translateexpand_more

Andhra Pradesh Political News News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 05:24 am
వైసీపీ బాస్ వాటా ఎంత? రూ. 1500 కోట్ల స్కామ్ బట్టబయలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  స్థానిక నేతలు తీవ్ర కుట్రలకు తెరలేపారని పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఆదివారం సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అవినీతి, భూకబ్జాల చిట్టాను వారు మీడియా ముందుంచారు.రాష్ట్రంలో అలజడుల వెనుక వైసీపీ హస్తంవినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కావాలనే ఈ విధ్వంసానికి ఒడిగట్టి, రాష్ట్రంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా అని దుయ్యబట్టారు. వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోర్టు పరిధిలో ఉన్న భూములను కొల్లగొట్టేందుకు దొంగ (ఫోర్జరీ) జీవోలను సృష్టించి, సుమారు రూ. 1500 కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.ఈ భారీ కుంభకోణం బండారం బయటపడటంతోనే ఆయన భయంతో పరారయ్యారని పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని రెండెకరాల భూమిని కూడా వైసీపీ నేతలు అక్రమంగా ఆక్రమించారని, ఈ దోపిడీ సొమ్ములో జగన్ మోహన్ రెడ్డి వాటా ఎంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తక్షణమే బహిష్కరిస్తారని, కానీ

Andhra Jyothy01 Jun, 12:59 am
బొల్లా నకిలీలలు

<ul><li><p><strong>నకిలీ పత్రాల సృష్టికి రూ.8 కోట్లు.. సూత్రధారి రాధాకృష్ణకు ఇచ్చిన బొల్లా</strong></p></li><li><p><strong>వెయ్యి కోట్ల భూ స్కాంలో వెలుగులోకి మరిన్ని నిజాలు</strong></p></li><li><p><strong>వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా కోసం</strong></p></li><li><p><strong>నాలుగు పోలీసు బృందాల గాలింపు</strong></p></li><li><p><strong>రాధాకృష్ణపై పలు స్టేషన్లలో 9 క్రిమినల్‌ కేసులు</strong></p></li><li><p><strong>ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన వైనం</strong></p></li><li><p><strong>హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సంతకం సైతం ఫోర్జరీ</strong></p></li><li><p><strong>విదేశాలకు పారిపోవడానికి వీలుగా రెండో పాస్‌పోర్టు</strong></p></li><li><p><strong>కేసు వివరాలు వెల్లడించిన శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్‌</strong></p></li></ul><p><strong>హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): </strong>వెయ్యి కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. అందుకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించడం కోసం లాయర్‌ రాధాకృష్ణకు రూ.8 కోట్లు ముట్టజెప్పినట్టు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కుంభకోణంలో బొల్లా ప్రమేయంపై పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని.. దీని గురించి బయటపడగానే ఆయన ఫోన్లు స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు. పరారీలో ఉన్న ఆయన కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. ఆదివారం ఆయన సైబరాబాద్‌ కమిషనరేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. తాము ఏ భూమికి సంబంధించి కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా.. బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని.. నకిలీ జీవోల సంగతి ఆయనకు తెలుసని డీసీపీ స్పష్టం చేశారు. నకిలీ పత్రాల తయారీ నిమిత్తం రాధాకృష్ణ బృందానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని.. అగ్రిమెంట్‌ చేసుకునేందుకు నిమ్మల కుటుంబానికి కూడా బ్రహ్మనాయుడు, రమేశ్‌ల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయిందని తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిమ్మల కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం.. కుంభకోణంలో బ్రహ్మనాయుడు ప్రమేయం

Andhra Jyothy01 Jun, 12:24 pm
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వైసీపీ దుష్ట రాజకీయాలు

<p><strong>నంద్యాల, జూన్01: </strong>స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఉచ్చులో పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూటమిలోని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా సంజామల మండలం ముదిగేడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహంపై దాడి చేసింది.. వైసీపీ కార్యకర్త జంబులయ్య అని వివరించారు. తాము వైసీపీ మద్దతుదారులమంటూ జంబులయ్య భార్య బాలమ్మ వీడియో రిలీజ్ చేసిందని తెలిపారు. తమకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ శేషయ్య ఉద్యోగం ఇప్పించారని కూడా ఆమె చెప్పిందని పేర్కొన్నారు. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>వాస్తవాలు ఇలా ఉంటే ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీని ఇరికించే ప్రయత్నం వైసీపీ చేసిందని ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గొడ్డలి పార్టీ నాయకుడు, నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.</p><br/><p><strong><span style="color: rgb(244, 1, 1)">ఈ వార్తలు కూడా చదవండి.. '</span></strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/guntur/ap-mega-dsc-2025-sports-quota-fake-claims-denied-ajay-jain-vvnp-1528758.html#google_vignette"><strong>మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం</strong></a><br><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/devotional/ttd-hair-donation-record-2026-over-12-lakh-devotees-offer-hair-at-tirumala-in-may-vvnp-1528753.html"><strong>తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు</strong></a></p><p

NTV Telugu28 May, 06:59 am
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన

Left Parties Protest: వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్‌, సీఎన్‌జీ ధరలు.. సామాన్యులకు భారంగా మారుతున్నాయి.. క్రమంగా అన్ని వస్తువులపై వీటి ప్రభావం పడుతోంది.. అయితే, విజయవాడలో వామపక్ష పార్టీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. సామాన్య ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. లెఫ్ట్‌ పార్టీల ప్రెస్‌ మీట్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నుల వల్లే ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయని విమర్శించారు. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వామపక్ష నేతలు వెల్లడించారు. అనంతరం జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా పాసర్లపూడిలోని కేజీ బేసిన్ ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు సీఎం చంద్రబాబు నాయుడు రోజూ పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల పేరుతో ప్రకటనలు చేస్తూ హడావిడి చేస్తున్నారని, కానీ ధరల పెరుగుదల వల్ల ఎంత మంది ఉపాధి కోల్పోయారో లెక్కలు చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు పొదుపు చర్యల పేరుతో ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “పొదుపు చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబులే పాటించడం లేదు” అని వ్యాఖ్యానించారు. లోకేష్ హామీలపై ప్రశ్నలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే పెట్రోల్,

Andhra Jyothy24 May, 06:05 am
మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

- Home » Andhra Pradesh » Nellore » AP Minister Narayana Slams YS Jagan Mohan Reddy Over Alleged False Propaganda VK ABN , Publish Date - May 24 , 2026 | 11:35 AM వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ త... - తమ ప్రభుత్వంపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. - వైసీపీ హయాంలో ఏ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు.

Andhra Jyothy26 May, 08:17 am
బాంబులు లేకుండా మీరు ఏనాడైనా బయటకు వచ్చారా?: రామగోపాల్‌రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. కడప, మే 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి (Bhumireddy Rangopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. అధికారం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్‌ కుటుంబానిదని ఆరోపించారు. అధికారం కోసం హత్యలు.. ఆధిపత్యం కోసం కుట్రలు చేశారని ఆగ్రహించారు. గనుల కోసం ఎంతోమందిని చంపేశారని ఆక్షేపించారు. ఈరోజు (మంగళవారం) కడప టీడీపీ కార్యాలయంలో మీడియాతో రాంగోపాల్‌రెడ్డి మాట్లాడారు. బలవంతంగా మైన్స్‌ను స్వాధీనం చేసుకున్నారని రామగోపాల్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్‌ కుటుంబం నెత్తుటి కూడు తింటోందని రామగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్నారు. వైఎస్‌ కుటుంబం ఎన్నో అరాచకాలు చేసింది. ఎదురు తిరిగిన ఎవరినీ వైఎస్‌ కుటుంబం వదిలిపెట్టలేదు. హత్యలు చేసి.. స్వాతంత్య్ర సమరయోధులమని చెప్పుకుంటారా?. రాజారెడ్డి బ్రిటిష్ సైన్యం కోసం పనిచేయడం వాస్తవం కాదా..?. అప్పటి మద్రాస్‌లో బాంబు ఘటన తర్వాత రాజారెడ్డి పారిపోయి రాలేదా?. బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసి దేశ భక్తులమని చెప్పుకుంటారా?. నరసయ్య హత్య విషయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని మావోయిస్టులు చంపాలని చూడలేదా?. సచివాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాల్పులు జరపలేదా?. దేశ ద్రోహులుగా మీరు పనిచేసింది వాస్తవం కాదా?. అమాయకులను చంపి.. రక్తపుటేరులు పారించింది నిజం కాదా?. బాంబులు లేకుండా మీరు ఏనాడైనా బయటకు వచ్చారా?. మా ఇళ్లను కూల్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా?. మా ఆస్తులను కొల్లగొట్టి.. కేసులు పెట్టి హింసించలేదా?. లాకప్‌లో మమ్మల్ని

Oneindia Telugu31 May, 12:12 pm
జగన్ పై లోకేష్ ఫైర్, షర్మిల అల్టిమేటం

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కేంద్రంలో ఊహించని ఘటన రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీనివాస సెంటర్&amp;zwnj;లో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపింది. జంబులయ్య అనే వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి, దాని తలభాగాన్ని వేరు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్అయింది.నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం తలభాగం వేరు చేసిన వ్యక్తి.. వైసీపీ ఆందోళన ఎవరు అలా చెయ్యవద్దని చెప్పినా వినకుండా జంబులయ్య అనే వ్యక్తి వైఎస్సార్ విగ్రహ తల భాగాన్ని వేరు చేయటం నంద్యాలలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఈ దారుణానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా జంబులయ్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ పని చేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అతని మానసిక స్థితి బాలేదని కూడా చెప్తున్నారు. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ నాయకుల అనుచరుడి పనే అన్న మంత్రి లోకేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీ నాయకుల అనుచరుడేనని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ తన పార్టీ కార్యకర్తలతో ఇలాంటి నాటకాలు ఆడిస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు జంబులయ్యను