
డైరెక్టర్ తేజ సంచలన చిత్రం ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమై, తన గ్లామర్, నటనతో మెప్పించిన హీరోయిన్ రీమా సేన్. ఆ తర్వాత ‘మనసంతా నువ్వే’, ‘అదృష్టం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ, గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కో-స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ , దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్లో వర్క్ చేసిన స్టార్ హీరోల గురించి రీమా సేన్ మాట్లాడుతూ.. మొదటగా తన తొలి చిత్రం ‘చిత్రం’ , ‘మనసంతా నువ్వే’ కో-స్టార్ ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావించారు. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఉదయ్ కిరణ్ చాలా సైలెంట్ పర్సన్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన ఒక ఇంట్రోవర్ట్ (ఎక్కువగా మాట్లాడని వ్యక్తి) అని, సెట్స్లో ఎంతో పద్ధతిగా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవారని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ ఎంతో ప్రైమ్ అండ్ ప్రాపర్గా ఉంటూ, "రీమా గారు.. ఎలా ఉన్నారు?" అంటూ చాలా సాఫ్ట్గా మాట్లాడేవారని ఆమె తెలిపారు. ఇక మాస్ మహారాజా రవితేజ గురించి రీమా సేన్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. రవితేజ తనకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరని ఆమె స్పష్టం చేశారు. ‘అదృష్టం’ , ‘వీడే’ చిత్రాలలో రవితేజతో కలిసి నటించిన రీమా.. ఆయనతో ఉన్న బాండింగ్ గురించి చెప్తూ, "రవితేజ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఆయనతో నాకు చాలా గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది"








