translateexpand_more

Gujarat News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 04:04 pm
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా

<p><strong>ఇంటర్నెట్ డెస్క్:</strong> గుజరాత్‌లోని అత్యంత రద్దీగా ఉండే అహ్మదాబాద్ మానేక్ చౌక్ ప్రాంతంలో సినిమా తరహా చోరీ కలకలం సృష్టించింది. ఒక బులియన్ వ్యాపారి వద్ద పనిచేసే ఉద్యోగి ఏమరపాటును ఆసరాగా చేసుకున్న ఓ గుర్తు తెలియని దొంగ.. అత్యంత చాకచక్యంగా నగదును దోచుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత ఉద్యోగి మానేక్ చౌక్ వీధిలో నడుస్తూ వెళ్తూ తన మొబైల్ ఫోన్‌లో నిమగ్నమైపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జనం తిరుగుతున్నప్పటికీ.. దొంగ అతడి సమీపానికి వచ్చి నిలబడ్డాడు. ఉద్యోగి ఫోన్ చూసుకుంటున్న సమయంలో దొంగ.. క్షణాల వ్యవధిలో అతని బ్యాగ్ జిప్ తీసి రూ. 5.50 లక్షల నగదును దొంగిలించాడు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఫోన్ చూసుకోవడంలో మునిగిపోయిన ఉద్యోగికి ఆ సమయంలో ఏం జరిగిందో అస్సలు తెలియలేదు. ఆ తర్వాత అతను తన కార్యాలయానికి చేరుకుని, బ్యాగ్‌ను తెరిచి చూడగా నగదు మాయమైనట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. చోరీ ఘటన మొత్తం.. అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/ap-pension-increased-to-4000-chandrababu-naidu-election-promise-fulfilled-says-mlc-anuradha-suri-1528695.html">పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/mailavaram-mla-vasantha-krishna-prasad-ensures-transparent-pension-distribution-vk-1528694.html">పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత</a></p>

Andhra Jyothy29 May, 02:16 am
గుజరాత్ లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి

గుజరాత్ సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. గుజరాత్‌: సాంకేతిక యుగంలో మనుషులు చంద్ర మండలంపైకి వెళ్తున్నా కొంత మందిని మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. ఓ వైపు పూజల పేరుతో దొంగ బాబాలు అమాయకులను మోసం చేస్తుంటే.. మరోవైపు చేతబడి, బాణామతి పేరుతో పలువురిపై మూకదాడులు జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. మంత్రగత్తె పేరుతో ఓ మహిళపై దాడి చేసేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా.. అడ్డుకోబోయిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ గ్రామంలో వదంతులు వ్యాపించాయి. కొంత మంది గ్రామస్థులు ఆ పుకార్లను నమ్మారు. ఆ కుటుంబంపై దాడి చేసి ఊరి నుంచి తరిమేయాలని నిర్ణయించారు. దీంతో పదుల కొద్దీ జనం ఒక్కసారిగా కమ్లాబెన్ ఇంటిపైకి దూసుకెళ్లారు. ఆమె నివాసంపై రాళ్లు విసురుతూ భయాందోళనలు సృష్టించారు. భార్య, పిల్లలను కాపాడేందుకు మనుభాయ్ బయటకు వచ్చారు. దాడికి వచ్చిన వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత కుటుంబంపై ఒక్కసారిగా గ్రామస్థులు మూకదాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో మనుభాయ్‌పై దాడి చేశారు. ఈ ఘర్షణలో అతని తలకు తీవ్ర గాయాలు కాగా.. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించే లోపే మనుభాయ్ మృతిచెందాడు. రంగంలోకి దిగిన పోలీసులు మూకదాడికి పాల్పడిన 12 మంది గ్రామస్థులపై కేసు నమోదు చేశారు. ఎనిమిది

Andhra Jyothy28 May, 08:14 am
కెనడాలో భారతీయ యువతి దారుణ హత్య

కెనడాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ యువతిని గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌నెట్ డెస్క్: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ యువతిని గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌, ఆనంద్ జిల్లాలోని బోర్సద్‌కు చెందిన 22 ఏళ్ల విధి కల్పేశ్ భాయ్ మేఘానీ ఉన్నత చదువుల నిమిత్తం నాలుగేళ్ల క్రితం కెనడా వెళ్లింది. ఓ వైపు చదువుతూనే మరో వైపు పార్ట్ జాబ్ చేస్తోంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని ఘోరం చోటుచేసుకుంది. మే 15వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన విధి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విధిని ఎందుకు చంపాడన్న సంగతి తెలియరాలేదు. పోలీసులు నిందితుడి కోసం అన్వేషిస్తున్నారు. రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కల్యాణ్

Sakshi27 May, 02:09 pm
గుజరాత్ లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. విలువ వెయ్యి కోట్లకు పైగా

గాంధీనగర్‌: గుజరాత్‌లో భారీ డ్రగ్స్‌ ముఠాను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు గుట్టు రట్టుచేశారు. కచ్‌లో సుమారు రూ.1180 కోట్ల విలువైన 118 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు విదేశీయులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్‌ రవాణా జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్, పలు లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కరాచీ (పాకిస్థాన్‌) మీదుగా ప్రయాణించి గుజరాత్ తీరానికి ఓ ఓడ చేరుకుంది. ముంద్రా తీరానికి సుమారు 9.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆ ఓడ నుంచి అనుమానాస్పదంగా ప్యాకెట్లు సముద్రంలోకి విసురుతున్నట్లు కోస్ట్‌ గార్డులు గుర్తించారు. వెంటనే గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులకు సమాచారం అందించగా.. ఏటీఎస్‌–కోస్ట్‌ గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ సమయంలో ఓడలో ఇద్దరు నైజీరియన్‌ జాతీయులు ఉండగా, వారిలో ఒకరు సముద్రంలోకి దూకి తప్పించుకున్నారు. మరో ఇద్దరిని క్లావిన్‌ చుక్వుమా (టాంజానియా పౌరుడు), బ్యారుహంగా జేమ్స్‌ (ఉగాండా పౌరుడు)గా గుర్తించారు. కంటైనర్ల ద్వారా తెచ్చిన కొకైన్‌ను భారత్‌లో ఎవరికి అందించాలనుకున్నారు. ఏ ప్రాంతానికి తరలించాలనుకున్నారు అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ డ్రగ్స్‌ను ఢిల్లీలోని ద్వారకలో నివసిస్తున్న ఇద్దరికి అందజేయాల్సి ఉందని నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌ 13న పోర్‌బందర్‌లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్‌ 12 రాత్రి జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌, కోస్ట్‌ గార్డ్‌ బృందం, పోర్‌బందర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకుంది. గుజరాత్‌ ఏటీఎస్‌ సమాచారం మేరకు, కోస్ట్‌ గార్డ్‌ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ

Eenadu27 May, 08:18 am
రూ.1000 కోట్లకు పైగా కొకైన్ సీజ్

ఇంటర్నెట్‌డెస్క్‌: మాదకద్రవ్యాల రవాణాపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. తాజాగా గుజరాత్‌ (Gujarat)లోని కచ్‌ తీరంలో భారీ మొత్తంలో కొకైన్‌ దొరికింది. దాని విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పాకిస్థాన్‌లోని ఖాసిం పోర్టు నుంచి ఒక యూరోపియన్‌ నౌక కచ్‌ తీరానికి వచ్చింది. ఈ నౌకలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), భారత కోస్ట్‌గార్డ్‌ అధికారులు గమనించారు. నౌకలోంచి కొన్ని సంచులను సముద్రంలోకి విసిరేయడాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ సంచులను స్వాధీనం చేసుకొని.. పరీక్షించగా అవి కొకైన్‌ (cocaine) అని తేలింది. దాదాపు 100 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1150 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ డ్రగ్స్‌ (Drugs) రవాణాకు సంబంధించి ఒకరిని అధికారులు అరెస్టు చేశారు. నౌకన్‌ను సీజ్‌ చేసి తీర ప్రాంతానికి తరలించారు. ఈ డ్రగ్స్‌ ఎక్కడినుంచి వచ్చాయి, ఎక్కడికి చేరవేస్తున్నారు.. ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Oneindia Telugu30 May, 05:47 pm
నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్ కి సంచలన లేఖ

గుజరాత్&amp;zwnj;లోని సూరత్ నగరంలో ఓ వ్యక్తి చేసిన అసాధారణ విజ్ఞప్తి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మరోసారి కుటుంబ వివాదాలు, గృహహింస కేసులు, పురుషుల హక్కులపై చర్చకు దారితీసింది.భార్య, అత్త వేధింపులను భరించలేకపోతున్నానంటూ ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్&amp;zwnj;కు లేఖ రాసి తనకు కారుణ్య మరణం (Mercy Killing) అనుమతించాలని కోరడం కలకలం రేపుతోంది.సూరత్&amp;zwnj;కు చెందిన కిరిట్ పటేల్ 2024లో మూడోసారి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది కాలానికే తన జీవితంలో సమస్యలు ప్రారంభమయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. భార్యతో పాటు అత్త కూడా తనపై నిరంతరం డబ్బుల కోసం ఒత్తిడి తెస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న విభేదాలు క్రమంగా తీవ్రమై తన జీవితాన్నే సంక్షోభంలోకి నెట్టేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.కిరిట్ పటేల్ ఆరోపణల ప్రకారం, తన భార్య మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ తనపై తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తోందని తెలిపారు. గతంలో తన మాజీ భర్తలపైనా ఇలాంటి ఆరోపణలు చేసి డబ్బులు వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాను నిర్దోషినని చెబుతున్నప్పటికీ, ప్రతి సందర్భంలోనూ తానే బాధితుడిగా మారుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ సరైన స్పందన రాలేదని కిరిట్ ఆరోపించారు. తన ఫిర్యాదులను అధికారులు సీరియస్&amp;zwnj;గా తీసుకోలేదని, చట్టపరంగా న్యాయం దొరకడం లేదనే భావన తనలో పెరిగిపోయిందని చెప్పారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశకు గురయ్యానని లేఖలో వివరించారు.నా జీవితం పూర్తిగా నరకంగా మారింది. నాపై జరుగుతున్న వేధింపుల నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ జిల్లా కలెక్టర్&amp;zwnj;కు

Eenadu30 May, 06:13 am
నా భార్య వేధిస్తోంది.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి

ఇంటర్నెట్‌డెస్క్‌: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి వింత అభ్యర్థన చేశాడు. తన కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ కలెక్టర్‌కు లేఖ రాశాడు. గుజరాత్‌ (Gujarat)లోని సూరత్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెలితే.. సూరత్‌కు చెందిన కిరిట్‌ పటేల్‌కు 2024లో స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. పెళ్లయినప్పటి నుంచి తన భార్య, అత్త డబ్బు కోసం తనను ఒత్తిడి చేస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నారని పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఫిర్యాదులతో మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను తన భార్య దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఆమె అంతకుముందు పెళ్లి చేసుకుని వదిలేసిన వారిని కూడా ఇలాగే వేధించిందని.. వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసిందని తెలిపారు. ఆమె వేధింపులపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. వారు పట్టించుకోలేదని అన్నారు. ఆమె తీరుతో తాను తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తన కారుణ్య మరణానికి (Euthanasia) అనుమతివ్వాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అందులో గృహ హింస ఎదుర్కొంటున్న పురుషులకు చట్టపరమైన రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ కారుణ్య మరణ అభ్యర్థనపై జిల్లా అధికారులు ఇంకా స్పందించలేదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి