translateexpand_more

Middle East Crisis News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 05:16 am
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చాయి. శాంతి చర్చలు కొనసాగుతున్న దశలో ఇరు దేశాలు తాజాగా పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది. దానికి ప్రతీకారంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది (US Iran Conflict).</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడం, ఇతర దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగానే తాము దాడులకు దిగినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్‌లోని గురుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిపింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, రెండు అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్టు పేర్కొంది. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు వెల్లడించింది (Iranian Radar Sites). </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>తమ సైనిక కేంద్రాలపై దాడుల కోసం అమెరికా ఉపయోగించిన ఎయిర్‌బేస్‌ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్‌జీసీ ప్రకటించింది (IRGC Attack). అమెరికా ఎయిర్‌బేస్‌పై ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫైటర్స్ దాడి చేశాయని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందో ఐఆర్‌జీసీ వెల్లడించలేదు. కాగా, ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను కువైట్ ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నట్టు కొన్ని గంటల క్రితం వార్తలు వచ్చాయి.</p><br/><h2 style="text-align: start"><span style="color: rgb(235, 20, 20)">ఇవి కూడా చదవండి..</span></h2><p style="text-align: start"></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/dk-shivakumar-says-rcb-fans-faced-injustice-over-ipl-2026-final-venue-sparks-debate-sgr-1528678.html"><span style="color: rgb(248, 13, 13)">ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..</span></a></p><p style="text-align: start"><br><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/business/gold-prices-in-india-today-latest-22k-24k-rates-on-june-1st-2026-sgr-1528670.html"><span style="color: rgb(242, 7,

Andhra Jyothy31 May, 01:51 am
దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి

<p>ఇరాన్‌పై అమలు చేస్తున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన ఓ కార్గో నౌకపై అమెరికా సైన్యం క్షిపణి దాడి చేసింది. గాంబియా జెండా కలిగిన ఆ కార్గో నౌక ఇరాన్ పోర్ట్ వైపు ప్రయాణిస్తుండగా, అమెరికా సైన్యం పలుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ నౌక సిబ్బంది స్పందించకపోవడంతో దాని ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని హెల్‌ఫైర్ క్షిపణిని ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది (US Aircraft Missile Strike).</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మే 29న గల్ఫ్ ఆఫ్ ఒమన్ సమీపంలో ఈ ఘటన జరిగిందని, నౌక సిబ్బందికి 20కి పైగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్పందన రాలేదని సెంట్రల్ కమాండ్ (US Central Command) పేర్కొంది. దీంతో అమెరికా యుద్ధవిమానం నౌక ఇంజిన్ రూమ్‌పై దాడి చేసి దానిని నిలిపివేసిందని వెల్లడించింది. ఈ దాడిలో ఆ నౌక ఇంజిన్ తీవ్రంగా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై అమెరికా సైన్యం ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>ఇరాన్‌-అమెరికా మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది (Iran Blockade). అయినప్పటికీ ఇరాన్‌పై అమెరికా నౌకా దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. ఈ దిగ్బంధనంలో భాగంగా ఇప్పటివరకు ఐదు వాణిజ్య నౌకలను నిలిపివేసి, 116 నౌకలను దారి మళ్లించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. </p><br/><p><strong><span style="color: rgb(13, 9, 225)">ఇవి కూడా చదవండి..</span></strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/abhishek-banerjee-faces-protest-and-attack-during-sonarpur-visit-in-west-bengal-pcs-1528178.html"><strong><span style="color: rgb(224, 16, 16)">టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి</span></strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/kharge-and-akhilesh-yadav-condemn-attack-on-tmc-mp-abhishek-banerjee-pcs-1528190.html"><strong><span style="color: rgb(224, 16, 16)">టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే</span></strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Oneindia Telugu01 Jun, 03:23 pm
అమెరికాతో చర్చలు పూర్తిగా బంద్

ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను ఇరాన్ నిలిపివేసింది. ఇది మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దౌత్య ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఇరాన్&amp;zwnj; కు చెందిన సెమీ-అధికారిక టాస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం.. లెబనాన్&amp;zwnj; లో ఇజ్రాయెల్ సైనిక దాడులు పునరుద్ధరించిన నేపథ్యంలో టెహ్రాన్ వాషింగ్టన్&amp;zwnj; తో మధ్యవర్తుల ద్వారా సందేశాల మార్పిడిని నిలిపివేసింది. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు, ముఖ్యంగా లెబనాన్, గాజాలో, పూర్తిగా నిలిచిపోయేవరకు చర్చలకు తిరిగి రాబోమని ఇరాన్ స్పష్టం చేసింది.ఇజ్రాయెల్ యొక్క కొనసాగుతున్న కార్యకలాపాలు కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, అలాగే విస్తృత ప్రాంతీయ చర్చలను క్లిష్ట తరం చేస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ లెబనాన్&amp;zwnj;పై ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ మధ్యవర్తుల మధ్య చర్చల్లో ఉన్న విస్తృత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు.వాషింగ్టన్&amp;zwnj;తో కుదిరే ఏదైనా దీర్ఘకాలిక ఒప్పందంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి హామీలు ఉండాలని టెహ్రాన్ పదేపదే వాదిస్తూ ఆ విషయాలను నొక్కి చెప్పింది. దక్షిణ లెబనాన్, బీరుట్ దక్షిణ శివార్లలోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ తన కార్యకలాపాలను తీవ్రతరం చేయడంతో ఈ తాజా దౌత్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఈ దాడులను ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా సమర్థించుకున్నారు. అయితే, లెబనాన్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీస్తోందని ఆరోపించాయి.చర్చల నిలిపివేతను లెబనాన్ సంఘర్షణకు ఇరాన్ అధికారులు నేరుగా ముడిపెట్టారు. లెబనాన్&amp;zwnj;లోని సైనిక కార్యకలాపాలు విస్తృత ప్రాంతీయ పరిష్కారానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని

SkyC Media30 May, 06:45 am
అమెరికా ఇరాన్ చర్చలు

అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మే 2026 నాటికి అమెరికా ఇరాన్ చర్చలు ఒక కీలకమైన తాత్కాలిక మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ దశకు చేరుకున్నాయి. ఇది పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కానప్పటికీ ప్రస్తుత యుద్ధాన్ని ఆపి తదుపరి చర్చలకు మార్గం సుగమం చేస్తుంది. రెండు దేశాల నెగోషియేటర్లు ఒక ముసాయిదాపై ప్రస్తుతం అంగీకారానికి వచ్చారు. ప్రస్తుత స్థితి ప్రకారం మే 30, 2026 వరకు ఈ ముసాయిదాపై అధికారికంగా సంతకం జరగలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి ఇంకా తన తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇరాన్ వైపు కూడా ఈ ఒప్పందం అధికారికంగా ఖరారు కాలేదు. ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని జెడి వాన్స్ చెప్పారు. అయితే అణు నిల్వలు, యురేనియం ఎన్రిచ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని భాషా పరమైన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ ముసాయిదా చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. డ్రాఫ్ట్ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత సీజ్‌ఫైర్‌ను మరో 60 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించారు. దీంతో హార్మూజ్ జలసంధిలో రాకపోకలను ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇరాన్ తన సముద్ర మైన్స్ తొలగించాల్సి ఉంటుంది. అమెరికా తన నావికా బ్లాకేడ్‌ను ఎత్తివేస్తుంది. ఇదిలా ఉండగా 60 రోజుల్లో అణు కార్యక్రమంపై ఇరాన్ అణ్వాయుధం తయారు చేయదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్‌పైల్ గురించి చర్చలు జరుపుతారు. ఫలితంగా కొన్ని సాంక్షన్స్ ఎత్తివేసి, సుమారు 20 నుండి 24 బిలియన్ డాలర్ల ఫ్రోజెన్ ఫండ్స్ విడుదల చేసే అవకాశం ఉంది. అమెరికా, గల్ఫ్

Andhra Jyothy28 May, 06:59 am
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులు

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. తాజాగా అమెరికా నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. తాజాగా అమెరికా నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు మళ్లీ మొదలయ్యాయి (Iran targets US base). ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న ఒక సైనిక నియంత్రణ కేంద్రంపై అమెరికా దాడి చేసింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు ముప్పుగా భావించిన నాలుగు ఇరానియన్ డ్రోన్లను కూడా కూల్చివేసింది. ఈ దాడులు పూర్తిగా ఆత్మరక్షణ చర్యలు అని అమెరికా స్పష్టం చేసింది (US Iran war). అమెరికా దాడులకు ప్రతీకారంగా ఆ దేశ ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది (IRGC retaliation). అయితే ఏ దేశంలోని స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. ఇకపై జరిగే ప్రతి దాడికి మరింత కఠిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. కాగా, తమ గగనతలంలోకి క్షిపణులు, డ్రోన్‌లు దూసుకొచ్చాయని, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని కువైట్ ప్రకటించింది. అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Andhra Jyothy24 May, 02:17 am
అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..

- Home » International » US Not Honest Iran Refuses To Compromise In Talks Tells Pakistans Asim Munir sgr ABN , Publish Date - May 24 , 2026 | 07:47 AM ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి... - ఈ శాంతి చర్చలపై ఇరాన్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేసింది. - పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో టెహ్రాన్‌లో ఇరాన్ ప్రధాన చర్చాకర్త మహ్మద్ ఘాలిబాఫ్ సమావేశమయ్యారు.

TV9 Telugu29 May, 02:57 pm
మార్కెట్లలో అనిశ్చితి.. వాటి వైపు పెట్టుబడిదారుల చూపు! పైగా 8.11 శాతం వడ్డీ ఆఫర్లు

మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గాల కోసం వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) మరోసారి ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మారాయి. హామీతో కూడిన రాబడి, మూలధన భద్రత, స్థిరమైన ఆదాయం వంటి ప్రయోజనాల కారణంగా అనేక మంది పెట్టుబడిదారులు FDల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సాధారణ బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్య కాలపరిమితి గల డిపాజిట్లపై జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.11 శాతం వరకు వడ్డీని అందిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు 8.10 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. అలాగే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.80 శాతం, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను ప్రకటించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో సీఎస్‌బీ బ్యాంక్ 7.35 శాతం, ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా 7.30 శాతం, బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్‌లు 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 6.75 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.65 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు 6.60 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే పెట్టుబడిదారులు కేవలం అధిక వడ్డీ