translateexpand_more

Rcb News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 11:31 am
ఐపీఎల్ 2026 సీజన్ హైలెట్స్.. ఈ 7 వీడియోలు తప్పక చూడండి

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IPL 2026 Top Viral Moments: ఐపీఎల్ 2026 సీజన్ అద్భుతంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 75 పరుగుల నాటౌట్‌గా నిలిచి ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు. కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా, వైభవ్ సూర్యవంశి 'ప్లేయర్ ఆఫ్ ది సీజన్'గా ఎంపికయ్యారు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో ఆద్యాంతం అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఏడు విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే రీతిలో హిట్ వికెట్ అవ్వడం అభిమానులకు చాలా కాలం గుర్తిండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. క్రికెట్ చరిత్రలో కూడా ఇలా ఎన్నడూ జరగలేదు. ఐపీఎల్‌లో మొత్తం మూడుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. క్వాలిఫయర్ 1లో ఆర్‌సీబీపై, క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి వికెట్లను తాకింది. దీంతో బ్యాట్‌కు చేయికి పట్టి కట్టించి ఆడించాలంటూ రకరకాల మీమ్స్‌ వైరల్ అయ్యాయి. — Sanjeev । సంజీవ్ 🇮🇳 (@sanjusayz) May 30, 2026 విరాట్ కోహ్లీ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఎప్పుడు దూకుడుగా ఉంటాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్‌తో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీతో ట్రావిస్ హెడ్ కరచాలనం చేయసేందుకు ప్రయత్నించినా.. కోహ్లీ అతను నిరాకరించాడు. ట్రావిస్ హెడ్ భార్యపై కూడా కోహ్లీ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేశారు. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ సమయంలో అంపైర్‌తో విరాట్ కోహ్లీ సరదా పని అందరిని నవ్వించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం మైదానంలోకి రాగానే కోహ్లీ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు.. అంపైర్ చేతికి తన టోపీని ఇచ్చాడు. మొదటి ఓవర్ నిజంగా కోహ్లీ వేస్తాడా అని అంపైర్ ఆశ్చర్యపోగా.. నిజానికి అంపైర్‌ను సరదాగా ఆటపట్టించాడు. కోహ్లీ, అంపైర్ మధ్య జరిగిన ఈ వీడియో వైరల్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు సృష్టించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 28 బంతుల్లో 97 పరుగులతో ఉన్న సమయంలో భారీ షాట్ ఆడేందుకు యత్నించి వికెట్ కోల్పోయాడు. ఆ బంతి బౌండరీకి వెళ్లిపోయి ఉంటే 29 బంతుల్లో సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవాడు. వైభవ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినా.. తీవ్రంగా నిరాశ చెందాడు. సీజన్‌కు ముందు గేల్ 30 బంతుల రికార్డును బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన వైభవ్.. రికార్డుకు చేరువగా వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ తరువాత కృనాల్ పాండ్యా కాలర్‌ను నికోలస్ పూరన్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ ఏం జరగలేదు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో అలా సరదగా పూరన్ కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి లక్నో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలక్ట్రిక్ సిగరేట్ తాగడం ఈ సీజన్‌లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందించి.. పరాగ్‌పై చర్యలు తీసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఆటతీరును కనబర్చింది. నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్.. ఎలిమినేటర్‌ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. క్వాలిఫైయర్-2 గుజరాత్‌పై వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా.. రాజస్థాన్ ఓటమిపాలు కావడం అభిమానులను బాధించింది. ఐపీఎల్ 2026లో మనీష్ పాండే పట్టిన క్యాచ్‌కు బెస్ట్ అవార్డు లభించింది. అయితే ఈ రేసులో బార్ట్‌లెట్ పట్టిన క్యాచ్ కూడా పోటీలో నిలిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను దాటుతున్న బంతిని పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాలిలోనే పట్టుకుని.. దాన్ని లోపలికి విసిరాడు. వెంటనే బార్ట్‌లెట్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను అక్కడే డగౌట్‌లో చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చూసి షాక్ అయ్యారు.

10TV Telugu02 Jun, 09:34 am
కోట్ల ప్రైజ్ మ నీని ఆర్ సీబీ ఆట గాళ్లు ఎలా పంచుకుంటారు? భువ నేశ్వ ర్ కుమార్

RCB : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజేత‌గా నిలిచింది. విజేత‌గా నిలిచినందుకు ప్రైజ్‌మ‌నీ కింద ఆర్‌సీబీకి 20 కోట్ల మొత్తం ల‌భించింది. ఈ మొత్తాన్ని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటారు అన్న విష‌యం పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంది. ఇక ఇదే విష‌యాన్ని మిస్ట‌ర్ నాగ్స్ ఆర్‌సీబీ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను అడిగాడు. 17 ఏళ్ల సీజ‌న్ల పాటు క‌ప్పు కోసం నిరీక్షించిన ఆర్‌సీబీ ఎట్ట‌కేల‌కు 18వ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచింది. అదే ఉత్సాహంలో 19వ సీజ‌న్‌లోనూ క‌ప్పును ముద్దాడింది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబైఇండియ‌న్స్ తరువాత వ‌రుస‌గా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జ‌ట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. RCB bench players : ఛాంపియ‌న్ జ‌ట్టులో భాగ‌మై.. ఒక్క మ్యాచ్ ఆడ‌ని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు.. వేలంలో కోట్ల వ‌ర్షం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించిన త‌రువాత మైదానంలో ఆర్‌సీబీ ఆట‌గాళ్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ స‌మ‌యంలోనే ఆర్‌సీబీ డిజిట‌ల్ హోస్ట్ మిస్ట‌ర్ నాగ్స్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప‌లువురు ఆట‌గాళ్లను ఇంట‌ర్వ్యూలు చేశాడు. Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. ఇక భువ‌నేశ్వ‌ర్ కుమార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం 20 కోట్ల ప్రైజ్‌మ‌నీని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటార‌ని మిస్ట‌ర్ నాగ్స్ అడిగాడు. ఇందుకు భువీ ఎంతో తెలివిగా స‌మాధానం ఇచ్చాడు. న‌గదును ఎలా పంచుకుంటారు అనే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, దాని గురించి తెలుసుకోవ‌డానికి త‌న‌కు ఎంతో ఆస‌క్తిగా ఉంద‌ని స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎలాంటి వివాదాంలో ఇరుక్కోకుండా భువీ చాలా చ‌క్క‌గా చెప్పాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

10TV Telugu02 Jun, 08:59 am
ఛాంపియ న్ జ ట్టులో భాగ మై.. ఒక్క మ్యాచ్ ఆడ ని ఆర్ సీబీ ఆట గాళ్లు..

RCB bench players : ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి వ‌రుస‌గా రెండో సారి ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్, ర‌జ‌త్ పాటిదార్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్ వంటి ఆట‌గాళ్లు జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. మెగా వేలంలో ఆర్‌సీబీ మొత్తం 24 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. వీరిలో 15 మంది క‌నీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. మిగిలిన 9 మంది ఆట‌గాళ్ల‌కు ఈ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు. అయిన‌ప్ప‌టికి కూడా వీళ్ల‌కు పూర్తి సీజ‌న్ ఫీజు అంటే మెగా వేలంలో ఎవ‌రిని ఎంత మొత్తానికి కొనుగోలు చేశారో అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్‌ను ఆర్‌సీబీ 5 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. అయితే.. ఈ సీజ‌న్‌కు ముందు అత‌డు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌ప్పుకున్నాడు. అయిన‌ప్ప‌టికి కూడా ఆర్‌సీబీ అత‌డిని విడుద‌ల చేయ‌లేదు. మ‌రో ఆట‌గాడిని తీసుకులేదు. దీంతో అత‌డు ఆర్‌సీబీలో భాగంగానే ఉన్న‌ట్లు. *IPLలో 5 టీమ్స్ లో ఆడిన ప్లేయర్.. టీమిండియాకు ప్రాతినిధ్యం.. ఇప్పుడు ఏకంగా మంత్రి.. మంగేష్ యాద‌వ్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ మంగేష్ యాద‌వ్ ను ఆర్‌సీబీ వేలంలో 5.20 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. భువ‌నేశ్వ‌ర్ కుమార్, రసిఖ్ సలాం దార్ వంటి పేస‌ర్లు అద్భుతంగా రాణిస్తుండ‌డం, కూర్పులో భాగంగా మంగేష్ యాద‌వ్ కు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం రాలేదు. నువాన్ తుషారా.. శ్రీలంక పేస‌ర్ నువాన్ తుషారాను ఆర్‌సీబీ 1.60 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. ఫిట్‌నెస్ స‌మ్య‌స‌లు, జ‌ట్టు కూర్పు కార‌ణంగా అత‌డు తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ప్లేఆఫ్స్‌కు ముందు అత‌డి స్థానంలో ఇంగ్లాండ్ పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌ను ఆర్‌సీబీ తీసుకుంది. జోర్డాన్ కాక్స్‌.. ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అయిన జోర్డాన్ కాక్స్‌ను ఆర్‌సీబీ వేలంలో 75లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అత‌డు బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ఉన్నారు. టీమ్ఇండియా ఆట‌గాడు జితేశ్ శ‌ర్మ ప్ర‌తి మ్యాచ్ తుది జ‌ట్టులో ఉండ‌డంతో జోర్డాన్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవ‌కాశం రాలేదు. స్వ‌ప్నిల్ సింగ్‌.. స్పిన్న‌ర్ స్వ‌ప్నిల్ సింగ్‌ను ఆర్‌సీబీ 50ల‌క్ష‌ల‌కు అట్టిపెట్టుకుంది. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మలు ఉండ‌డంతో స్విప్నిల్‌కు తుది జ‌ట్టులో ఆడే ఛాన్స్ రాలేదు. విక్కీ ఓస్త్వాల్‌.. అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టిన భార‌త స్పిన్ ఆల్‌రౌండ‌ర్ విక్కీ ఓస్త్వాల్ ను 30 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. విరాట్ కోహ్లీ, ప‌డిక్క‌ల్‌, జితేశ్, వెంక‌టేశ్ అయ్య‌ర్ వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉండ‌డంతో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు. *Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. స‌త్విక్ దేశ్వాల్‌.. దేశవాళీలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన లెగ్ స్పిన్న‌ర్ స‌త్విక్ దేశ్వాల్‌ను 30 లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. కూర్పు కార‌ణంగా అత‌డికి తుది జ‌ట్టులో చోటు రాలేదు. విహాన్ మ‌ల్హోత్రా.. భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుకు చెందిన విహాన్ మ‌ల్హోత్రాను 30ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. అయితే.. ఆల్‌రౌండర్‌కు ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసే అవ‌కాశం రాలేదు. క‌విష్క్ చౌహాన్‌.. యువ ఆల్‌రౌండ‌ర్ క‌నిష్క్ చౌహాన్‌ను 30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. ఇత‌డికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు.

TV9 Telugu02 Jun, 01:24 am
ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్ పై నిషేధంతోపాటు జరిమానా

Tim David Suspended: ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ మహా ఆనందంలో ఉన్న ఆర్సీబీ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో దురుసు ప్రవర్తన కారణంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అంపైర్‌పై ఆగ్రహం: అసలేం జరిగిందంటే? అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 31, ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, ఇన్నింగ్స్ 10వ ఓవర్ వద్ద టిమ్ డేవిడ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. మైదానంలో విధుల్లో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్‌ను అత్యంత కోపంగా, ప్రమాదకర రీతిలో విసిరాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా సాగిన ఈ ప్రవర్తన సాక్షాత్తూ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. బీసీసీఐ నిబంధనావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లు లేదా ఇతర అధికారులపై బంతిని కానీ, వాటర్ బాటిళ్లు, ఐస్ బ్యాగ్‌ల వంటి ఇతర క్రీడా పరికరాలను కానీ కోపంతో విసరడం తీవ్రమైన నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు గాను మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు. భారీ జరిమానా.. వచ్చే ఏడాది ఒక మ్యాచ్‌పై నిషేధం.. ఈ దురుసు ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ, టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో ఏకంగా 50 శాతం కోత విధిస్తూ జరిమానా విధించింది. దీనితో పాటు అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను చేర్చింది. మ్యాచ్ అనంతరం టిమ్ డేవిడ్ కూడా తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షను స్వీకరించాడు. అయితే, ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో టిమ్ డేవిడ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. ఈ సీజన్‌లో ఇది అతనికి మూడవ తప్పు. గతంలో ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి, రాయ్‌పూర్‌లో అదే జట్టుతో జరిగిన 54వ మ్యాచ్‌లో రెండోసారి అతను నిబంధనలను ఉల్లంఘించాడు. అంతేకాకుండా, ధరమ్‌శాలాలో పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన తర్వాత ఆ జట్టు యజమాని ప్రీతి జింటా ముందే శృతిమించి సంబరాలు చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్ మొత్తం మీద ఐదు డీమెరిట్ పాయింట్లు రావడంతో, వచ్చే ఏడాది (ఐపీఎల్ 2027) జరగబోయే మొదటి మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించింది. ఈ సీజన్‌లో టిమ్ డేవిడ్ ప్రదర్శన.. మైదానంలో ప్రవర్తన ఎలా ఉన్నా, ఈ సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 188.27 స్ట్రైక్ రేట్‌తో 305 పరుగులు చేశాడు. ముఖ్యంగా బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 17 బంతుల్లో 24 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఈ వివాదాన్ని పక్కన పెడితే, ఆర్సీబీ సాధించిన విజయం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి, మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. రసిఖ్ సలామ్ అద్భుత బౌలింగ్‌తో గుజరాత్‌ను కట్టడి చేయగా, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ సిక్సర్‌తో మ్యాచ్ ముగించడంతో స్టేడియం మార్మోగిపోయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త రికార్డు లిఖించింది. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Andhra Jyothy02 Jun, 01:07 am
ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్ పై సస్పెన్షన్ వేటు

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్</span></strong>: ఐపీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై వేటు పడింది. టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించి.. 2 డీమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో వేసింది. దీంతో వచ్చే సీజన్‌లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ నిషేధం ఎదుర్కోనున్నాడు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో వికెట్ పడిన అనంతరం టిమ్ డేవిడ్ ఆగ్రహంతో ఐస్ బ్యాగ్‌ను అంపైర్ నితిన్ మీనన్ వైపు విసిరినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా తేలింది. ఈ నిబంధన ప్రకారం ప్లేయర్ లేదా మ్యాచ్ అధికారుల వైపు ప్రమాదకరంగా క్రికెట్ సామగ్రి లేదా ఇతర వస్తువులను విసరడం నేరంగా పరిగణిస్తారు. తన తప్పును టిమ్ డేవిడ్ అంగీకరించడంతో పాటు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన శిక్షను స్వీకరించాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తంగా 5 పాయింట్లకు చేరింది. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. ఫలితంగా టిమ్ డేవిడ్ ఐపీఎల్ 2027లో ఆర్సీబీ తరఫున లేదా తాను ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ తరఫున ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/virat-kohli-anushka-sharma-crazy-dance-during-rcb-ipl-2026-title-celebrations-srav-1528722.html"><strong>విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/rcb-victory-parade-update-franchise-issues-important-message-to-fans-after-ipl-2026-title-srav-1528712.html"><strong>ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం</strong></a></p>