translateexpand_more

Sv Krishna Reddy News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 01:16 pm
చిరంజీవికి అదిరిపోయే కథ చెప్పా.. విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే

సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.వి. కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది తాను కూడా అలాంటి కథలను రూపొందించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే, తన తెలుగు చిత్రం ఆహ్వానం కథను డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో హాలీవుడ్ లో సినిమా చేశా అని వెల్లడించారు. ఆహ్వానంలోని వివాహ నేపథ్యాన్ని మార్చి, పుట్టబోయే బిడ్డ హక్కులు, తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత ఆవశ్యకత అనే కొత్త కోణంలో కథను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ ప్రయోగానికి తనకు మూడు సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం, డైరెక్టర్స్ అసోసియేషన్‌లో తన సభ్యత్వ అనుభవాలను పంచుకున్నారు. ఐదుగురు పర్మనెంట్ ఆర్టిస్టులు సిఫార్సు చేస్తే తప్ప సభ్యత్వం లభించదని, అయితే అప్పటికే 30కి పైగా చిత్రాలు తీసిన తన సామర్థ్యాన్ని గుర్తించి, తోటి సభ్యులు తన అప్లికేషన్‌ను ఆమోదింపజేసినట్లు తెలిపారు. సినీ నిర్మాణ ప్రక్రియలో అసోసియేషన్ పాటించే కఠినమైన నిబంధనలను ఆయన వివరించారు. షూటింగ్ జరిగే ప్రదేశం, ఐదు విభాగాల పనితీరు, ఏ డిపార్ట్‌మెంట్ పనిని మరొకరు చేయకూడదనే నియమాలు, అలాగే దర్శకుడు, నటులు, కెమెరామెన్ మధ్య సమన్వయం వంటి విషయాలను ఆయన స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్ట్ ఎందుకు కార్యరూపం దాల్చలేదో కూడా ఎస్.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. చిరంజీవి గారిపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, తమ ఇద్దరి ఆలోచనలలో తేడాలున్నాయని, తాను ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటానని ఆయన తెలిపారు. చిరంజీవి గారికి తాను చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉందని, అది అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌తో కూడినదని అన్నారు కృష్ణారెడ్డి. ఆ కథలో, చిరంజీవి కుటుంబంతో కలిసి టీవీలో

Telugu Times01 Jun, 11:10 am
పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

– 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు – ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా “వేదవ్యాస్” మేకింగ్ వీడియో లాంఛ్ సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా “వేదవ్యాస్” రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా…కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. “వేదవ్యాస్” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు గొప్ప దర్శకులు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన సకుటుంబంగా చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. ఆ సినిమాలన్నీ వినోదంతో పాటు సమాజానికి సందేశాన్ని కూడా చెప్పాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎస్వీ గారి సినిమాలను ఆస్వాదించారు.