translateexpand_more

Asad Encounter News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 10:05 am
యూపీలో ఎన్ కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

<p>ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో కలకలం రేపిన టీనేజర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ శనివారం రాత్రి పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. బక్రీద్ నాడు సూర్య చౌహాన్ అనే టీనేజర్‌ను అసద్, మరికొందరితో కలిసి హత్య చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో యూపీలో పెను కలకలం రేగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇక అసద్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఘాజియాబాద్ పోలీసులకు అతడు తన స్నేహితుడిని కలిసేందుకు ఖోదా ప్రాంతానికి వస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో, పోలీసులు నిఘా పెట్టారు. మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వచ్చిన అతడు పోలీసులపై కాల్పులకు దిగాడు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగడంతో అసద్‌కు గాయాలయ్యాయి. ఒక కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడని పోలీసులు తాజాగా తెలిపారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మే 28న సూర్య చౌహాన్‌.. అసద్‌తో పాటు మరికొందరితో వాగ్వావాదానికి దిగాడు. బైక్ విషయంలో వారి మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో సూర్య వారి చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో, అతడి కుటుంబసభ్యులు స్థానికంగా నిరసనకు దిగారు. నిందితుల ఎన్‌కౌంటర్ జరిగాకే తన కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేస్తానని మృతుడి తల్లి తేల్చి చెప్పారు. అయితే, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు నచ్చచెప్పడంతో సూర్య కుటుంబం చివరకు అతడి అంత్యక్రియలను పూర్తి చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం ఐదు మందిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అసద్ మాత్రం ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలనూ చదవండి:</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/number-of-ministers-and-deputy-cms-in-dk-cabinet-yet-to-be-decided-says-mallikarjun-kharge-avr-1528424.html"><strong>మంత్రులు, డిప్యూటీ సీఎంలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. మల్లికార్జున్ ఖర్గే</strong></a></p><p><a target="_blank" rel=""

Andhra Jyothy01 Jun, 01:43 pm
స్నేహం పేరు చెప్పి తప్పించుకోలేరు.. టీనేజర్ హత్యపై యూపీ సీఎం వ్యాఖ్య

<p>ఇంటర్నెట్ డెస్క్: యూపీలో ఇటీవల కలకలం రేపిన సూర్య అనే టీనేజర్ హత్యపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బిజ్నోర్‌లో ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ స్నేహం మాటున హింసాత్మక చర్యలకు దిగితే సహించేది లేదని అన్నారు. తప్పుడు మార్గాల్లో వెళుతున్న పిల్లలను సక్రమమార్గంలో మళ్లించలేని తల్లిదండ్రులు పెద్ద తప్పు చేస్తున్నట్టేనని హెచ్చరించారు. చట్టప్రకారం నడుచుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.</p><p>అహింస, మానవత్వం సమాజాన్ని సుసంపన్నం చేసే ఆభరణాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తప్పు జరిగినప్పుడు దీటుగా స్పందించక తప్పదని కూడా చెప్పారు. ఖరదూషనాదులు వంటి రాక్షస శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఆయుధాల చేతపట్టకతప్పదని చెప్పారు. దేశంలోని వారందరూ చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>బక్రీద్ రోజున సూర్య (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. బైక్ నడిపే విషయంలో తగాదా తలెత్తడంతో స్నేహితులే అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు. మిగిలిన వారిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలనూ చదవండి:</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cm-vijay-says-i-am-a-public-servant-not-a-chief-minister-hits-back-at-critics-erk-1528762.html"><strong>నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: తమిళనాడు సీఎం విజయ్</strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/india-us-trade-deal-phase-one-nearing-completion-says-piyush-goyal-pcs-1528756.html"><strong>యూఎస్‌తో ట్రేడ్ డీల్.. 99 శాతం చర్చలు పూర్తి: మంత్రి పీయూష్ గోయల్</strong></a></p>

Andhra Jyothy31 May, 02:56 am
ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లో ఎన్ కౌంటర్ .. హత్య కేసు నిందితుడి హతం

<p><strong>ఉత్తర్ ప్రదేశ్: </strong>ఘజియాబాద్ ఇందిరాపురంలో ఎన్‌కౌంటర్ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పక్కా సమాచారం ఆధారంగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు తన స్నేహితుడిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈ నెల 28న సూర్య చౌహాన్ (17) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఇందిరాపురం పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడైన అసద్ పరారీలో ఉన్నాడు. అతనిపై పోలీసులు రూ.50 వేల రివార్డ్ కూడా ప్రకటించారు. అయితే, ఇందిరాపురంలోని ఖోడా ప్రాంతానికి తన స్నేహితులను కలిసేందుకు అసద్ వెళ్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసు బృందాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాయి. అసద్, తన స్నేహితుడు ద్విచక్రవాహనంపై రాగా.. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>అయితే, పోలీసు బృందంపై అసద్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులూ ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో అసద్‌కి తీవ్రగాయాలు కాగా.. ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. పోలీసులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. అసద్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా నిందితుడు ఉపయోగించిన తుపాకీ, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోటార్ సైకిల్ నడిపే విషయంలో సూర్య, అసద్ మధ్య వివాదం చెలరేగిందని.. దీంతో సూర్యను నిందితుడు కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు సూర్య తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈద్ పండుగ పేరుతో తమ కుమారుడిని ఏడుగురు బయటకు

Samayam Telugu31 May, 02:12 pm
బక్రీద్ రోజు స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్య.. నిందితుడి ఎన్ కౌంటర్

బక్రీద్ రోజు స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్య.. నిందితుడి ఎన్‌కౌంటర్! ఘాజియాబాద్‌లో కలకలం సృష్టించిన... సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్... శనివారం అర్ధరాత్రి జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. బక్రీద్ పండుగ రోజున... సూర్య చౌహాన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు... అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. ఈ వార్తకు సంబంధించిన