translateexpand_more

Fact Check News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu03 Jun, 07:38 am
బంగారాన్ని ఆర్ బీఐ విక్రయించలేదు’.. బ్లూమ్ బెర్గ్ నివేదికను ఖండించిన కేంద్రం

Fact check | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెద్దఎత్తున బంగారం విక్రయించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఫారెక్స్‌ నిల్వలు కాపాడుకోవడానికి ఆర్‌బీఐ పసిడిని విక్రయించిందంటూ వచ్చిన బ్లూమ్‌బర్గ్‌ కథనాన్ని తోసిపుచ్చింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల మన ఇంధన దిగుమతుల బిల్లు భారీగా పెరిగింది. మన ఈక్విటీలను విదేశీ మదుపర్లు విక్రయించి, పెట్టుబడులు పట్టుకెళ్లిపోతున్నారు. ఈ కారణాల వల్ల అమెరికా డాలర్‌కు గిరాకీ బాగా పెరిగింది. ఫలితంగా రూపాయి విలువ తగ్గిపోతోంది. దీంతో మన విదేశీ మారకపు ద్రవ్యం (ఫారెక్స్‌) నిల్వలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని కాపాడుకునేందుకు ఆర్‌బీఐ 12 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడిని విక్రయించినట్లు వార్తాసంస్థ బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఫారెక్స్‌ నిల్వల్లో బంగారం వాటా 2025లో 13.92 శాతంగా ఉండగా.. 2026 మార్చి 31 నాటికి 16.70 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మే 22 నాటికి ఆ మొత్తం 16.85 శాతానికి పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలను ఉదహరించింది. ఆర్‌బీఐ తన వద్ద ఫిజికల్‌ గోల్డ్‌ వివరాలను ఎప్పటికప్పుడు నెలవారీ బులెటిన్‌లో వెల్లడిస్తోందని పేర్కొంది. ఈ తేదీ వరకు అందులో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. కాబట్టి తప్పుడు సమాచారం నమ్మొద్దని సూచించింది. అధికారిక సమాచారం కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu03 Jun, 05:40 am
అది ఫేక్ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఏఐ యుగంలో ఏది నిజమో.. ఏది కల్పితమో తెలియని పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ.. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని చాలా నెమ్మదిగా ఆడతాడంటూ అవమానించేలా మాట్లాడినట్లున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విరాట్‌ గురించి హర్షా భోగ్లే ఒక ప్రశ్న అడిగితే.. వైభవ్‌ దానికి సమాధానం ఇచ్చినట్లుగా ఉంది ఆ వీడియో. అయితే అది ఫేక్‌ వీడియో అని ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే ‘ఎక్స్‌’ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ‘సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియో ఫేక్‌. అందులో వైభవ్‌ను మర్యాద తెలియనివాడిగా, అహంకారిగా చిత్రీకరించారు. నేను అతడిని ఆ ప్రశ్న అడగలేదు. అతడు కూడా అలాంటి సమాధానమేదీ ఇవ్వలేదు. క్రూరంగా, దురుద్దేశపూర్వకంగా ఇలా వీడియో క్రియేట్‌ చేశారు. తనతో మాట్లాడిన కొద్దిమందితో చాలా గౌరవంగా మాట్లాడే ఒక చిన్న పిల్లాడి విషయంలో ఇలా ప్రవర్తించడం మరింత దారుణం’ అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ఫేక్‌ వీడియోలో ఏముందంటే.. ‘మీరు కూడా విరాట్‌ కోహ్లీలా క్రికెట్‌ ప్రపంచాన్ని ఓ రాజులా ఏలాలి అనుకుంటున్నారా?’ అని హర్షా భోగ్లే అడిగితే.. ‘నాకు విరాట్‌ భయ్యా అంటే ఇష్టం. కానీ నాకు అతడి రికార్డ్స్‌ అంటే ఇష్టం లేదు. అతడు చాలా నెమ్మదిగా హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు చేస్తాడు..’ అని అన్నట్లుగా ఉంది. కానీ అదంతా ఫేక్‌ అని హర్షా భోగ్లే తేల్చిచెప్పాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Fact Check News News Keyword | Telugu Digital