translateexpand_more

Amaravati News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 09:50 am
గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్

నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనలో గొడ్డలి పార్టీ కుట్రలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు. వైఎస్ విగ్రహా ధ్వంసం వెనుక గొడ్డలి పార్టీ ఉందనే సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు. అమరావతి, జూన్ 1: నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనలో గొడ్డలి పార్టీ కుట్రలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు. వైఎస్ విగ్రహా ధ్వంసం వెనుక గొడ్డలి పార్టీ ఉందనే సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య అనే గొడ్డలి పార్టీ కార్యకర్త భార్యకు గత ప్రభుత్వంలోనే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉద్యోగం ఇచ్చారనే వివరాలను మీడియా ముందుంచారు. తాము, తమ కుటుంబం వైసీపీకి చెందిన వాళ్లమని జంబులయ్య, ఆయన కుటంబసభ్యుల వాంగ్మూలాలను మీడియా కాన్ఫరెన్సులో ప్రదర్శించారు. శవం, సింపతీ, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ విధానమంటూ మంత్రి అనగాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి వ్యవహారంలో జగన్ పీఏ కేఎన్నార్ ఆస్తుల గుట్టు బయటపడుతోందని మంత్రి తెలిపారు. జగన్ పీఏకే బినామీలు ఉన్నారంటే.. జగన్‌కు ఇంకెంత మంది బినామీలు ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి.. దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జంబులయ్య భార్యకు మెప్మాలో గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారని... నాటి వైసీపీ ఎమ్మెల్యేనే ఆ ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు.. విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదన్నారు. విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ నేతలే తీయించడం.. మళ్లీ ధర్నాలు చేయడం ఆ పార్టీకే చెల్లిందంటూ దుయ్యబట్టారు. శవం, సింపతీ, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ విధానమంటూ వ్యాఖ్యానించారు. వైఎస్

Andhra Jyothy01 Jun, 10:10 am
దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

<p><strong>కాకినాడ జిల్లా, జూన్ 1: </strong>తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం స్వయంగా అతని దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి ఫోటో దిగడంతో ఆ దివ్యాంగ యువకుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ, ‘మీరంటే మా కుమారుడికి ఎంతో అభిమానం’ అని తెలిపారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పిలిచిన సీఎం.. ప్రభుత్వం తరఫున దివ్యాంగ యువకుడికి అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/chandrababu_947b68a588.jpg" alt="chandrababu" width="1280" height="720"></p><p>అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా సాగుతున్న వివిధ పంటల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మైక్రో న్యూట్రియెంట్స్‌తో పాటు ప్రకృతి సేద్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/srikakulam/south-coast-railway-zone-inaugurated-ram-mohan-naidu-says-local-solutions-now-possible-from-today-suchi-1528734.html">కొత్త రైల్వే జోన్.. ఇకపై మన సమస్యలు మనమే తీర్చుకోగలం: రామ్మోహన్ నాయుడు</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/anagani-satya-prasad-alleges-conspiracy-in-nandyal-statue-incident-criticizes-opposition-politics-suchi-1528743.html">గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్</a></p><p><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p>

Andhra Jyothy28 May, 12:32 pm
కూల గొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు, మే 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు రాజధాని అమరావతిలో రెండో రోజు నిర్వహించిన మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నీటిపారుదల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీకి ముందు ఆ తర్వాతే అని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లుపెట్టాలి.. ఎప్పుడు పూర్తి చేయాలో సీఎం చంద్రబాబు ల‌క్ష్యంగా పెట్టారని వివరించారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లల చేయలేని పనులు 23 నెలల్లో చేశామని వివరించారు. చెప్పిన మాట ప్రకారం.. హంద్రీనివా పనులు పూర్తి చేసి తొలి ఏడాదిలోనే 727 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణాజలాలు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, ఏపీ సీఎంలు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారని తెలిపారు. కేవలం 22 నెలల్లోనే పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్వాసితుల‌కు రూ. 2,250 కోట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పూర్తికానీ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం, దగా చేశాడంటూ వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల నిప్పులు చెరిగారు. కూట‌మి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.2,500 కోట్లు ఖ‌ర్చు చేశామని వివరించారు. రూ. 203 కోట్లతో శ్రీశైలం డ్యాం మరమ్మతులు చేపట్టామన్నారు. 23 నెలల్లో భారీ నీటిపారుదల శాఖలో

NTV Telugu28 May, 06:02 am
మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి

TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మహానాడులో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువారికి పండుగ రోజు అని పేర్కొన్నారు. సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్, తన క్రమశిక్షణ, కృషి, నిజాయితీతో సినీరంగంలో అగ్రస్థానానికి చేరుకుని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. రైతుబిడ్డగా మొదలై, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడిగా ఆయన నిలిచారని గుర్తుచేశారు. అంతేకాకుండా, ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిపిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఎన్టీఆర్ పాలన రైతులకు అండగా, మహిళలకు భరోసాగా, కార్మికులకు అభయంగా, యువతకు దిక్సూచిగా నిలిచిందని తెలిపారు చంద్రబాబు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే నినాదాన్ని శాశ్వతంగా ప్రజల్లో నాటిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 1983లో యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిన్న జాతీయ

Andhra Jyothy28 May, 04:41 am
రెండో రోజు ఘనంగా ప్రారంభమైన మహానాడు

టీడీపీ మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది. అమరావతి, మే 28: టీడీపీ మహానాడు- 2026 రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు.

Andhra Jyothy27 May, 04:29 am
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు-2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నిర్వహిస్తున్న మహానాడు-2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈసారి మహానాడును పూర్తిగా సాంకేతికత ఆధారంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 1851 క్లస్టర్లను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్లస్టర్‌ను Two-Way కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా నేరుగా అనుసంధానిస్తూ నాయకులు, కార్యకర్తలతో మమేకం కానున్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మహానాడు ప్రత్యేకంగా ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పార్టీ నిర్మాణంలో మహిళల పాత్ర, సామాజిక సేవలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా ‘కార్యకర్తే అధినేత, యువగళం, పేదల సేవలో టీడీపీ’ వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరుగనున్నాయి. మహానాడులో మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. పార్టీ

Andhra Jyothy27 May, 03:56 pm
గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు

హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి, మే27: హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో ఇంత మంది కార్యకర్తలు పాల్గొనటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. మహానాడు సమావేశం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొ్న్నారు. తొలిరోజు మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యతను చూసి.. వారిలో ఆందోళన వ్యక్తం అవుతోందని వైసీపీ నేతలను పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తలుగా ఉన్న వారు నాయకులుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని మహానాడు ప్రసంగాల ద్వారా అర్ధమైందన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని సమర్ధంగా ఎదుర్కోనేలా ప్రతీ కార్యకర్తా, నేతలూ సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రేపటి మహానాడులో ముఖ్యమైన చర్చలు, తీర్మానాలు జరుగుతాయని వివరించారు. వాటన్నింటిలో పార్టీ కుటుంబ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొనాలని సూచించారు. వర్చువల్‌గా మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తొలిరోజు వర్చువల్ మహానాడుకు 7.5 లక్షల మంది హాజరుకావటం రికార్డు అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ చేసిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనలపై ఈ టెలికాన్ఫరెన్సులో ప్రస్తావించారు. లోకేష్ చేసిన ఈప్రతిపాదనను ఆమోదించాలని టెలికాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబును నేతలు కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో

Andhra Jyothy27 May, 02:43 pm
తొలి రోజు ముగిసిన మహానాడు.. పార్టీకి వెల్లువెత్తిన విరాళాలు

టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు తొలి రోజు బుధవారం ముగిసింది. తొలిరోజు మహానాడులో వివిధ తీర్మానాలపై 48 మంది నేతలు ప్రసంగించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దాదాపు రూ.12 కోట్లు విరాళంగా నేతలు అందజేశారు. అమరావతి,మే27: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు తొలి రోజు బుధవారం ముగిసింది. తొలిరోజు మహానాడులో వివిధ తీర్మానాలపై 48 మంది నేతలు ప్రసంగించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దాదాపు రూ.12 కోట్లు విరాళంగా నేతలు అందజేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతలు పార్టీకి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. పార్టీకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే భాష్యం రామకృష్ణలు రూ. కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు. అలాగే మహానాడులో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌కు ప్రసంగించే అవకాశాన్ని పార్టీ కల్పించింది. ఈ మహానాడు వేదికగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పీఏ ట్రాన్స్‌జెండర్ వర్షిణీ ప్రసంగించింది. పార్లమెంట్‌ బిల్లుతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై సర్వత్రా చర్చ నడుస్తోంది. లోకేష్ తాజా ప్రకటనపై పార్టీలోని నేతలతో పాటూ కేడర్ కూడా స్వాగతిస్తున్నారు. అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్‌కు పొంగులేటి సవాల్ లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

Eenadu27 May, 05:55 am
నాయకులు, కార్యకర్తలు ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు

అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP MahaNadu) నాయకులు, కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు.. ఇప్పటి వరకూ పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసి పోయాయని, తెదేపా ఒక్కటే నిత్యచైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులూ కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌-2047 రూపొందించారన్నారు. 63 శాతం యువతకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోందన్నారు. 26 ఏళ్లకే రామ్మోహన్ నాయుడు ఎంపీ, తర్వాత కేంద్రమంత్రి అయ్యారన్నారు. గంటి హరీష్ 27 ఏళ్లకు ఎంపీ అయ్యారని వివరించారు. గతంలో అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు లాంటి నేతలు చిన్నవయసులోనే పార్టీలో కీలక నేతలుగా ఎదిగారని పల్లా శ్రీనివాసరావు గుర్తుచేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu24 May, 12:24 pm
ఎబోలా ఎఫెక్ట్‌.. ఎయిర్‌పోర్టులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

1. AFR's decision to withdraw from the Paris Agreement has led to a global financial crisis. 2. The financial impact of AFR's withdrawal is expected to be significant, affecting multiple sectors and economies worldwide. 3. This sudden change in international climate policy could have far-reaching consequences for global economic stability and environmental sustainability.

NTV Telugu30 May, 02:01 am
అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు

Amaravati Land Allocation: అమరావతిలో ఇప్పటివరకూ 114 సంస్థలకు 1269 ఎకరాలు కేటాయించాం అన్నారు మంత్రి నారాయణ..వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు,44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయన్నారు.మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాలతో కేటాయింపులు రద్దు చేసుకున్నాయన్నారు నారాయణ.మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన దానికి బదులు వేరే చోట భూకేతయింపు చేశామని చెప్పారు..రాజధాని లో భూ కేటాయింపు లపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది.రాజధాని నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదన్నారు. నారాయణ.. అమరావతి లో భూముల కేటాయించమని తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు మంత్రి నారాయణ.. ముంబై నుంచి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వచ్చిన సంస్థల ఆర్ధిక పరిస్థితులు చూసి భూ కేటాయింపు జరుగుతుంది అన్నారు మంత్రి. నారాయణ. ఇక, అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ నిర్మాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని సూచించినప్పటికీ, అమరావతి రాష్ట్ర రాజధాని కావడంతో నిర్మాణ పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను ఇచ్చారని, గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడూ రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు, తెలుగు సినీ పరిశ్రమ నుంచి అమరావతిలో భూముల కేటాయింపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని మంత్రి నారాయణ వెల్లడించారు. అయితే ముంబైకి చెందిన కొన్ని సినీ, వ్యాపార సంస్థలు

Eenadu25 May, 01:22 pm
ఈనాడు, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు ఊపందుకుంటాయి. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందడానికి వివిధ ఫ్లేవర్లలో దొరికే ఐస్‌క్రీమ్‌లను లాగించేస్తుంటారు. అయితే,...

ఈనాడు, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు ఊపందుకుంటాయి. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందడానికి వివిధ ఫ్లేవర్లలో దొరికే ఐస్‌క్రీమ్‌లను లాగించేస్తుంటారు. అయితే, ఇలా కనిపించే ప్రతీది ఐస్‌క్రీమ్‌ కాదనే విషయం తె...

Andhra Jyothy28 May, 02:21 am
అమరావతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏబీఎన్ పూర్ణ స్మారక ఉచిత మెడికల్ క్యాంప్

అమరావతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏబీఎన్ పూర్ణ ఉచిత స్మారక మెడికల్ హెల్త్ క్యాంపును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక్రటావు, డాక్టర్ అక్కినేని మణి ప్రారంభించారు. జర్నలిస్టులకు అక్కినేని ఆస్పత్రులు 20 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు అమరావతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏబీఎన్ పూర్ణ ఉచిత స్మారక మెడికల్ హెల్త్ క్యాంపును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక్రటావు, డాక్టర్ అక్కినేని మణి ప్రారంభించారు. జర్నలిస్టులకు అక్కినేని ఆస్పత్రులు 20 రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. జర్నలిజంలో విలువలకు ప్రాధాన్యం ఇస్తూ అందరితో కలిసి పనిచేసిన వ్యక్తి ఏబీఎన్ పూర్ణ అని ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. పూర్ణ తన అనారోగ్యాన్ని గుర్తించి అక్కినేని ఆస్పత్రులకు ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని యార్లగడ్డ పేర్కొన్నారు. నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్ మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన

Andhra Jyothy26 May, 06:11 am
ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా మంత్రి నారా లోకేశ్.. ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అమరావతి, మే 26: ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(మంగళవారం) ఉదయం మంత్రి నారా లోకేశ్.. సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు 19,880 మంది హాజరవగా.. మొత్తం 19,741 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎడ్‌సెట్‌లో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి దిశగా విద్యార్థులు మరో ముందడుగు వేశారని మంత్రి అన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను పొందవచ్చు. రాజమండ్రి: గోదావరి జలాల కాలుష్యంపై పవన్ కల్యాణ్ దృష్టి ‘నన్ను ప్రశ్నించండి’.. కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శ్రీకారం