translateexpand_more

Ipl 2026 News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 04:06 pm
పంజాబ్ కింగ్స్ స్పిన్ కోచ్ కు టీమిండియా కీలక పదవి

ఐపీఎల్ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్‌ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026)లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్‌ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (మంగళవారం) అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ , దేశీయ క్రికెట్‌లో దిగ్గజ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. బహుతులే టీమిండియా తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 6,176 పరుగులు చేశాడు. అంతేకాక 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచాడు. అలానే కోచ్‌గా కూడా బహుతులే అనేక విజయాలు సాధించాడు. విదర్భ, కేరళ, గుజరాత్‌, బెంగాల్‌ దేశవాళీ జట్లకు ప్రధాన కోచ్‌గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘంగా కాలం స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. అతడు ఐసీసీ అండర్‌19 ప్రపంచకప్‌ 2022 గెలిచిన భారత జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌2024లో కూడా కోచింగ్‌ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్‌ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది. తన నియామకంపై స్పందించిన సాయిరాజ్‌ బహుతులే, భారత జట్టు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్! లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

TV9 Telugu02 Jun, 01:31 pm
సచిన్, కోహ్లీల రికార్డులు అవుట్.. 15 ఏళ్లకే బ్లాంక్ చెక్కులు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ బుడ్డోడు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తరఫున ఆడిన వైభవ్.. తన బ్యాటింగ్ విశ్వరూపంతో క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో మేజర్ అవార్డులన్నింటినీ ఇతడే క్లీన్ స్వీప్ చేశాడు. దాంతో రాత్రికి రాత్రే ఈ బిహార్ కుర్రాడి బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం పక్కకు నెట్టి కార్పొరేట్ కంపెనీలు ఈయన వెనుక పరుగులు పెడుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో రన్నరప్ రేసులో రాజస్థాన్ క్వాలిఫైయర్-2 లో ఓడిపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఈ అవార్డులు గెలవడమే కాకుండా.. ఒకే సీజన్‌లో ఎంవీపీ, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు రెండూ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సైతం స్పందిస్తూ.. భవిష్యత్తులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కంటే పెద్ద సెలబ్రిటీ వైభవ్ అవుతాడని జోస్యం చెప్పారు. ఐపీఎల్‌లో వైభవ్ చూపించిన ప్రతాపానికి బ్యాట్ స్పాన్సర్‌షిప్ మార్కెట్ అప్సెట్ అయిపోయింది. కోహ్లీ బ్యాట్ స్పాన్సర్ ఎమ్ఆర్ఎఫ్, రోహిత్ శర్మ బ్యాట్ స్పాన్సర్ సియట్ లాంటి దిగ్గజ క్రీడా సంస్థలు వైభవ్ బ్యాట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక ప్రముఖ కంపెనీ అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడికి ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజ్ చూసి వైభవ్ తన కమర్షియల్ యాడ్స్ రేట్లను ఏకంగా రెట్టింపు చేసేశాడు. వైభవ్ సూర్యవంశీ కమర్షియల్ జర్నీ ప్రముఖ న్యూట్రిషన్ బ్రాండ్ కాంప్లాన్ ఇండియాతో ప్రారంభమైంది. 2026 ప్రారంభంలోనే కాంప్లాన్ సంస్థ అతనితో థోడా ప్లాన్, థోడా కాంప్లాన్ అనే క్యాంపెయిన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.75 నుంచి 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ యాడ్‌లో వైభవ్ క్రమశిక్షణతో కూడిన శిక్షణ, క్రీడాకారులకు పోషకాహారం ఎంత ముఖ్యమనే విషయాలను హైలైట్ చేశారు. రెడ్ బుల్ ఛాలెంజ్.. గూగుల్ పే పాకెట్ మనీ యాడ్ ఐపీఎల్ 2026 టోర్నీ జరుగుతున్న సమయంలోనే వైభవ్ తన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌మేట్ ధ్రువ్ జురెల్‌తో కలిసి రెడ్ బుల్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్‌లో కనిపించాడు. స్పిన్నింగ్ వీల్ గేమ్ ద్వారా 30 బంతుల్లో 60 పరుగులు చేసే టాస్క్‌లో పాల్గొని అలరించాడు. దీనితో పాటు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే పాకెట్ మనీ క్యాంపెయిన్‌లో కూడా వైభవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. టీనేజర్లు తమ యూపీఐ ఐడీలను తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకునే ఈ ఫీచర్ యాడ్‌లో 15 ఏళ్ల వైభవ్ రోజువారీ డిజిటల్ పేమెంట్స్ చేస్తూ కనిపించాడు. జార్ఖండ్ ఆరోగ్య శాఖ అంబాసిడర్‌గా.. ఎస్ఎస్ బ్యాట్ డీల్ మే 30వ తేదీన జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఒక కీలక ప్రకటన చేశారు. వైభవ్‌ను యూత్ ఎనర్జీకి నిలువెత్తు రూపంగా అభివర్ణిస్తూ, త్వరలోనే జార్ఖండ్ ఆరోగ్య శాఖ తరుఫున ప్రచారకర్తగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఇక క్రికెట్ కిట్ విషయానికి వస్తే.. ప్రముఖ స్పోర్ట్స్ తయారీ సంస్థ సరీన్ స్పోర్ట్స్ (SS – Sareen Sports)తో వైభవ్‌కు ఎప్పటి నుంచో ఒప్పందం ఉంది. ఈ ఎస్ఎస్ బ్యాట్ స్పాన్సర్‌షిప్ ద్వారా వైభవ్‌కు ఏడాదికి దాదాపు రూ.50 లక్షల ఆదాయం లభిస్తోంది. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

TV9 Telugu02 Jun, 01:05 pm
పాండ్యా ఒక్కడే కాదు.. వచ్చే సీజన్ కు ముందే మరో ఇద్దరు కెప్టెన్లను కూడా సాగనంపనున్న యాజమాన్యాలు

IPL : ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన రెండో టైటిల్ గెలవడంతో ఎంతో గ్రాండ్‌గా ముగిసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో కొన్ని జట్లు అద్భుత ప్రదర్శనతో అలరిస్తే.. మరికొన్ని జట్లు మాత్రం అంచనాలను అందుకోలేక ఘోరంగా విఫలమయ్యాయి. ఐపీఎల్ లాంటి హై-కాంపిటీషన్ టోర్నీలో కెప్టెన్సీ అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫలితాలు అనుకూలంగా రానప్పుడు ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనకాడవు. ఈ క్రమంలోనే తాజా సీజన్‌లో తమ జట్లను సక్సెస్ వైపు నడిపించలేకపోయిన ముగ్గురు స్టార్ కెప్టెన్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే ఆయా ఫ్రాంచైజీలు వారిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, జట్టు నుంచి కూడా రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కు భారంగా మారిన హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ లాంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ను పక్కనపెట్టి.. ముంబై ఇండియన్స్ (MI) జట్టు హార్దిక్ పాండ్యాకు భవిష్యత్తు లీడర్‌గా భావించి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ ఆయన నాయకత్వంలో ముంబై జట్టు పూర్తిగా చతికిలపడింది. మొదటి సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై.. ఆ తర్వాతి సీజన్‌లో క్వాలిఫైయర్-2 వరకు వెళ్లినా.. ఐపీఎల్ 2026 లో మళ్లీ పాత కథనే రిపీట్ చేసింది. ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి టేబుల్‌లో 9వ స్థానంతో ఘోరంగా ముగింపు పలికింది. గత మూడు సీజన్లుగా బలమైన కోర్ టీమ్ ఉన్నప్పటికీ ముంబై ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. కెప్టెన్‌గా విఫలమవడమే కాకుండా ఆల్‌రౌండర్‌గా కూడా హార్దిక్ పాండ్యా జట్టుకు ఎలాంటి న్యాయం చేయలేకపోయారు. ఈ సీజన్‌లో ఆయన ఆడిన 10 మ్యాచుల్లో కేవలం 206 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టారు. దీనికి తోడు నడుము నొప్పి కారణంగా పలు కీలక మ్యాచ్‌లకు దూరం కావడంతో జట్టు బ్యాలెన్స్ దెబ్బతింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సక్సెస్ కోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదు కాబట్టి.. ఐపీఎల్ 2027 కి ముందే హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని యాజమాన్యం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచేసిన అక్షర్ పటేల్ ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు ఎన్నో ఆశలతో అక్షర్ పటేల్‎కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. కానీ, ఆయన నాయకత్వంలో ఢిల్లీ జట్టు వరుసగా రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. దీనితో అక్షర్ కెప్టెన్సీ వ్యూహాలతో పాటు జట్టుకు ఆయన అందిస్తున్న కాంట్రిబ్యూషన్ పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైదానంలో కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడనే టాక్ క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 112.50 స్ట్రైక్ రేట్‌తో కేవలం 100 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒకే మ్యాచ్‌లో చేసిన 56 పరుగులు తీసేస్తే.. మిగిలిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి ఆయన చేసింది కేవలం 44 పరుగులు మాత్రమే. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ ఈ స్థాయి ప్రదర్శన జట్టుకు మైనస్‌గా మారింది. ఇక బౌలింగ్‌లోనూ 12 మ్యాచుల్లో 36 ఓవర్లు వేసి 10 వికెట్లు మాత్రమే తీశారు. ఈ సీజన్‌లో ఢిల్లీ 7 విజయాలతో 5వ స్థానంలో నిలిచినప్పటికీ, పీటీఐ నివేదికల ప్రకారం ఢిల్లీ యాజమాన్యం తమ మొదటి టైటిల్ కోసం సరికొత్త లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ స్ట్రక్చర్‌తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారమైన అజింక్య రహానే శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసుకున్న తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు కెప్టెన్సీ అప్పగించింది. రహానే అనుభవం జట్టుకు స్థిరత్వాన్ని ఇస్తుందని భావించినప్పటికీ ఫలితం దక్కలేదు. 2024 లో టైటిల్ గెలిచిన కేకేఆర్.. ఆ తర్వాతి సీజన్‌లో 8వ స్థానంలో, ఇక ఈ ఐపీఎల్ 2026 లో 14 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోవడం వారి వైఫల్యానికి అద్దం పట్టింది. టి20 ఫార్మాట్‌లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో రహానే విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఆధునిక టీ20 క్రికెట్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుంటే.. రహానే మాత్రం కేవలం 135.08 స్ట్రైక్ రేట్‌తోనే పరుగులు చేశారు. ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 25.76 సగటుతో 335 పరుగులు చేసి రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ, అవి జట్టు విజయాలకు సరిపోలేదు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రహానే రికార్డులు కూడా చాలా పేలవంగా ఉన్నాయి. ఆయన కెప్టెన్సీ వహించిన 27 మ్యాచ్‌లలో కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, 14 మ్యాచ్‌లలో ఓడిపోయారు. ఆయన విన్నింగ్ పర్సంటేజ్ కేవలం 37.03 మాత్రమే ఉండటంతో.. కేకేఆర్

Sakshi02 Jun, 12:53 pm
మాట త ప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త య జ మాని

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడిగా అభివర్ణించాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్‌ గోయెంకానే అంటూ ఘాటుగా పేర్కొన్నాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్‌కాస్ట్‌ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘అతడికి (గోయెంకా) ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే హక్కు కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తి. తన విద్యుత్ వ్యాపారానికి పరిమితమవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్‌లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు. లక్నో జట్టు కూడా ప్రతీ సీజన్‌లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా లక్నో ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్‌కు దొరికిపోయారు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ అయిపోయారు.’ అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గోయెంకాపై వచ్చిన మీమ్స్‌లో అత్యధిక మంది చూసిన మీమ్‌కు కృతజ్ఞతగా రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానని లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారిపోయింది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సీజన్‌లో లక్నో ఆట ముగిసిన తర్వాత ఆ జట్టు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంపై స్పందించిన లలిత్ మోదీ.. ‘పంత్‌కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఒక పెద్ద మనిషి (సంజీవ్ గోయెంకా) తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు’ అంటూ విమర్శలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చదవండి: సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది! చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు) విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది భారత్ ను కమ్మేసిన 2500 కిలోమీటర్ల రాకాసి మేఘాలు నాకు ఏపీలోనే దిక్కు లేదు.. తెలంగాణ లో సీఎం నా ?

Zee Telugu02 Jun, 11:31 am
ఐపీఎల్ 2026 సీజన్ హైలెట్స్.. ఈ 7 వీడియోలు తప్పక చూడండి

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IPL 2026 Top Viral Moments: ఐపీఎల్ 2026 సీజన్ అద్భుతంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 75 పరుగుల నాటౌట్‌గా నిలిచి ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు. కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా, వైభవ్ సూర్యవంశి 'ప్లేయర్ ఆఫ్ ది సీజన్'గా ఎంపికయ్యారు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో ఆద్యాంతం అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఏడు విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే రీతిలో హిట్ వికెట్ అవ్వడం అభిమానులకు చాలా కాలం గుర్తిండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. క్రికెట్ చరిత్రలో కూడా ఇలా ఎన్నడూ జరగలేదు. ఐపీఎల్‌లో మొత్తం మూడుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. క్వాలిఫయర్ 1లో ఆర్‌సీబీపై, క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి వికెట్లను తాకింది. దీంతో బ్యాట్‌కు చేయికి పట్టి కట్టించి ఆడించాలంటూ రకరకాల మీమ్స్‌ వైరల్ అయ్యాయి. — Sanjeev । సంజీవ్ 🇮🇳 (@sanjusayz) May 30, 2026 విరాట్ కోహ్లీ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఎప్పుడు దూకుడుగా ఉంటాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్‌తో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీతో ట్రావిస్ హెడ్ కరచాలనం చేయసేందుకు ప్రయత్నించినా.. కోహ్లీ అతను నిరాకరించాడు. ట్రావిస్ హెడ్ భార్యపై కూడా కోహ్లీ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేశారు. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ సమయంలో అంపైర్‌తో విరాట్ కోహ్లీ సరదా పని అందరిని నవ్వించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం మైదానంలోకి రాగానే కోహ్లీ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు.. అంపైర్ చేతికి తన టోపీని ఇచ్చాడు. మొదటి ఓవర్ నిజంగా కోహ్లీ వేస్తాడా అని అంపైర్ ఆశ్చర్యపోగా.. నిజానికి అంపైర్‌ను సరదాగా ఆటపట్టించాడు. కోహ్లీ, అంపైర్ మధ్య జరిగిన ఈ వీడియో వైరల్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు సృష్టించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 28 బంతుల్లో 97 పరుగులతో ఉన్న సమయంలో భారీ షాట్ ఆడేందుకు యత్నించి వికెట్ కోల్పోయాడు. ఆ బంతి బౌండరీకి వెళ్లిపోయి ఉంటే 29 బంతుల్లో సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవాడు. వైభవ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినా.. తీవ్రంగా నిరాశ చెందాడు. సీజన్‌కు ముందు గేల్ 30 బంతుల రికార్డును బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన వైభవ్.. రికార్డుకు చేరువగా వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ తరువాత కృనాల్ పాండ్యా కాలర్‌ను నికోలస్ పూరన్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ ఏం జరగలేదు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో అలా సరదగా పూరన్ కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి లక్నో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలక్ట్రిక్ సిగరేట్ తాగడం ఈ సీజన్‌లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందించి.. పరాగ్‌పై చర్యలు తీసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఆటతీరును కనబర్చింది. నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్.. ఎలిమినేటర్‌ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. క్వాలిఫైయర్-2 గుజరాత్‌పై వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా.. రాజస్థాన్ ఓటమిపాలు కావడం అభిమానులను బాధించింది. ఐపీఎల్ 2026లో మనీష్ పాండే పట్టిన క్యాచ్‌కు బెస్ట్ అవార్డు లభించింది. అయితే ఈ రేసులో బార్ట్‌లెట్ పట్టిన క్యాచ్ కూడా పోటీలో నిలిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను దాటుతున్న బంతిని పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాలిలోనే పట్టుకుని.. దాన్ని లోపలికి విసిరాడు. వెంటనే బార్ట్‌లెట్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను అక్కడే డగౌట్‌లో చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చూసి షాక్ అయ్యారు.

10TV Telugu02 Jun, 09:34 am
కోట్ల ప్రైజ్ మ నీని ఆర్ సీబీ ఆట గాళ్లు ఎలా పంచుకుంటారు? భువ నేశ్వ ర్ కుమార్

RCB : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజేత‌గా నిలిచింది. విజేత‌గా నిలిచినందుకు ప్రైజ్‌మ‌నీ కింద ఆర్‌సీబీకి 20 కోట్ల మొత్తం ల‌భించింది. ఈ మొత్తాన్ని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటారు అన్న విష‌యం పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంది. ఇక ఇదే విష‌యాన్ని మిస్ట‌ర్ నాగ్స్ ఆర్‌సీబీ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను అడిగాడు. 17 ఏళ్ల సీజ‌న్ల పాటు క‌ప్పు కోసం నిరీక్షించిన ఆర్‌సీబీ ఎట్ట‌కేల‌కు 18వ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచింది. అదే ఉత్సాహంలో 19వ సీజ‌న్‌లోనూ క‌ప్పును ముద్దాడింది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబైఇండియ‌న్స్ తరువాత వ‌రుస‌గా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జ‌ట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. RCB bench players : ఛాంపియ‌న్ జ‌ట్టులో భాగ‌మై.. ఒక్క మ్యాచ్ ఆడ‌ని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు.. వేలంలో కోట్ల వ‌ర్షం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించిన త‌రువాత మైదానంలో ఆర్‌సీబీ ఆట‌గాళ్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ స‌మ‌యంలోనే ఆర్‌సీబీ డిజిట‌ల్ హోస్ట్ మిస్ట‌ర్ నాగ్స్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప‌లువురు ఆట‌గాళ్లను ఇంట‌ర్వ్యూలు చేశాడు. Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. ఇక భువ‌నేశ్వ‌ర్ కుమార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం 20 కోట్ల ప్రైజ్‌మ‌నీని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటార‌ని మిస్ట‌ర్ నాగ్స్ అడిగాడు. ఇందుకు భువీ ఎంతో తెలివిగా స‌మాధానం ఇచ్చాడు. న‌గదును ఎలా పంచుకుంటారు అనే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, దాని గురించి తెలుసుకోవ‌డానికి త‌న‌కు ఎంతో ఆస‌క్తిగా ఉంద‌ని స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎలాంటి వివాదాంలో ఇరుక్కోకుండా భువీ చాలా చ‌క్క‌గా చెప్పాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

10TV Telugu02 Jun, 08:59 am
ఛాంపియ న్ జ ట్టులో భాగ మై.. ఒక్క మ్యాచ్ ఆడ ని ఆర్ సీబీ ఆట గాళ్లు..

RCB bench players : ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి వ‌రుస‌గా రెండో సారి ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్, ర‌జ‌త్ పాటిదార్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్ వంటి ఆట‌గాళ్లు జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. మెగా వేలంలో ఆర్‌సీబీ మొత్తం 24 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. వీరిలో 15 మంది క‌నీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. మిగిలిన 9 మంది ఆట‌గాళ్ల‌కు ఈ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు. అయిన‌ప్ప‌టికి కూడా వీళ్ల‌కు పూర్తి సీజ‌న్ ఫీజు అంటే మెగా వేలంలో ఎవ‌రిని ఎంత మొత్తానికి కొనుగోలు చేశారో అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్‌ను ఆర్‌సీబీ 5 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. అయితే.. ఈ సీజ‌న్‌కు ముందు అత‌డు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌ప్పుకున్నాడు. అయిన‌ప్ప‌టికి కూడా ఆర్‌సీబీ అత‌డిని విడుద‌ల చేయ‌లేదు. మ‌రో ఆట‌గాడిని తీసుకులేదు. దీంతో అత‌డు ఆర్‌సీబీలో భాగంగానే ఉన్న‌ట్లు. *IPLలో 5 టీమ్స్ లో ఆడిన ప్లేయర్.. టీమిండియాకు ప్రాతినిధ్యం.. ఇప్పుడు ఏకంగా మంత్రి.. మంగేష్ యాద‌వ్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ మంగేష్ యాద‌వ్ ను ఆర్‌సీబీ వేలంలో 5.20 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. భువ‌నేశ్వ‌ర్ కుమార్, రసిఖ్ సలాం దార్ వంటి పేస‌ర్లు అద్భుతంగా రాణిస్తుండ‌డం, కూర్పులో భాగంగా మంగేష్ యాద‌వ్ కు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం రాలేదు. నువాన్ తుషారా.. శ్రీలంక పేస‌ర్ నువాన్ తుషారాను ఆర్‌సీబీ 1.60 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. ఫిట్‌నెస్ స‌మ్య‌స‌లు, జ‌ట్టు కూర్పు కార‌ణంగా అత‌డు తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ప్లేఆఫ్స్‌కు ముందు అత‌డి స్థానంలో ఇంగ్లాండ్ పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌ను ఆర్‌సీబీ తీసుకుంది. జోర్డాన్ కాక్స్‌.. ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అయిన జోర్డాన్ కాక్స్‌ను ఆర్‌సీబీ వేలంలో 75లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అత‌డు బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ఉన్నారు. టీమ్ఇండియా ఆట‌గాడు జితేశ్ శ‌ర్మ ప్ర‌తి మ్యాచ్ తుది జ‌ట్టులో ఉండ‌డంతో జోర్డాన్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవ‌కాశం రాలేదు. స్వ‌ప్నిల్ సింగ్‌.. స్పిన్న‌ర్ స్వ‌ప్నిల్ సింగ్‌ను ఆర్‌సీబీ 50ల‌క్ష‌ల‌కు అట్టిపెట్టుకుంది. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మలు ఉండ‌డంతో స్విప్నిల్‌కు తుది జ‌ట్టులో ఆడే ఛాన్స్ రాలేదు. విక్కీ ఓస్త్వాల్‌.. అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టిన భార‌త స్పిన్ ఆల్‌రౌండ‌ర్ విక్కీ ఓస్త్వాల్ ను 30 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. విరాట్ కోహ్లీ, ప‌డిక్క‌ల్‌, జితేశ్, వెంక‌టేశ్ అయ్య‌ర్ వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉండ‌డంతో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు. *Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. స‌త్విక్ దేశ్వాల్‌.. దేశవాళీలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన లెగ్ స్పిన్న‌ర్ స‌త్విక్ దేశ్వాల్‌ను 30 లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. కూర్పు కార‌ణంగా అత‌డికి తుది జ‌ట్టులో చోటు రాలేదు. విహాన్ మ‌ల్హోత్రా.. భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుకు చెందిన విహాన్ మ‌ల్హోత్రాను 30ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. అయితే.. ఆల్‌రౌండర్‌కు ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసే అవ‌కాశం రాలేదు. క‌విష్క్ చౌహాన్‌.. యువ ఆల్‌రౌండ‌ర్ క‌నిష్క్ చౌహాన్‌ను 30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. ఇత‌డికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు.

Andhra Jyothy02 Jun, 07:06 am
టీమిండియాలోకి వైభవ్ ఎంపికపై హడావిడి వద్దు

<p><strong><span style="color: rgb(255, 0, 0)">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. పలు అరుదైన రికార్డులు కొల్లగొట్టాడు. అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొందరపడి వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకురావద్దని తెలిపాడు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>‘సంజు శాంసన్, అభిషేక్ శర్మ తర్వాతి వరుసలో వైభవ్ సూర్యవంశీ ఉంటాడు. అయితే అతడిని నేరుగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి విదేశీ పర్యటనలకు పంపడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ముందుగా ఐపీఎల్ తరహా బ్యాటింగ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో వైభవ్‌ను పరీక్షించాలి. అయితే అతడికి ఐపీఎల్ ఫామ్‌ను విదేశాల్లోనూ కొనసాగించే సామర్థ్యం ఉంది. కానీ వైభవ్‌పై అతిగా అంచనాలు పెట్టుకుని విదేశీ పర్యటనలకు ఎంపిక చేయడం సరికాదు. వైభవ్ టీమిండియాలో ఎలా రాణిస్తాడు? ఒత్తిడిని తట్టుకుంటాడా? వంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు. కానీ అది మన పని కాదు. నిజానికి అది బీసీసీఐ పని కూడా కాదు. వైభవ్‌ ఒక వ్యక్తి.. అతడి చుట్టూ కోచ్‌లు, మార్గదర్శకులు ఉంటారు. జీవితంలో అతడు ఏం సాధించాలని అనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకోవాలి’ అని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #ff0000">అందులో తప్పేమీ లేదు..</span></strong></p><p>‘వైభవ్ కేవలం టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్‌గా మారాలనుకుంటే అలాగే ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ అప్పటి నుంచి అతడిని టీ20 ప్లేయర్‌గానే అంచనా వేస్తారు. వన్డే క్రికెట్‌లో వైభవ్ ఆడితే.. తొలి 10 ఓవర్లలో అతడు చేసే విధ్వంసానికి అవధులు ఉండవు. గేమ్‌ను వన్ సైడ్ మార్చేసే సత్తా అతడిలో ఉంది. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటే వైభవ్ కూడా జట్టులో తన స్థానం కోసం పోటీ పడాలి. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా వెంటనే అవకాశాలు ఇవ్వడం కొంతమంది అర్హులైన ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతుంది. బిహార్ క్రికెట్ అకాడమీ తరఫున ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి వైభవ్‌పై అనవసర ఒత్తిడి పెట్టకుండా.. అతడు ఏ దిశలో వెళ్లాలనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకునేలా వదిలేయాలి’ అని మంజ్రేకర్ సూచించాడు.</p><br/><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/bcci-drops-major-hint-on-vaibhav-sooryavanshi-india-selection-debut-may-not-be-far-srav-1528990.html"><strong>టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!</strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/venkatesh-iyer-reveals-what-makes-virat-kohli-special-after-rcb-ipl-2026-title-win-srav-1528980.html"><strong>జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy02 Jun, 04:43 am
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్.. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ గత కొద్దిరోజులుగా డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడి ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. త్వరలోనే వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>‘భారత క్రికెట్‌కు వైభవ్ కొత్త వండర్ కిడ్. భవిష్యత్తులో అతడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు. ఐపీఎల్ మ్యాచ్‌లను బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. చాలా సందర్భాల్లో వారు ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి ప్లేయర్ల ప్రతిభను గమనిస్తున్నారు. త్వరలో జరిగే భారత జట్టు ఎంపిక సమావేశాల్లో వైభవ్ ప్రదర్శనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు. అతడి భవిష్యత్తుకు ఏది మంచిదో దాని బట్టే బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది యువ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. కానీ వైభవ్ సూర్యవంశీ ప్రతిభ అసాధారణం. భారత క్రికెట్‌కు ఇలాంటి ప్లేయర్ దొరకడం సంతోషంగా ఉంది. వైభవ్ త్వరలోనే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడు’ అని దేవజిత్ సైకియా ప్రశంసించారు. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #ff0000">ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి</span></strong></p><p>ప్లేయర్ల వర్క్‌లోడ్‌పై కూడా దేవజిత్ స్పందించారు. ‘భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశమున్న ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను బీసీసీఐ సాంకేతిక బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐపీఎల్ రెండు నెలలపాటు ఫ్రాంచైజీల నియంత్రణలో జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని మేము నియంత్రించలేం. అయితే ఆటగాళ్లకు ముందుగానే ఫిట్‌నెస్ ప్రణాళికలు, మార్గదర్శకాలు అందజేస్తాం. దేశానికి ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లకు చేయాల్సినవి, చేయకూడనివి అన్నీ స్పష్టంగా తెలుసు. వారు వాటిని పాటిస్తున్నారనే నమ్మకం మాకు ఉంది’ అని సైకియా వివరించారు. కాగా వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు, సంకేతాలు చూస్తుంటే.. టీమిండియా అరంగేట్రం వైభవ్‌కు ఎంతో దూరంలో లేదనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జాతీయ జట్టులోకి తీసుకురావాలా? వద్దా? అన్న నిర్ణయం ప్రధాన ఎంపిక కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ చేతుల్లో ఉంది.</p><br/><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/lionel-messi-70-foot-statue-removed-in-kolkata-over-safety-concerns-srav-1528969.html"><strong>కోల్‌కతాలో మెస్సి విగ్రహం తొలగింపు.. ఎందుకంటే?</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/tim-david-suspended-for-one-match-after-ipl-2026-final-code-of-conduct-breach-srav-1528965.html"><strong>ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

AP7AM02 Jun, 02:55 am
నా అస లు టార్గెట్ వేరే... నా నుంచి మీరు త ర్వాత చూసేది ఆ క్రికెటే

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ 2లోనే వెనుదిరిగినప్పటికీ, ఆ జట్టులోని ఓ యువ సంచలనం మాత్రం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగుల రికార్డు స్కోరుతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇంతటి విజయం సాధించినా, తన అసలు లక్ష్యం భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమేనని ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో వైభవ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. "అవును, నా తర్వాతి టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉంది. దానికోసం నేను గ్రౌండ్‌లో కష్టపడాలి. నేను రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. త్వరలోనే అందరూ చూస్తారు" అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.తన దూకుడైన బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. "ప్రతి బంతిని బాదడమంటే నాకు ఇష్టమని అందరూ అనుకుంటారు. కానీ, ఇది టీ20 ఫార్మాట్. స్వేచ్ఛగా ఆడమని కోచ్‌లు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బంతిని నేను బాదగలనని నమ్మకం ఉన్నప్పుడే షాట్ ఆడతాను. అంతేగానీ, బలవంతంగా ప్రతి బంతినీ కొట్టాలని చూడను" అని తెలిపాడు.అంతేగాక‌ "టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్ అని మా