translateexpand_more

Praful Hinge News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 12:48 am
సత్తా చాటిన యంగ్ గన్స్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో సత్తా చాటిన యంగ్‌ గన్స్‌ భవిష్యత్తుపై భరోసా పెంచుతున్న వైభవ్, అన్షుల్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చిన ప్రఫుల్, ముకుల్‌ గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్‌ 19వ సీజన్‌ ముగిసింది! ‘బేబీ బాస్‌’ వైభవ్‌ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్‌ ‘పర్పుల్‌ క్యాప్‌’ రేసులో చివరి వరకు

Andhra Jyothy28 May, 02:24 am
గేల్ సెంచరీ రికార్డు ఎందుకు మిస్ అయ్యానంటే

ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 97 పరగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 47 పరగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఆర్ఆర్ క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ 15 ఏళ్ల ఓపెనర్.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ పోరులో మేము గెలవడమే ముఖ్యం. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గేల్ సెంచరీ రికార్డు గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బ్రేక్ చేస్తానా? తొందర లేకుండా సింగిల్స్ తీస్తే సరిపోయేదా? అనే విషయాలేవీ నేను పట్టించుకోలేదు. ఫీల్డర్‌ను చూసి ఆ షాట్ ఆడాను. థర్డ్ మ్యాన్ వైపు కొట్టుంటే బంతి సిక్స్ వెళ్లి ఉండేది. కానీ స్ట్రెయిట్‌గా ఆడేందుకు ప్రయత్నించాను. అందుకే టైమింగ్ మిస్ అయింది. ప్రస్తుతం ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే నా ముందున్న లక్ష్యం. సెంచరీలు, రికార్డులు.. ఇవన్నీ భవిష్యత్తులో బ్రేక్ చేయొచ్చు. మైలురాయిల

Andhra Jyothy28 May, 03:10 am
వైభవ్ కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వైభవ్ అద్భుతంగా ఆడాడు. అతడికి బౌలింగ్ చేయడానికి పెద్దగా ఆప్షన్లు కనిపించలేదు. అతడిని ఔట్ చేసేందుకు ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసినా.. లాభం లేకపోయింది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్.. బౌలర్ యార్కర్ వేయడంలో కాస్త పొరపాటు చేసినా వైభవ్ దాన్ని వదిలిపెట్టడు. ప్రతి బంతిని భారీ షాట్‌గా మలిచేందుకే ప్రయత్నిస్తాడు. వైభవ్ ఆటతీరుని మెచ్చుకోకుండా ఉండలేం’ అని కమిన్స్ వెల్లడించాడు. ‘టోర్నీ నుంచి నిష్క్రమించినా ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఈ సీజన్‌లో కుర్రాళ్ల ప్రతిభను వెలికితీశాం. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా రాణించారు. 240 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. అదే మా విజయావకాశాలను దెబ్బతీసింది. అయినప్పటికీ ఆఖరి వరకు పోరాడాం. గత మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరాం. కొద్ది తేడాతోనే టాప్ 2 ప్లేస్‌ను కోల్పోయాం. ఈ

TV9 Telugu27 May, 03:00 pm
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. మైదానంలోనే కన్నీరు పెట్టిన సూర్యవంశీ

ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.. మరెన్నో కొత్త చరిత్రలు లిఖించబడ్డాయి. కానీ, నిన్న రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో మాత్రం గుండెల్ని పిండేసే ఒక అద్భుతమైన, భావోద్వేగ సన్నివేశం ఆవిష్కృతమైంది. కేవలం కొన్ని పరుగుల దూరంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకుని, రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఊపు చూస్తే సూర్యవంశీ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చరిత్ర సృష్టించే ముంగిట బోల్తా పడ్డాడు. ప్రఫుల్ హింగే విసిరిన ఒక షార్ట్ పిచ్ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ దాటించేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. అయితే, ఊహించిన దానికంటే బంతి కాస్త ఎత్తుగా రావడంతో కనెక్ట్ కాలేకపోయింది. డీప్ థర్డ్ స్థానంలో ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి బంతి నేరుగా వెళ్లడంతో ఆకాశమే హద్దుగా సాగుతున్న ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ సీజన్‌లో ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో సూర్యవంశీ అవుట్ కావడం ఇది మొదటిసారి కాదు, కానీ ఈ వికెట్ మాత్రం అతడిని కోలుకోలేని దెబ్బ తీసింది. అవుట్ అయిన వెంటనే సూర్యవంశీ నమ్మలేనట్టు అక్కడే నిలబడిపోయాడు. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు ఆగిపోయినంత పనైంది. సెంచరీ మిస్ అయిందనే బాధతో, తీవ్రమైన కోపంతో తన బ్యాట్‌ను గాల్లోనే గుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు. ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆవేదన, కళ్లల్లో కదిలాడిన నీళ్లు చూసి స్టేడియంలోని ప్రేక్షకులంతా భావోద్వేగానికి లోనయ్యారు. శత్రువులైనా సరే సూర్యవంశీ ఆడిన

NTV Telugu26 May, 05:15 am
IPL 2026: ఒకే ఒక్క మ్యాచ్‌లో హీరోలు.. ఆ తర్వాత పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన 5 గురు ‘వన్ మ్యాచ్ వండర్స్’!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితమైన చివరి అంకానికి చేరుకుంది. ఆర్‌సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరగా.. మిగిలిన ఆరు జట్లు ఇంటిదారి పట్టాయి. మే 31 ఆదివారం రాత్రి జరిగే ఫైనల్‌తో ఈ 19వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ లీగ్ స్టేజ్‌లో వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్, భువనేశ్వర్ స్వింగ్, కోహ్లీ మాస్టర్ క్లాస్, రబాడ స్పీడ్ అభిమానులను అలరించినప్పటికీ.. కొందరు ఆటగాళ్లు మాత్రం కేవలం ‘ఒక్క మ్యాచ్ వండర్స్’ లాగే మిగిలిపోయారు. ఒకే ఒక్క మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, ఆ తర్వాత ఘోరంగా నిరాశపరిచిన ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అందులోనూ 3 వికెట్లు తన మొదటి ఓవర్లోనే తీశాడు. కానీ ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లే తీసి లయ తప్పాడు. ముఖ్యంగా ఆ తర్వాతి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ తలపడినప్పుడు వైభవ్ సూర్యవంశీ ఈ బౌలర్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముకుల్ చౌదరి కథ కూడా ఇంతే. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అజేయంగా 54 పరుగులు చేసి లక్నోకు 3 వికెట్ల విజయాన్ని అందించిన ముకుల్.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను చేసినవి కేవలం 116 పరుగులే. మరోవైపు, జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో