
Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. ఈ ఏడాది తల్లికి వందనం అమలుకు చంద్రబాబు సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కీలక ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. జూన్ 12వ తేదీ కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్ డేటాబేస్ లో చేర్చాలి. లేదంటే తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా ఇద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకొస్తారు. ఇక, ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేయాల్సి

