translateexpand_more

Talliki Vandanam News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu31 May, 11:05 am
తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే

Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. ఈ ఏడాది తల్లికి వందనం అమలుకు చంద్రబాబు సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కీలక ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. జూన్ 12వ తేదీ కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్ డేటాబేస్ లో చేర్చాలి. లేదంటే తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా ఇద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకొస్తారు. ఇక, ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేయాల్సి

Oneindia Telugu31 May, 06:03 am
తల్లికి వందనంపై కీలక అప్డేట్..! ఈసారి డబ్బుల జమకు ఇలా

ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం (Talliki Vandanam) పథకం కింద రూ.13 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ముందుగా పాఠశాలల నుంచి విద్యార్దుల ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం .. వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే నిధుల విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. తల్లీ వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను ఇప్పటికే సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. సచివాలయాల్లోని ల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWES) ఈ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో (Beneficiary Management Portal) అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌసోల్డ్ డేటాబేస్లో చేర్చాలి. లేనిపక్షంలో తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాలి. విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ఉపయోగించి వారిద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకువస్తారు. ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే .. క్షేత్రస్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి, సరైన రిమార్కులు నమోదు చేస్తారు. విద్యార్థి మరియు తల్లికి ఒకే ఐడీ నంబర్ ఉంటే సదరు ఐడీ నంబర్ ను సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి, రెండో వ్యక్తి యొక్క అసలైన ఐడీ వివరాలను సేకరించి అప్డేట్ చేస్తారు. ఈ పరిశీలన ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. డేటా వెరిఫికేషన్ సకాలంలో,

10TV Telugu02 Jun, 12:30 am
తల్లికి వందనం.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి.. సింపుల్ ప్రాసెస్

Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. మరి తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుందో లేదో, అర్హులో కాదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. bm-sgsw.ap.gov.in/ సైట్‌లోకి వెళ్లాలి. అందులో స్కీమ్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇయర్ లో ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఆధార్ లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లబ్ధిదారు సమాచారం కనిపిస్తుంది. అందులో ఏమైనా తప్పులుంటే సచివాలయాల్లో సంప్రదించాలి. ఇక, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9,668 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్‌ 12నే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది సర్కార్. ఈ ఏడాది కూడా అదే తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తుండగా.. ఇందులో తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తున్నారు. మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిమిత్తం వాడుతున్నారు. తల్లికి వందనం స్కీమ్ లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా, మొబైల్ కి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. కుటుంబ సభ్యుల మ్యాపింగ్‌ కూడా కీలకమే. అర్హులైన వారు బ్యాంకుకి వెళ్లి ఖాతా స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ఒకదానితో ఒకటి లింకై ఉండాలి. Also Read: మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్‌డేట్ చేయండి!