translateexpand_more

Sports News News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 02:55 am
నా అస లు టార్గెట్ వేరే... నా నుంచి మీరు త ర్వాత చూసేది ఆ క్రికెటే

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ 2లోనే వెనుదిరిగినప్పటికీ, ఆ జట్టులోని ఓ యువ సంచలనం మాత్రం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగుల రికార్డు స్కోరుతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇంతటి విజయం సాధించినా, తన అసలు లక్ష్యం భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమేనని ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో వైభవ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. "అవును, నా తర్వాతి టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉంది. దానికోసం నేను గ్రౌండ్‌లో కష్టపడాలి. నేను రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. త్వరలోనే అందరూ చూస్తారు" అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.తన దూకుడైన బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. "ప్రతి బంతిని బాదడమంటే నాకు ఇష్టమని అందరూ అనుకుంటారు. కానీ, ఇది టీ20 ఫార్మాట్. స్వేచ్ఛగా ఆడమని కోచ్‌లు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బంతిని నేను బాదగలనని నమ్మకం ఉన్నప్పుడే షాట్ ఆడతాను. అంతేగానీ, బలవంతంగా ప్రతి బంతినీ కొట్టాలని చూడను" అని తెలిపాడు.అంతేగాక‌ "టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్ అని మా

TV9 Telugu02 Jun, 02:05 am
తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్ చేస్తే పరువైనా మిగిలేనుగా

Indian Cricketers Retirement Rumors: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్, కేవలం వినోదానికి మాత్రమే వేదిక కాదు. ఆటగాళ్ల భవిష్యత్తును, వారి ఫామ్‌ను అంచనా వేసేందుకు బీసీసీఐ సెలెక్టర్లకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఇక్కడ అద్భుతంగా రాణిస్తే జాతీయ జట్టులో స్థానం ఖాయమవుతుంది, అదే తడబడితే కెరీర్‌కే ఎండ్ కార్డ్ పడుతుంది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ కొంతమంది దిగ్గజ భారత ఆటగాళ్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గాయాలు, పేలవమైన ఫామ్, వయసు భారంతో సతమతమవుతున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఐదుగురు ఆటగాళ్ల కెరీర్ పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. 4. అజింక్య రహానే (రెడ్-బాల్, వైట్-బాల్ క్రికెట్‌లో నిరాశ): సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా ఉన్న రహానే ఈ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ఆయన కేవలం 335 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు దేశీవాళీ క్రికెట్లోనూ గత 12 నెలలుగా ఎలాంటి అద్భుత ప్రదర్శన చేయలేదు. అంతర్జాతీయ జట్టులో ఇప్పటికే స్థానం కోల్పోయిన రహానే, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 3. యుజ్వేంద్ర చహల్ (తగ్గిన పాత పదును): భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు కూడా ఈ ఐపీఎల్ సీజన్ ఆశించిన స్థాయిలో సాగలేదు. పంజాబ్ జట్టు తరపున ఆడిన చహల్ 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టారు. అయితే పరుగులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన రికార్డు చహల్ పేరిట ఉన్నప్పటికీ, ఈసారి అతడి బౌలింగ్‌లో మునుపటి మ్యాజిక్ కనిపించలేదు. ప్రస్తుతం భారత జట్టులోకి వరుణ్ చక్రవర్తి లాంటి యువ స్పిన్నర్లు దూసుకురావడంతో, చహల్ మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యంగా మారింది. 2. మహమ్మద్ షమీ (ఫిట్‌నెస్ సమస్యలతో సతమతం): ఒకప్పుడు టీమిండియా నమ్మకమైన వికెట్ టేకర్ అయిన మహమ్మద్ షమీని సెలెక్టర్లు క్రమంగా పక్కన పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో అతనికి చోటు దక్కకపోవడమే దీనికి ఉదాహరణ. లక్నో జట్టు తరఫున కొత్త బంతితో ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభించినా, టోర్నమెంట్ ముగిసేసరికి ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న షమీ, సుదీర్ఘమైన స్పెల్స్ వేయడానికి శరీరం సహకరించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 1. రోహిత్ శర్మ (హిట్‌మ్యాన్ ప్రయాణం ముగింపునకు చేరిందా?): భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఐపీఎల్ సీజన్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముంబా ఇన్నింగ్స్ ఆరంభంలో కోల్‌కతాపై 38 బంతుల్లో 78 పరుగులు చేసి మెరిసినా, ఆ తర్వాత తగిలిన గాయం అతడి ఆటను పూర్తిగా దెబ్బతీసింది. గాయం నుంచి కోలుకున్నాక రోహిత్ పాత లయను అందుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్, చివరి దశలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే మైదానంలోకి రావడం అతడి ఫిట్‌నెస్‌పై ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. 9 మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రాబోయే వన్డే ప్రపంచ కప్ నాటికి శరీరం సహకరించడం కష్టమని భావిస్తే, యువ ఆటగాళ్ల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. సమయం ఎవరి కోసమూ ఆగదు, క్రీడా రంగంలో వయసు అనేది అత్యంత కీలకమైన అంశం. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన ఈ దిగ్గజాలు, యువ రక్తం జట్టులోకి దూసుకువస్తున్న తరుణంలో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడమే ఉత్తమమని భావిస్తున్నారు. అభిమానులకు ఇది బాధాకరమైన విషయమే అయినప్పటికీ, భారత క్రికెట్ సుదీర్ఘ భవిష్యత్తు కోసం ఈ మార్పులు అనివార్యం.