translateexpand_more

Chandrababu Naidu News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu03 Jun, 09:32 am
ఈసారి కృష్ణానది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగా కార్యక్రమం

అమరావతి: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌, స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకు యోగాంధ్రను ఏటా జరపాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవానికి ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజ్‌’ థీమ్‌ను పాటిస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంజీవని పథకంలో యోగాను అనుసంధానం చేస్తామని తెలిపారు. ‘‘ఈ నెల 7 నుంచి 20 వరకు 14 రోజులపాటు యోగా కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రతి జిల్లా, మండల కేంద్రం ఇలా ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల యోగా కార్యక్రమాలు నిర్వహించాలి. యోగాంధ్ర 2026లో కనీసం కోటి మంది పాల్గొనేలా లక్ష్యం పెట్టుకోవాలి. 10 లక్షల మంది సర్టిఫైడ్‌ యోగా సాధకులను తయారు చేయాలి. గతేడాది యోగా కార్యక్రమాలతో అనేక రికార్డులు సాధించాం. ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయగలిగాం. నిరుడు విశాఖ బీచ్‌ పక్కన రోడ్డుపై యోగా చేశాం. ఈసారి కృష్ణా నది వెస్ట్‌ బైపాస్‌ రోడ్డుపై యోగా చేస్తాం. అమరావతి అందాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కూడా ఉంటుంది’’ అని చంద్రబాబు అన్నారు. 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించారని చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 8142404888 కాల్ సెంటర్‌ను సంప్రదించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఐటీఐ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం ముందుకొచ్చింది.