translateexpand_more

Tv9 Telugu Web Story In Telugu News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 02:36 pm
కొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలు

కొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలుకొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలు Venkatrao Lella Images: Pinterest 01 JUNE 2026 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనేది రూ.1 లక్ష కోట్ల పథకం. 1 ఆగస్టు 2025 నుండి 31 జూలై 2027 మధ్య 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడం దీని లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. ప్రారంభ తేదీ ఇది మొదటిసారి ఉద్యోగంలో చేరే వారిని కవర్ చేస్తుంది. పార్ట్ A రూ. 1 లక్ష వరకు సంపాదించే ఉద్యోగులను కవర్ చేస్తుంది. అయితే పార్ట్ B కనీసం ఆరు నెలల పాటు 2–5 అదనపు ఉద్యోగులను నియమించుకుని కొనసాగించే యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తుంది ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల మూల వేతనానికి సమానమైన రూ.15 వేల వరకు ఒకేసారి ప్రోత్సాహకం రెండు వాయిదాలలో చెల్లించబడుతుంది ఉద్యోగులకు ప్రయోజనాలు ఈ పథకం రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. తయారీ కంపెనీలకు దీనిని నాలుగేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది చెల్లుబాటు ఉద్యోగులు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా UMANG యాప్ ద్వారా తమ UAN నంబర్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చు. యజమానులు ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR)ను ఫైల్ చేయాలి మరియు ఇప్పటికే ఉన్న మరియు కొత్త ఉద్యోగులందరి కోసం UMANG యాప్ ద్వారా UANలను తెరవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈపీఎఫ్‌వోలో తొలిసారి నమోదు అయినవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. జీతం నెలకు రూ. లక్షలోపు మాత్రమే ఉండలి. ఇక ఉద్యోగం కల్పించినందుకు కంపెనీలకు కూడా ప్రోత్సాహకం అందిస్తుంది ఈపీఎఫ్‌లో తొలిసారి నమోదైతే.. ఇక ఉద్యోగి ఒకే కంపెనీలో కనీసం ఆరు

TV9 Telugu31 May, 03:33 pm
స్వీటీ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచుస్తున్న ఫ్యాన్స్

స్వీటీ సినిమా కోసం ఈగర్‌గా ఎదురుచుస్తున్న ఫ్యాన్స్.. స్వీటీ సినిమా కోసం ఈగర్‌గా ఎదురుచుస్తున్న ఫ్యాన్స్.. Rajeev 31 May 2026 instagram హీరోయిన్ అనుష్క శెట్టి. దక్షిణాదిలో టాప్ హీరోయిన్. నాగార్జున, సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమ ైంది. ఆ తర్వాత అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో జేజమ్మ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. మధ్యలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసింది. చాలా కాలం తర్వాత ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అనుష్క కథానార్ అనే సినిమా చేస్తుంది. కానీ ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వెబ్ స్టోరీస్‌ అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.? సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి

TV9 Telugu31 May, 04:38 pm
హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు

హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. Rajeev 31 May 2026 instagram భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్. మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా హెల్ప్ కాలేదు. అయితే తెలుగులో నెమ్మదిగా ఆఫర్స్ మాత్రం అందుకుంది. వరుసగా నాలుగైదు సినిమాలతో బిజీగా మారిపోయింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఎక్కడ తగ్గడంలేదు. చివరిగా రామ్ పోతినేని సరసన ఆంధ్రా కింగ్ తాలూకా, అలాగే దుల్కర్ సల్మాన పక్కన కాంత సినిమాలు చేసింది. కానీ అవి హిట్ అవ్వలేదు. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా పైనే ఈ ముద్దుగుమ్మ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కుర్రది.. తన క్రేజీ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుతున్నారు నెటిజ న్స్. మరిన్ని వెబ్ స్టోరీస్‌ అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.? సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి

TV9 Telugu31 May, 04:31 pm
ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్

ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ Rajeev 31 May 2026 instagram మలయాళీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది సంయుక్తమీనన్. తెలుగులోనూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి. కళ్యాణ్ రామ్ జోడిగా బింబిసార, ధనుష్ సరసన సార్, సాయి ధరమ్ తేజ్ జోడిగా విరూపాక్ష చిత్రాల్లో నటించింది. ఈ మూవీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన డేవిల్ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా ఈ అమ్మడికి క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే అఖండ 2, నారి నారి నడుమ మురారి సినిమాలతో రెండు హిట్స్ అందుకుంది. ఇలా వరుసగా హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మరిన్ని వెబ్ స్టోరీస్‌ అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.? సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి

TV9 Telugu31 May, 08:15 am
నీకు నేను చాలా కృతజ్ఞుడిని.. మై లేడీ.. నాగచైతన్య పోస్ట్ వైరల్

నీకు నేను చాలా కృతజ్ఞుడిని.. మై లేడీ.. నాగచైతన్య పోస్ట్ వైరల్.. నీకు నేను చాలా కృతజ్ఞుడిని.. మై లేడీ.. నాగచైతన్య పోస్ట్ వైరల్.. Rajitha Chanti Pic credit - Instagram 31 May 2026 టాలీవుడ్ లవ్లీ కపుల్స్ నాగచైతన్య, శోభితా జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు సంబంధించిన అప్‌డేట్స్ నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా చైతూ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది. తాజాగా శోభితా ధూళిపాళ్ల పుట్టినరోజును పురస్కరించుకుని, భర్త నాగచైతన్య ఆమెకు సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రేమపూర్వకంగా, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నాగచైతన్య తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శోభితతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను పంచుకున్నారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు శోభితా! నా జీవితంలోకి వచ్చినందుకు, నా ప్రపంచాన్ని ఇంత అందంగా మార్చినందుకు నీకు నేను ఎల్లప్పుడూ చాలా కృతజ్ఞుడిని" అంటూ రాసుకొచ్చారు. చైతూ పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్ అటు అక్కినేని అభిమానులను, ఇటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గతేడాది నిశ్చితార్థం, ఆ తర్వాత వివాహంతో ఈ జంట ఒక్కటైంది. పెళ్లయిన తర్వాత శోభిత పుట్టినరోజు రావడం, దానికి చైతూ ఇంత ఓపెన్‌గా తన ప్రేమను వ్యక్తపరుస్తూ విష్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నాగచైతన్య పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ శోభితకు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. "మేడ్ ఫర్ ఈచ్ అదర్", "క్యూట్ కపుల్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని వెబ్

TV9 Telugu30 May, 03:39 pm
పాత సామాగ్రి అమ్మకం ద్వారా భారతీయ రైల్వే సంపాదన ఎంతో తెలుసా

పాత సామాగ్రి అమ్మకం ద్వారా భారతీయ రైల్వే సంపాదన ఎంతో తెలుసా?పాత సామాగ్రి అమ్మకం ద్వారా భారతీయ రైల్వే సంపాదన ఎంతో తెలుసా? May 30, 2026 Subhash రైల్వే నిరుపయోగంగా ఉన్న వస్తువులు, పాత సామాగ్రి (Scrap) విక్రయించడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2025-26 లో రైల్వే శాఖ ఊహించని స్థాయిలో లాభాలను సాధించింది. భారీ మైలురాయి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు పాత స్క్రాప్ అమ్మకం ద్వారా ఏకంగా రూ.6,813.86 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రభుత్వం విధించుకున్న లక్ష్యం కంటే ఇది చాలా ఎక్కువ. సంపాదన ఈ ఆర్థిక సంవత్సరానికి రైల్వే రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ-వేలం (e-Auction) పద్ధతుల ద్వారా ఏకంగా రూ.813 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించింది. టార్గెట్ ఎంత? అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) లో కూడా రైల్వే శాఖ రూ. 5,400 కోట్ల టార్గెట్‌కు బదులుగా రూ.6,641.78 కోట్ల విలువైన స్క్రాప్‌ను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఏడాది రైల్వే డిపోలు, వర్క్‌షాప్‌లలో పేరుకుపోయిన పాత ట్రాక్స్‌, పనికిరాని వ్యాగన్లు, పాత కోచ్‌లు, వాడేసిన లోకోమోటివ్ ఇంజన్లు, ఇతర ఇనుప సామాగ్రిని ఈ వేలంలో విక్రయిస్తారు. స్క్రాప్‌లో ఏం అమ్ముతారు? స్క్రాప్ అమ్మకం ద్వారా రైల్వేకు అదనపు ఆదాయం రావడమే కాకుండా, డిపోలు, యార్డులలో వృథాగా ఉన్న స్థలం ఖాళీ అవుతుంది. దీనివల్ల స్టేషన్ల పరిసరాలు శుభ్రంగా మారి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్రయోజనాలు ఏంటి? ఇలాంటి అదనపు మార్గాల ద్వారా ఆదాయం పెరగడం వల్ల ప్రయాణికుల టికెట్ ధరలను పెంచాల్సిన అవసరం లేకుండానే రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతులు, డిజిటల్ లాంజ్‌లు, మెరుగైన భద్రతను రైల్వే

TV9 Telugu31 May, 06:09 am
భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటున్నారా

భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటున్నారా? భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటున్నారా? 31 May 2026 Jyothi Gadda పూర్వం నుండి భోజనం తిన్న తర్వాత స్వీట్ లేదా ఏదైనా తీపి పదార్థం తినడం ఒక ఆనవాయితీగా వస్తోంది. బెల్లంలో సుక్రోజ్ తక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైములను ఉత్తేజపరుస్తుంది. తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో ఐరన్, ఫోలేట్ గుణాలు శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మహిళల్లో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించడానికి భోజనం తర్వాత బెల్లం ముక్క తినడం ఒక చక్కని సహజ ఔషధం. ఇది కాలేయం, ఊపిరితిత్తులు, పొట్టలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపి, శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఇందులో ఉండే జింక్, సెలీనియం, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. చక్కెరలాగా బెల్లం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు. ఇందులోని పొటాషియం శరీరంలో మెటబాలిజం రేటును పెంచి, నీరు పేరుకుపోకుండా చూస్తుంది, ఇది బరువు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెల్లాన్ని పరిమితంగా

TV9 Telugu31 May, 10:41 am
కొబ్బరి బోండంలో ఉండే నీరు తియ్యగా ఎందుకు ఉంటుందో తెలుసా

కొబ్బరి బోండంలో ఉండే నీరు తియ్యగా ఎందుకు ఉంటుందో తెలుసా? కొబ్బరి బోండంలో ఉండే నీరు తియ్యగా ఎందుకు ఉంటుందో తెలుసా? Samatha 31 May 2026 కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది అంటారు. కొబ్బరి నీళ్లు సహజ శక్తిని అందించడమే కాకుండా , డీ హైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే సమ్మర్‌లో తప్పకుండా కొబ్బరి నీళ్ లు తాగాలి అంటారు. సహజ శక్తి అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కొబ్బరిలోకి నీరు ఎలా వస్తాయి? వచ్చినా అవి ఎందుకు అంత తియ్యగా ఉంటాయో? కొబ్బరిలోకి నీరు కాగా, ఇప్పుడు మనం అసలు కొబ్బరి బోండంలో ఉండే నీరు ఎందుకు అంత తెల్లగా, తియ్యగా ఉంటుందో తెలుసుకుందాం. ఎందుకంత తీపి? కొబ్బరి నీరు అనేది చెట్ల వేర్ల నుంచి వచ్చే నీటిలోని ఖనిజాలతో పాటు ఆకులు తయారు చేసే సహజ చక్కెరలు, ఎ ంజైమ్‌లు ఎక్కువగా కలుస్తాయంట. సహజ చక్కెరలు అందువలన కొబ్బరి నీళ్లు చాలా తియ్యటి రుచిని కలిగి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఇవి మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా ఎలాంటి హాని చేయదంట. తియ్యటి రుచి అంతే కాకుండా ఈ నీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం ఇవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి. అందుకే కొబ్బరి నీటిని సహజ ఎనర్జీ డ్రింక్‌గా పరిగ ణిస్తారు. ఎనర్జీ డ్రింక్ మరిన్ని వెబ్ స్టోరీస్‌ ఈ సింపుల్ అలవాట్లే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి! చీరలో ఎంత ముద్దుగుందో.. బంగారంతో బంగారంలా మెరిసిపోతున్న బ్యూటీ!

TV9 Telugu30 May, 04:31 am
ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్ లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్

ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్‌లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్!ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్‌లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్! Samatha 30 May 2026 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సమంత ఈ బ్యూటీ 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏమాయ చేశావే మూవీ ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. దీంతో తెలుగు, తమిళ్లో స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్ ఇక తర్వాత వరసగా దూకుడు, ఈగ , అత్తవారింటికి దారేది వంటి సినిమాల్లో నటించింది, స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. వరస సినిమాలు అయితే ఈ బ్యూటీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ పలు కారణాల వలన వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. లవ్ మ్యారేజ్ తర్వాత 2022లో ఈ బ్యూటీ మయోసైటీస్ వ్యాధితో బాధపడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మయోసైటీస్ ఈ ముద్దుగుమ్మ త్వరలో మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ప్రేక్షలకు ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత ఈ చిన్నది థియేటర్లో సందడి చేయన ుంది. మా ఇంటి బంగారం ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, రెడ్ కలర్ చీరలో తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. బ్యూటిఫుల్ ఫొటోస్

TV9 Telugu31 May, 10:11 am
స్ట్రాబెర్రీ తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే

స్ట్రాబెర్రీ తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!స్ట్రాబెర్రీ తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! Samatha 31 May 2026 స్ట్రాబెర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని చూడగానే నోరూరుతుంది. ఎరుపు రంగులో మంచి రుచిని ఇస్తుంటాయి. రుచి పరంగానే కాకుండా స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్ కలంగా ఉంటాయి. అందువలన ఇది అనేక సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ కాగా, స్ట్రాబెర్రీ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన అది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యం అలాగే ప్రతి రోజు ఒక కప్పు స్ట్రాబెర్రీలు తినడం వలన ఇందులో ఉండే విటమిన్ సి, ఇన్ ఫెక్షన్స్‌ను తగ్గించి, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రోగనిరోధక శక్తి అలాగే మధుమేహ వ్యాధిగ్రస్థులకు కూడా ఇది చాలా బెస్ట్. దీనిని తినడం వలన ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం చర్మనిగారింపుకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ప్రతి రోజూ వీటిని తినడం వలన ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన ికి సహజ మెరుపునిస్తుంది. చర్మం నిగారింపు స్ట్రాబెర్రీలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల హై బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. బీపీ ఉన్నవారికి కూడా ఇది చాలా బెస్ట్. బీపీ మరిన్ని వెబ్ స్టోరీస్‌ ఈ సింపుల్ అలవాట్లే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి! చీరలో ఎంత ముద్దుగుందో.. బంగారంతో బంగారంలా మెరిసిపోతున్న బ్యూటీ! పారిజాతం చెట్టు

TV9 Telugu25 May, 02:53 pm
స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన ఆరు నెలల్లో వీటి ధరలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచిన మొబైల్‌ తయారీ సంస్థలు....

స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన ఆరు నెలల్లో వీటి ధరలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచిన మొబైల్‌ తయారీ సంస్థలు. మరో దఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరుగడంతో స్మార్ట్‌ఫ...

TV9 Telugu23 May, 04:09 pm
26 కి.మీ మైలేజీతో రూ.8.80 లక్షలకే దేశంలోనే నం.1 CNG కార్‌

- భారతీయ మధ్యతరగతి కుటుంబాల మోస్ట్ ఫేవరెట్ 7-సీటర్ కారుగా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga CNG) దూసుకుపోతోంది. - ఆర్థిక సంవత్సరం FY2026 లో ఏకంగా 1.45 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన CNG కారుగా నిలిచింది. - మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డిజైర్, వ్యాగన్ఆర్, బ్రెజ్జా, నెక్సాన్ వంటి పాపులర్ CNG కార్లను సైతం వెనక్కి నెట్టి ఎర్టిగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

TV9 Telugu30 May, 04:11 pm
ఏం పిల్ల రా బాబూ.. నెట్టింట అందాల అరాచకం.. గత్తరలేపుతున్న హీరోయిన్

ఏం పిల్ల రా బాబూ.. నెట్టింట అందాల అరాచకం.. గత్తరలేపుతున్న హీరోయిన్ఏం పిల్ల రా బాబూ.. నెట్టింట అందాల అరాచకం.. గత్తరలేపుతున్న హీరోయిన్ Rajitha Chanti Pic credit - Instagram 30 May 2026 సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను అలరిస్తున్న యువ నటి రమ్య పసుపులేటి ఇప్పుడు టాలీవుడ్‌లో రాణిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రమ్య, ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడుకు ఫాలోయింగ్ ఎక్కువే. తన అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది, క్రమంగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. 'హుషారు' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'ఫస్ట్ ర్యాంక్ రాజు', 'మైల్స్ ఆఫ్ లవ్', 'కమిట్‌మెంట్', 'మారుతి నగర్ సుబ్రమణ్యం' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రమ్య పసుపులేటి కెరీర్ ఊపందుకుంది. ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర'లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుందని సమాచారం సోషల్ మీడియాలో ఎప్పుడూ తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న రమ్య, క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారనున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం పట్ల అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. అద్భుతమైన గ్లామర్, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ నటి, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరిన్ని వెబ్ స్టోరీస్‌ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్..