translateexpand_more

India Vs Afghanistan News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 12:10 pm
ఐపీఎల్ముగిసింది.. జూన్ 6 నుంచే నాన్ స్టాప్ క్రికెట్ ధమాకా.. పూర్తి షెడ్యూల్ ఇదే

Team India : క్రికెట్ ప్రేమికులను రెండు నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ లీగ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి ఆర్‌సీబీని గెలిపించి తన సత్తా చాటాడు. అయితే ఐపీఎల్ వినోదం ముగియడంతో ఇక ఫ్యాన్స్ అందరి కళ్ళు అంతర్జాతీయ క్రికెట్‌పై పడ్డాయి. గత మార్చి నెలలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉండటం వల్ల ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో వారం తిరక్కుండానే జూన్ 6 నుంచి భారత జట్టు మళ్లీ రంగంలోకి దిగుతోంది. రాబోయే రోజుల్లో భారత్ ఆడబోయే నెక్స్ట్ సిరీస్‌ల కంప్లీట్ వివరాలు, ఫుల్ షెడ్యూల్ ఇప్పుడు వివరంగా చూద్దాం. అఫ్గానిస్తాన్‌తో తొలి పోరు.. న్యూ చండీగఢ్‌లో వేదిక ఐపీఎల్ ముగిసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జూన్ 6 నుంచి మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. దీనికి న్యూ చండీగఢ్ వేదిక కానుంది. జూన్ 6 నుంచి జూన్ 10 వరకు భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఒకే ఒక్క చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగబోతోంది. ఈ సిరీస్‌తో భారత్ లాంగ్ ఇంటర్నేషనల్ సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. అఫ్గానిస్తాన్ సిరీస్ పూర్తి కాగానే టీమ్ ఇండియా విదేశీ పర్యటనలకు బయలుదేరుతుంది.

AP7AM30 May, 04:55 am
రోహిత్ ను ఎంపిక చేసి.. జైస్వాల్ కు అన్యాయం చేశారు

ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టి, 39 ఏళ్ల రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై ఆయన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని తప్పుబట్టారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సెలక్టర్లు జైస్వాల్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌‌లో మంజ్రేకర్ మాట్లాడుతూ.. "చివరిగా ఆడిన వన్డేలో అజేయ శతకం (116) సాధించిన జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంలో అర్థం లేదు. మరోవైపు, ఫిట్‌నెస్, ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు చోటు కల్పించారు. దీని వెనుక ఉన్న తర్కం ఏంటో వివరించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో రోహిత్‌ను ఎంపిక చేయాల్సి వస్తే, ముందుగా జైస్వాల్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అతను అత్యున్నత స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్న యువ కెరటం" అని అన్నారు.2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, జట్టు భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని మంజ్రేకర్ సూచించారు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా బలమైన జట్టును నిర్మించాలని అభిప్రాయపడ్డారు. మంజ్రేకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.