులు నిలిపివేయడానికి ఒప్పుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది శాశ్వతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చాలా మంచి సంభాషణ జరిగిందని ట్రంప్ చెప్పారు. అయితే పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మారలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి (Israel Lebanon conflict). </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో దాడులు, రాకెట్ ప్రయోగాల వార్తలు వెలువడ్డాయి (Lebanon conflict). దీంతో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.</p><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/ap-pension-increased-to-4000-chandrababu-naidu-election-promise-fulfilled-says-mlc-anuradha-suri-1528695.html">పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/mailavaram-mla-vasantha-krishna-prasad-ensures-transparent-pension-distribution-vk-1528694.html">పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

AP7AM01 Jun, 03:57 pm
లెబనాన్ పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులను తీవ్రతరం చేయడంతో, అమెరికాతో జరుపుతున్న చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ప్రాథమిక ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య మధ్యవర్తుల ద్వారా జరుగుతున్న సందేశాల మార్పిడికి బ్రేక్ వేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.లెబనాన్‌లో ఇజ్రాయెల్ నేరాలు కొనసాగిస్తుండటమే తమ నిర్ణయానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. "కాల్పుల విరమణకు లెబనాన్‌పై దాడులు చేయకూడదన్నది కూడా ఒక ముఖ్యమైన ముందస్తు షరతు. కానీ లెబనాన్‌తో సహా అన్ని అంశాల్లోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అందుకే మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతున్న చర్చలను, సందేశాల మార్పిడిని ఇరాన్ చర్చల బృందం నిలిపివేస్తుంది" అని తస్నిమ్ నివేదిక పేర్కొంది.ఈ పరిణామంపై అంతకుముందు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ దాడులకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, ఏ ఒక్కచోట ఉల్లంఘన జరిగినా, అది అన్నిచోట్లా జరిగినట్టేనని వ్యాఖ్యానించారు. దీని పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని అరాఘ్చీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అమెరికాతో చర్చల్లో దేశ ప్రతినిధిగా ఉన్న ఘలీబాఫ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా దిగ్బంధనం విధించడం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ప్రతి చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని