
దిల్ రాజు నిర్మాణంలో వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా మమితా బైజు పేరు దాదాపు ఫైనల్ స్టేజ్కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఈమెతో జరుపుతున్న చర్చలు చాలా జోరుగా సాగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. చాలా మంది సినీ రిపోర్టర్లు కూడా ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్గా ఫైనల్ అని గట్టిగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే తెలుగులో ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ ఎంపిక కోసం మేకర్స్ గతంలో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే పలు కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్లో భాగం కాలేకపోయినట్లు తెలుస్తోంది. చివరకు మేకర్స్ మమితా బైజు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆమెతో చర్చల ప్రక్రియ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా కనెక్ట్ అయింది. దీంతో పాటు ధనుష్తో కలిసి కర అనే సినిమాలో కూడా నటించింది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్కు ప్లస్ కానుంది. ఈ సినిమాలో హీరో డిఎస్పి పక్కన మమితా బైజు ఫ్రెష్ జోడీగా బాగా సెట్ అవుతుందని మేకర్స్
