translateexpand_more

Hezbollah News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 01:49 am
ఇజ్రాయెల్-హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్ తో చర్చలు సానుకూలం

<p>ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు శాశ్వతంగా ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆకాంక్షించారు. ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగిపోవడంతో శాంతి చర్చల్లో ఇరాన్ చురుకుగా పాల్గొంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్'లో ఓ పోస్ట్ చేశారు (Israel Hezbollah ceasefire). </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>'ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపేందుకు హెజ్‌బొల్లా అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెజ్‌బొల్లాపై దాడులు నిలిపివేయడానికి ఒప్పుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది శాశ్వతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చాలా మంచి సంభాషణ జరిగిందని ట్రంప్ చెప్పారు. అయితే పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మారలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి (Israel Lebanon conflict). </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో దాడులు, రాకెట్ ప్రయోగాల వార్తలు వెలువడ్డాయి (Lebanon conflict). దీంతో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.</p><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/ap-pension-increased-to-4000-chandrababu-naidu-election-promise-fulfilled-says-mlc-anuradha-suri-1528695.html">పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/mailavaram-mla-vasantha-krishna-prasad-ensures-transparent-pension-distribution-vk-1528694.html">పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy27 May, 01:26 am
లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగిన అత్యంత భీకర దాడులు ఇవేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది (Israel Lebanon conflict). లెబనాన్‌లోని పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్‌బొల్లా అనుమానిత స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. లెబనాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపించింది (Israeli attack Lebanon). హెజ్‌బొల్లా మిలిటెంట్లు తమ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు ప్రయోగించారని (Israel Hezbollah war), దానికి ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్‌బొల్లా స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. తాజా దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించింది. ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి.. మీ పెంపుడు జంతువుల మాటలను అర్థం చేసుకోవచ్చు.. చైనా కంపెనీ సంచలన ఆవిష్కరణ..