
TGPSC announces three govt job notifications: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేళ టీజీపీఎస్సీ మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగులు మాత్రం టీజీపీఎస్సీ చెప్పిన మాటలు నిలబెట్టుకొవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పార్టీలకతీతంగా నేతలు తమపార్టీ ఆఫీసుల్లో, వివిధ ప్రాంతాల్లో జెండాలను ఎగుర వేశారు. మరోవైపు తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను కూడా స్మరించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మూడు నోటిఫికేషన్లను ప్రకటించింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49 ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలో 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని.. వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ ఇస్తామని వెంకటేశం కీలక ప్రకటన చేశారు. టీజీపీఎస్సీ చెప్పిన విధంగానే మూడు నోటిఫికేషన్లను విడుదల చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49, పోస్టులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. అంతే కాకుండా.. సివిల్ పోస్టులకు జూన్ 6 నుంచి 13 వరకు, ఎలక్ట్రిక్ పోస్టులకు జూన్ 8 నుంచి జులై 15 వరకు అప్లై చేసుకొవచ్చు. ఆ తర్వాత.. ఎన్విరాన్ మెంటల్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17 వరకు అప్లై చేసుకొవచ్చు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అర్హతలు, ఎగ్జామ్ విధానం, సిలబస్ ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. గత కొన్ని ఏళ్లుగా నిరుద్యోగ యువతీ, యువకులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో హస్టల్ లలో, రూమ్ లలో ఉంటూ, కొంత మంది పార్ట్ టైమ్ లో జాబ్ లు చేస్తు మరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో గతంలో పలు మార్లు నోటిఫికేషన్ ల కోసం అభ్యర్థులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో రోడ్డు మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీల మేరకు అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఒకేసారి మూడు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రతినెల ఇప్పటి నుంచి నోటిఫికేషన్ లు విడుదల చేసేలా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటుందని, ఈ ఎగ్జామ్ లు కూడా పూర్తిగా పారదర్శకంగా ఎలాంటి అక్రమాలు జరక్కుండా నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెల్చి చెప్పింది. ఎలాంటి ఫెక్ ప్రచారాలు, పుకార్లను నమ్మోద్దని టీజీపీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల్ని ఒక ప్రకటనలో కోరింది.