translateexpand_more

Telangana Govt News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 01:32 pm
నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. నుంచి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

TGPSC announces three govt job notifications: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేళ టీజీపీఎస్సీ మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగులు మాత్రం టీజీపీఎస్సీ చెప్పిన మాటలు నిలబెట్టుకొవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పార్టీలకతీతంగా నేతలు తమపార్టీ ఆఫీసుల్లో, వివిధ ప్రాంతాల్లో జెండాలను ఎగుర వేశారు. మరోవైపు తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను కూడా స్మరించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మూడు నోటిఫికేషన్లను ప్రకటించింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49 ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలో 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని.. వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ ఇస్తామని వెంకటేశం కీలక ప్రకటన చేశారు. టీజీపీఎస్సీ చెప్పిన విధంగానే మూడు నోటిఫికేషన్లను విడుదల చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49, పోస్టులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. అంతే కాకుండా.. సివిల్ పోస్టులకు జూన్ 6 నుంచి 13 వరకు, ఎలక్ట్రిక్ పోస్టులకు జూన్ 8 నుంచి జులై 15 వరకు అప్లై చేసుకొవచ్చు. ఆ తర్వాత.. ఎన్విరాన్ మెంటల్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17 వరకు అప్లై చేసుకొవచ్చు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అర్హతలు, ఎగ్జామ్ విధానం, సిలబస్ ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. గత కొన్ని ఏళ్లుగా నిరుద్యోగ యువతీ, యువకులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో హస్టల్ లలో, రూమ్ లలో ఉంటూ, కొంత మంది పార్ట్ టైమ్ లో జాబ్ లు చేస్తు మరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో గతంలో పలు మార్లు నోటిఫికేషన్ ల కోసం అభ్యర్థులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో రోడ్డు మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీల మేరకు అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఒకేసారి మూడు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రతినెల ఇప్పటి నుంచి నోటిఫికేషన్ లు విడుదల చేసేలా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటుందని, ఈ ఎగ్జామ్ లు కూడా పూర్తిగా పారదర్శకంగా ఎలాంటి అక్రమాలు జరక్కుండా నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెల్చి చెప్పింది. ఎలాంటి ఫెక్ ప్రచారాలు, పుకార్లను నమ్మోద్దని టీజీపీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల్ని ఒక ప్రకటనలో కోరింది.

10TV Telugu02 Jun, 09:09 am
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఈ శాఖల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Telangana Govt : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మూడు నోటిఫికేషన్లకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, విద్యాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. Also Read : KTR : తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ తను చెప్పుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 3,800 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ప్రస్తుతం మూడు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. వీటిలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 222 ఏఈ (సివిల్‌), ఏఈ (ఎలక్ట్రికల్‌) 49, కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని తొమ్మిది అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెలాఖరులో మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 28 కేటగిరీల పోస్టుల్లో ఒక్కొక్క ఖాళీ చొప్పున, మరో 25 కేటగిరీల పోస్టుల్లో ఐదు కంటే తక్కువ చొప్పున ఖాళీలు ఉన్నట్లు చైర్మన్ బుర్రా వెంకటేశం వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లను వరుస క్రమంలో తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా 67వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాలకు మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్3, గ్రూప్4తో పాటు మెగా డీఎస్సీ, వైద్యారోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టామని, రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.