translateexpand_more

Ktr Comments News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 07:26 am
తెలంగాణకు కేసీఆర్.. ఇక కుదరదు - పవన్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశభక్తి, పోరాటాల గురించి తాము పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ఓజీ కేసీఆర్ అని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పవన్ పోటీ చేశారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను ఎవరూ అడ్డుకోలేదని.. ప్రజలే అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.ఏపీ డిప్యూటీ సీఎం... జనసేనాని పవన్ వ్యాఖ్యల పైన తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తు న్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యల పైన స్పందించిన కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తామని.. సోదరుడిగా ఇంటికి వస్తే.. హైదరాబాద్ బిర్యానీ పెడతామన్నారు. అంతే కానీ.. తమ సచివాలయంలో కూర్చుంటామంటే కుదరదన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు OG కేసీఆర్ అని.. వేరే ఎవరూ అవసరం లేదన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడని కేటీఆర్ అన్నారు. మరి పొట్టి శ్రీరాములు మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా అని ప్రశ్నించారు.అదే నా రాస్తా’, ఒక్క పోస్టుతో తేల్చేసిన పవన్..!!అప్పట్లోనే జనసేన పోటీ చేసింది పవన్ కళ్యాణ్.. మీరు ఇక్కడకి రండి.. మీ కుటుంబాలు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేముందని కేటీఆర్ అన్నారు. దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. 2023 ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తుచేశారు. 2018లో చంద్రబాబు కూడా పోటీ చేశారని తెలిపారు. పవన్.. తెలంగాణలో పోటీ చేయండి.. ఎవరు వద్దనటం లేదని చెప్పుకొచ్చారు. ఇక్కడకు వచ్చి అన్యాయంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కదం తొక్కిన నేలని... ఆవిర్భావ దినోత్సవం రోజు విభజన తీరు సరిగా లేదని అంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేసారు. తెలంగాణపై ఉల్టాపల్టా మాటలెందుకు? తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్‌ సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాం కదా.. మళ్లీ మీ పెత్తనం ఎందుకు అని నిలదీశారు.

Andhra Jyothy03 Jun, 06:54 am
తెలంగాణకు కేసీఆర్.. వేరే ఎవరూ అవసరం లేదు

<p><strong>హైదరాబాద్, జూన్ 3: </strong>ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తామని.. సోదరుడిగా ఇంటికి వస్తే.. హైదరాబాద్ బిర్యానీ పెడతామన్నారు. అంతే కానీ.. తమ సచివాలయంలో కూర్చుంటామంటే కుదరదన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు OG కేసీఆర్ అని.. వేరే ఎవరూ అవసరం లేదన్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: #ff0000">ప్రజలుగా కలసి ఉండాలని కోరుకున్నాం..</span></strong></p><p>‘పవన్ కళ్యాణ్.. మీరు ఇక్కడకి రండి.. మీ కుటుంబాలు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానమని పవ‌న్ అన్నారు. మద్రాసు నుంచి ఆంధ్రా వేరు పడాలని పొట్టి శ్రీరాములు పోరాడారు. అది కూడా ప్రాంతీయవాదమే అంటారా? మోదీ ప్రాంతీయవాదంతో.. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తరలించుకుపోతున్నారు. జాతీయవాదం ముసుగులో ఆర్థిక పాంత్రీయవాదం చేయటం సరైందేనా? దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్తారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: rgb(255, 0, 0)">దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు..</span></strong></p><p>తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేముందని కేటీఆర్ అన్నారు. దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. 2023 ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తుచేశారు. 2018లో చంద్రబాబు కూడా పోటీ చేశారని తెలిపారు. ‘పవన్.. తెలంగాణలో పోటీ చేయండి.. ఎవరు వద్దంటున్నారు. ఇక్కడకు వచ్చి అన్యాయంగా మాట్లాడటం సరికాదు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల ఇది. ఆవిర్భావ దినోత్సవం రోజు విభజన తీరు సరిగా లేదని అంటున్నారు. తెలంగాణపై ఉల్టాపల్టా మాటలెందుకు? తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్‌ సభ పెడతానంటే ఎలా. పవన్ మీటింగ్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం’ అని తెలిపారు. వందల మంది బలిదానాల రక్తంతో తడిసిన నేల తెలంగాణ అని మాజీ మంత్రి అన్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పవన్ మాట్లాడాలని హితవుపలికారు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు.</p><br/><p><strong><span style="color: rgb(255, 0, 0)">తెలంగాణ కథలో విలన్ కాంగ్రెస్..</span></strong></p><p>పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ సాకారమైందని కేటీఆర్ అన్నారు.1956లో బలవంతంగా ఆంధ్ర, తెలంగాణను కలిపింది కాంగ్రెస్ అని విమర్శించారు.1969 ఉద్యమంలో 379 మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్సే అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాలను కర్కశంగా అణిచివేసింది కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు. మలిదశ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్సే అని అన్నారు. తెలంగాణ కథలో నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని.. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పోరాటం, దీక్ష లేకపోతే.. తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ హయాంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.</p><div id="btwArticleBodyAdsDiv_3"></div><br/><p><strong><span style="color: rgb(255, 0, 0)">కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదం.. </span></strong></p><p>తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. అమలుకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిందేంటి అని ప్రశ్నించారు. అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డ్ సృష్టిస్తోందని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ ప్రభుత్వం రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. అప్పులపై ఒక్కో మంత్రి.. ఒక్కో లెక్క చెబుతున్నారన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదమని ప్రజలకు అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు. </p><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/acb-raids-bhujanga-rao-properties-phone-tapping-case-suchi-1529303.html">ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/pawan-kalyan-support-tg-statehood-not-political-suchi-1529306.html">తెలంగాణకు నా మద్దతు సిద్ధాంతపరమే: పవన్ కల్యాణ్</a></p><p><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_5"></div>

SkyC Media03 Jun, 06:40 am
కాంగ్రెస్ నంబర్ 1 విలన్ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని నంబర్ 1 విలన్‌గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు చేస్తూ గత చరిత్రను గుర్తు చేశారు. గతంలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలను బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణచివేసిన చరిత్ర ఆ పార్టీకి ఉందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణలోని 4 కోట్ల ప్రజలను తన కుటుంబంగా భావించి కేసీఆర్ పోరాటం చేశారని ఆయన అన్నారు. కానీ, కేవలం నలుగురి కోసమే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిపై ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ గుర్తు చేశారు. తాము ఎప్పటికీ అధికారంలోనే ఉంటామని భావించే వారు మూర్ఖులని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి వింత సమాధానాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. 3 నెలల్లో పిల్లలు పుట్టించగలరా అని సీఎం అడుగుతున్నారని, మరి 30 నెలలైనా ఏమీ పుట్టకపోతే ఏమనాలని ప్రశ్నించారు. సంతానం కలగని వారిని ఏమంటారో అందరికీ తెలుసని, 30 నెలల పాలనలో ఫలితం లేకపోతే అదే పదం వర్తిస్తుందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు చేస్తూ ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. కరువుతో అల్లాడుతున్న తెలంగాణను దేశానికి అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ తీసుకెళ్లారని కొనియాడారు. తెలంగాణను ఒక బంగారు పల్లెలా మార్చి కాంగ్రెస్ చేతికి ఇస్తే, ఇప్పుడు దానిని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు మరియు వ్యవసాయ రంగాల్లో సాధించిన విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఫలితంగా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని కేటీఆర్ అన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి కేవలం రాజకీయ కక్షసాధింపులకే కాంగ్రెస్ పరిమితమైందని ఆయన విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన అభివృద్ధి పునాదులను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అధికార గర్వంతో విర్రవీగుతున్న నేతలు వాస్తవాలను గ్రహించాలని ఆయన సూచించారు. మున్ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ఎండగడతామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కేటీఆర్ ప్రకటించారు.

Ktr Comments News Keyword | Telugu Digital