translateexpand_more

Mahesh Babu News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media02 Jun, 12:08 pm
హైదరాబాద్ లో వారణాసి మూవీ కోసం ఐమాక్స్ కడుతున్న మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి ఐమాక్స్ ఫార్మాట్ విశేషాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ సర్టిఫైడ్ డిజిటల్ కెమెరాలతో షూట్ చేయడం విశేషం. నిజమైన 1.43:1 ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోతో వస్తున్న మొదటి ఇండియన్ మరియు నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని సాధారణ సినిమా లాగా తీసి ఆ తర్వాత ఐమాక్స్ లోకి మార్చడం లేదు. భారీ వర్టికల్ స్కేల్, ఎపిక్ ప్రపంచాలు మరియు యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చూపించడానికి మొదటి నుండి ఐమాక్స్ కోసమే చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని సరికొత్త దృశ్య అనుభూతిని ఈ సినిమా ద్వారా పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోల వివరాలను పరిశీలిస్తే 1.43:1 రేషియో చాలా ప్రత్యేకమైనది. ఇది పెద్ద ఐమాక్స్ స్క్రీన్ల పూర్తి ఎత్తును కవర్ చేస్తూ 40 శాతం అదనపు వర్టికల్ ఇమేజ్‌ను ఇస్తుంది. ఇదిలా ఉండగా డిజిటల్ ఐమాక్స్ లో ఉండే 1.90:1 రేషియో వెడల్పుగా ఉండి 26 శాతం అదనపు ఇమేజ్‌ను మాత్రమే అందిస్తుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో మహేష్ బాబు భాగస్వామ్యంతో వస్తున్న సరికొత్త ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ఐమాక్స్ స్క్రీన్ గురించి ఒక అప్‌డేట్ వచ్చింది. ఈ కొత్త థియేటర్ కేవలం 1.90:1 ఫ్లాట్ డిజిటల్ ఐమాక్స్ ఫార్మాట్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా ఈ స్క్రీన్ పై పూర్తి స్థాయి 1.43:1 వర్టికల్ వెర్షన్ ప్రదర్శించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మహేష్ బాబు అభిమానులు వారణాసి ఐమాక్స్ ఫార్మాట్ ను ఐమాక్స్ స్క్రీన్ లో చూడవచ్చు. అయితే రాజమౌళి షూట్ చేసిన పూర్తి స్థాయి పొడవైన వెర్షన్‌ను మాత్రం ఇక్కడి ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేరు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికతపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Telugu Times02 Jun, 01:50 am
హైదరాబాద్ లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తెలుగు రాష్ట్రాలలో తొలి, ఏకైక ఐమాక్స్ స్క్రీన్ ను లాంచ్ చేయనున్న

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఏఎంబీ సినిమాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌ల భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ, దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమాను ప్రారంభించడం నుంచి, హైదరాబాద్‌లో తొలి HDR by Barco స్క్రీన్‌లలో ఒకదాన్ని అందించడం వరకు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఇప్పుడు ఆ లెగసీని కొనసాగిస్తూ, ఏషియన్ గ్రూప్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిలతో కలిసి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త మల్టీప్లెక్స్, తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుదర్శన్ 70 ఎంఎం వద్ద నిర్మితమవుతోంది. దశాబ్దాలుగా సినీ వేడుకలకు, ఎన్నో చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ విజయాలకు వేదికగా నిలిచిన ఈ ప్రదేశం, ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ విక్టరీ రూపంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. సినిమా వారసత్వాన్ని, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదికపై కలిపే ఈ మల్టీప్లెక్స్, హైదరాబాద్ ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ త్వరలోనే ప్రారంభం కానుండగా, ప్రీమియం మూవీ-గోయింగ్ అనుభూతికి ఇది హైదరాబాద్‌లో కొత్త గమ్యస్థానంగా మారనుంది.