
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ (Women's T20 World Cup 2026) జూన్ 12 నుంచి మొదలుకానుంది. జూన్ 14న బర్మింగ్హామ్లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై క్రికెట్ ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అభిమానులు, మీడియాకు ఓ విజ్ఞప్తి చేసింది. కేవలం భారత్, పాక్ మ్యాచ్కే హైప్ క్రియేట్ చేయొద్దని, టోర్నీ మొత్తానికి ఆదరణ వచ్చేలా ప్రచారం చేయాలని కోరింది. ‘‘2022 కామన్వెల్త్ గేమ్స్లో బర్మింగ్హామ్లో భారత్, పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే కాకుండా మనం టీ20 ప్రపంచ కప్నకు కూడా మరింత ప్రచారం కల్పించాలని ఆశిస్తున్నాను. కేవలం ఒక మ్యాచ్కే మనం ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదు. దానికి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. అభిమానులు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. వారి కోసం మేం మంచి ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉంది’’ అని మంధాన పేర్కొంది. టీ20 వరల్డ్ కప్లో గ్రూప్-ఎలో ఉన్న భారత్ లీగ్ దశలో తొలి మ్యాచ్ పాకిస్థాన్తో (జూన్ 14న) ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తలపడనుంది. ఇక, భారత జట్టు విషయానికొస్తే.. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో టీమ్ఇండియా నెగ్గింది. తర్వాత రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై సిరీస్ను చేజార్చుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.