
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Revanth Reddy two days Mahabubnagar Tour Schedule: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో పాలనలో మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలపై ఆరోపణలు గుప్పిస్తునే మరోవైపు తెలంగాణలో ఇచ్చిన హమీల్ని నెరవేరుస్తు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పలు ప్రాంతాల్ని తరచుగా సందర్శించి, స్థానికుల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించి, అధికారులతో సమీక్షించనున్నారు. జూన్ 4న సోమశిలలో సీఎం రేవంత్ బసచేయనున్నారు. ఆ తర్వాత జూన్ 5న ఉద్దండాపూర్ లో నిర్వహించే బహిరంసభకు రేవంత్ రెడ్డి హజరుకున్నారు. ముఖ్యమంత్రి గారి రెండు రోజుల పర్యటన వివరాలు: - జూన్ 4 (గురువారం).. మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్కేఎల్ఐఎస్), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తారు. మధ్యాహ్నం 3.40 గంటల నుంచి 4 గంటల వరకు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం 4.10 గంటలకు మక్తల్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. - సాయంత్రం 4.10 గంటలకు కోయిల్సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి హెలిప్యాడ్కు చేరుకుంటారు . సాయంత్రం 4.55 గంటల నుంచి 5.30 గంటల వరకు గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఎస్ స్టేజ్-1 పంప్హౌస్ను పరిశీలిస్తారు. - అక్కడి నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలిప్యాడ్కు చేరుకుంటారు. సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు మృగవాణి రిసార్ట్ రివర్ఫ్రంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. - ఉదయం 10.30 గంటలకు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్హౌస్కు చేరుకుంటారు. ఉదయం 10.40 గంటల నుంచి 11.40 గంటల వరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్, ఎంజీకేఎల్ఐఎస్ లిఫ్ట్-1 పంప్హౌస్లను పరిశీలిస్తారు. ఉదయం 11.50 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు నార్లాపూర్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి పీఆర్ఎల్ఐఎస్ ప్యాకేజీ-3 కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. - మధ్యాహ్నం 12.20 గంటలకు కుమ్మెర హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పీఆర్ఎల్ఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్హౌస్, వట్టెం రిజర్వాయర్కు సంబంధించిన ప్యాకేజీ - 9, 10, 11 పనులను పరిశీలిస్తారు. - మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 2.30 గంటల వరకు పీఆర్ఎల్ఐఎస్కు చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. - అనంతరం సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉదండాపూర్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. సాయంత్రం 5.10 గంటల నుంచి 5.40 గంటల వరకు పీఆర్ఎల్ఐఎస్కు చెందిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పరిశీలిస్తారు. Read more: KTR VS Pawan kalyan: తెలంగాణ బరాబర్ భూమి పుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ టార్గెట్గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. - సాయంత్రం 6.30 గంటలకు ఉదండాపూర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ప్రయాణ షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి