translateexpand_more

Bc Janardhan Reddy News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 12:24 pm
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వైసీపీ దుష్ట రాజకీయాలు

<p><strong>నంద్యాల, జూన్01: </strong>స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఉచ్చులో పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూటమిలోని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా సంజామల మండలం ముదిగేడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహంపై దాడి చేసింది.. వైసీపీ కార్యకర్త జంబులయ్య అని వివరించారు. తాము వైసీపీ మద్దతుదారులమంటూ జంబులయ్య భార్య బాలమ్మ వీడియో రిలీజ్ చేసిందని తెలిపారు. తమకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ శేషయ్య ఉద్యోగం ఇప్పించారని కూడా ఆమె చెప్పిందని పేర్కొన్నారు. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>వాస్తవాలు ఇలా ఉంటే ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీని ఇరికించే ప్రయత్నం వైసీపీ చేసిందని ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గొడ్డలి పార్టీ నాయకుడు, నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.</p><br/><p><strong><span style="color: rgb(244, 1, 1)">ఈ వార్తలు కూడా చదవండి.. '</span></strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/guntur/ap-mega-dsc-2025-sports-quota-fake-claims-denied-ajay-jain-vvnp-1528758.html#google_vignette"><strong>మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం</strong></a><br><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/devotional/ttd-hair-donation-record-2026-over-12-lakh-devotees-offer-hair-at-tirumala-in-may-vvnp-1528753.html"><strong>తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు</strong></a></p><p

Andhra Jyothy25 May, 09:25 am
Home » Andhra Pradesh » Kurnool » bc janardhan reddy banaganapalle development works bypass shadi khana suchi ABN...

Home » Andhra Pradesh » Kurnool » bc janardhan reddy banaganapalle development works bypass shadi khana suchi ABN , Publish Date - May 25 , 2026 | 02:55 PM నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగా...

AP7AM01 Jun, 01:25 pm
వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి, శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, కూటమి కార్యకర్తలు వైసీపీ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా ముదిగేడులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహంపై దాడి చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్యేనని మంత్రి స్పష్టం చేశారు. తాము వైసీపీ మద్దతుదారులమంటూ అతని భార్య వీడియో విడుదల చేసిందని, స్థానిక వైసీపీ కార్పొరేటర్ శేషయ్యే తమకు ఉద్యోగం ఇప్పించారని ఆమె స్వయంగా అంగీకరించిందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీని ఇరికించేందుకు వైసీపీ ప్రయత్నించిందని ఆయన మండిపడ్డారు. 1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచే ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారని ఆయన గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయిన ఆ గొడ్డలి పార్టీ నాయకులకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎండగట్టారు.