translateexpand_more

Hyderabad News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 11:50 am
బ్రిటన్ ట్రావెల్ వ్లాగర్ ప్రశంసల వర్షం

హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ న్యూయార్క్ మెట్రో కంటే కూడా హైదరాబాద్ మెట్రో చాలా బాగుందంటూ మెచ్చుకున్నాడు. హైదరాబాద్, జూన్ 02: హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్.. న్యూయార్క్ మెట్రో కంటే కూడా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అత్యంత అనుకూలంగా ఉందంటూ కొనియాడారు. భారత పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించిన ఇషాక్ ప్యాటర్సన్ మెట్రోలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ‘పబ్లిక్ మెట్రో ఇన్ హైదరాబాద్’ అనే పేరుతో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘హైదరాబాద్ మెట్రో ఎంతో అద్భుతంగా ఉంది. నేను నా జీవితంలో ఇప్పటివరకు చూసిన మెట్రో రవాణా వ్యవస్థల్లో నాకు హైదరాబాద్ మెట్రో ఇష్టంగా నిలిచిపోతుంది’ అని ఇషాక్ తన వీడియోలో పేర్కొన్నారు. ఇక్కడ మెట్రో స్టేషన్ల నిర్వహణ, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రైళ్లలో ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన ప్రకటనలు కూడా తనకు ఎంతో నచ్చాయని ఇషాక్ వెల్లడించారు. ప్రపంచంలోని అనేక నగరాల మెట్రో వ్యవస్థలను చూసిన తనకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేకంగా కనిపించిందని పేర్కొన్నారు. ఇషాక్ ప్యాటర్సన్ షేర్ చేసిన వీడియో గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశీయులు సైతం హైదరాబాద్ మెట్రో మౌలిక వసతులను, పరిశుభ్రతను అంతర్జాతీయ ప్రమాణాలతో పోలుస్తూ ప్రశంసించడం పట్ల తెలుగు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థకు ఈ ప్రశంస ఒక నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. టీఎంసీ రెబల్స్ కొత్త పార్టీ.. తెరపైకి ‘అస్లీ తృణమూల్’..

Andhra Jyothy02 Jun, 07:16 am
గండిపేట ఫేక్ జీవో కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు

<p><strong>హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):</strong> గండిపేట వందల కోట్ల రూపాయల ల్యాండ్ నకిలీ జీవోల కేసులో <strong>(Gandipet Fake GO Case) </strong>సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారీ అయ్యారని పోలీసులు తెలిపారు. ఏపీలోని నరసరావుపేటలో బ్రహ్మనాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ కేరళ, కర్ణాటకలో చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీరి కోసం గాలిస్తున్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>అక్రమ జీవోలను సృష్టించి రూ.వందల కోట్ల విలువైన ల్యాండ్‌ను కాజేసే కుట్రలో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. భూ కబ్జా చేసిన బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ వెంటనే భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఈ నకిలీ జీవోలను బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ వైరల్ చేశారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ జీవోలు వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు.. బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్‌పై నిఘా పెట్టారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>వైసీపీ నేతలు బ్రహ్మనాయుడు, రాధాకృష్ణ ఇద్దరూ కలిపి మరికొన్ని జీవోలు సృష్టించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పదిమంది నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఫేక్ జీవో కేసులో కడప జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకృష్ణపైన ఇప్పటికే 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు.</p><br/><p><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/ramachander-rao-slams-revanth-reddy-over-paddy-procurement-issue-vk-1528724.html">ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/telangana-cid-busts-major-online-betting-racket-and-11-persons-arrested-across-states-vk-1528709.html"> బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్</a></p><p style="text-align: start"><strong>Read Latest &nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong>&nbsp;And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/national"><strong>National News</strong></a></p><p style="text-align: start"><strong>And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/"><strong>Telugu News</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy02 Jun, 05:04 am
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడినా.. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే అని సీఎం అన్నారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి: చంద్రబాబు ‘తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా... తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి’ అంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: పవన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారినవర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

Eenadu02 Jun, 03:17 am
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లాల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.