
హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్లోబల్ లెవెల్‌ లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. రాయదుర్గంలో ఇవాళ టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం ధర ఏకంగా రూ.204 కోట్లు పలికింది. రాయదుర్గంలోని ప్లాట్ నంబర్ 4 లో మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్‌ కు వేలంపాటలో ఏకంగా రూ. 1,000 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. ఈ భూములను వంశీరామ్ బిల్డర్స్ సంస్థ సొంతం చేసుకుంది.రెండు రోజుల క్రితం ఇదే ఏరియాలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం ధర ఏకంగా రూ.237 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సత్వ నాలెడ్జి సిటీ పక్కనే రెండు రహదారులను కలిపే విధంగా ఉన్న ఈ భూమి వల్ల రూ. 1490 కోట్ల రూపాయలు టీజీఐఐసీకి వచ్చింది. రెండు విడతల్లో 11.38 ఎకరాలకు నిర్వహించిన భూవేలం వల్ల టీజీఐఐసీ ఖజానాకు మొత్తం రూ. 2500 కోట్లకు పైగా ఆదాయం లభించింది. రాయదుర్గం ఐటీ కారిడార్ లో భూముల కోసం పెట్టుబడిదారులు, సంస్థలు తీవ్ర పోటీ పడుతున్న తరుణంలో భూముల ధరలు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ లో రాయదుర్గం ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్‌ లీయెస్ట్ ఏరియాగా నిలిచింది. హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ కు అవకాశాలు పెరగడం, రాయదుర్గం, నార్సింగి ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక ప్రస్తుతం రాయదుర్గం ఏరియాలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పరిసరప్రాంతాల్లో హెచ్‌ ఎండీఏ అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. అలాగే శామీర్‌ పేట్‌ ఔటర్ రింగ్‌ రోడ్డును కలుపుతూ ప్యారడైజ్‌ నుంచి

