translateexpand_more

Tirupati News News

Latest updates from Telugu Digital news sources.

Vaartha01 Jun, 06:13 pm
ఘంటసాలకు పుష్పాంజలి

Ghantasala Fans Tribute: తన మధుర గానామృతంతో దశాబ్దాల పాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావును స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని స్థానిక వీవీ మహల్ రోడ్డు (VV Mahal Road) లో ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద సోమవారం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. Read Also: APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ ఘంటసాల వెంకటేశ్వరరావుపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలతో ఆయన అభిమానులు ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల ఒకటో తారీఖున వీవీ మహల్ రోడ్డులోని ఘంటసాల విగ్రహాన్ని మంచి నీటితో పవిత్రంగా శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాంజలి ఘటించడం వీరి ప్రత్యేకత. ఇందులో భాగంగానే జూన్ 1వ తేదీ (సోమవారం) నాడు విగ్రహాన్ని శుద్ధి చేసి, పూలమాలలు వేసి భక్తిపూర్వకంగా అర్చించారు. ఈ సందర్భంగా ఘంటసాల అపర అభిమాని అయిన వెంకట్రావును రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు, సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఘంటసాల భౌతికంగా మనకు దూరమైనా ఆయన పాడిన పాటలు, పద్యాలు ప్రతి తెలుగు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. భావితరాలకు ఆయన సంగీత వారసత్వాన్ని, జ్ఞాపకాలను అందించడానికే ప్రతి నెల ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంస్మరణ పూజా కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ తో పాటు సంస్థ సభ్యులు, ప్రముఖులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, చిత్రపు హనుమంతరావు పాల్గొన్నారు. అలాగే ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పోలే జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీచర్ తిరుమలయ్య, గోవిందు, పురోహితుడు సురేష్ స్వామి, తులసి రామ్ నాయుడు, రామకృష్ణ మొదలియార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని గానగంధర్వునికి పుష్పాంజలి సమర్పించారు. Rayilapur Fire Accident: రాయిలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం! Tirupati Raxaul Express:తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Sai Sudha Play School: తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం! APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ TTD Donation:టీటీడీకి రూ.11 లక్షల విరాళం అందించిన దుబాయ్ దాతలు! Janasena: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతి సుంకం రద్దు చేయడంతో భారతీయ వస్త్ర పరిశ్రమ షేర్లు భారీగా... జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతోంది. ఎప్పుడూ... “బడి పిలుస్తోంది” అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, ప్రతి చిన్నారి విద్య హక్కును... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా... దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై... ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం... ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ జూలియానా (జూలీ) తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా... తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక అద్భుతమైన తీపికబురు అందించింది. రాష్ట్రంలో... మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో “ఏబీసీడీ...

Andhra Jyothy30 May, 01:00 am
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

<p><strong><span style="color: #e62828">తిరుపతి: </span></strong>తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/ttd_22f412c49a.jpg" alt="ttd.jpg" width="1280" height="720"><strong>బుధవారం హుండీ ఆదాయం:</strong> రూ.3.80 కోట్లు</p><p><strong>గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు:</strong> 74,569</p><p><strong>తలనీలాలు సమర్పించినవారు: </strong>46,292</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: rgb(175, 24, 195)">ఈ వార్తలు కూడా చదవండి:</span></strong></p><p><a rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/ap-proposes-nift-in-amaravati-and-pm-mitra-textile-park-in-kuppam-cm-chandrababu-meets-union-minister-1528104.html">అమరావతిలో నిఫ్ట్‌, కుప్పంలో పీఎం మిత్రా పార్క్‌</a></p><p><a rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/deputy-cm-pawan-kalyan-launches-swachh-godavari-action-plan-to-make-godavari-pollution-free-ahead-of-pushkaralu-1528106.html">కాలుష్యం నుంచి గోదావరికి విముక్తి</a></p><p style="text-align: start"><strong>Read Latest&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong>&nbsp;And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong>&nbsp;And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/international"><strong>International News&nbsp;</strong></a><strong>And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/"><strong>Telugu News</strong></a></p>

Eenadu24 May, 01:21 pm
కాలినడకన తిరుమల చేరుకున్న రామ్మోహన్‌ నాయుడు దంపతులు

- తిరుమల: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు దంపతులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. - కుమారుడు శివాన్‌ ఎర్రన్నాయుడి పుట్టువెంట్రుకల మొక్కు సందర్భంగా సతీమణి శ్రావ్యతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. - అలిపిరి మెట్ల మార్గంలో ఉదయం 11 గంటలకు నడక ప్రారంభించిన రామ్మోహన్‌నాయుడు దంపతులు..

Andhra Jyothy31 May, 01:07 am
టీటీడీకి విద్యుత్ బస్సు విరాళం

ఢిల్లీలోని నయతి సంస్థ అధినేత్రి నీరా రాడియా శనివారం ఉదయం టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఒలెక్ర్టా (ఎలక్ట్రిక్‌) బస్సును అందజేశారు. తిరుమల, మే 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని నయతి సంస్థ అధినేత్రి నీరా రాడియా శనివారం ఉదయం టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఒలెక్ర్టా (ఎలక్ట్రిక్‌) బస్సును అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ బస్సును తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు.

Andhra Jyothy23 May, 11:49 pm
కానిస్టేబుల్‌ హత్యకు న్యాయవాది కుట్ర

- Home » Crime » Tirupati Constable Conspiracy Case: Lawyer Booked Over Alleged Plot Against Police Officer in Alipiri ABN , Publish Date - May 24 , 2026 | 05:19 AM ఓ కానిస్టేబుల్‌ను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణల... - తిరుపతి(నేరవిభాగం), మే 23(ఆంధ్రజ్యోతి): ఓ కానిస్టేబుల్‌ను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో తిరుపతి పోలీసులు ఓ న్యాయవాదిపై కేసు నమోదు చేశారు. - అలిపిరి సీఐ రామకిశోర్‌ కథనం ప్రకారం..

Oneindia Telugu30 May, 01:30 am
శ్రీనివాసుడు సదా తోడుగా ఉన్నాడన్న భావన కలిగించే తిరునామధారణ

తిరు అంటే శ్రీ, నామం అంటే తిలకం. తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిరునామాన్ని శుభసూచికంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రతీక.&amp;nbsp;తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు మనకు తోడుగా, అండగా ఉన్నాడన్న భావన కలుగుతుంది. సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలగుతారు.ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి భక్తిసంప్రదాయాన్ని పెంచేందుకు టీటీడీ భక్తులకు తిరునామధారణ చేయిస్తోంది.&amp;nbsp;తిరునామంలో ఎర్రటికాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంత మంది భక్తులు భుజాలు, ఛాతిపైన, వీపుపై కింది భాగాన తిరునామం ధరిస్తారు. భక్తులు కనుబొమల మధ్య నుంచి నుదుటిపై వరకు ధరిస్తారు.నుదుటన గల ఆగ్నేయచక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడుదృష్టి పడకుండా ఉంటుందని భక్తుల నమ్మకం.&amp;nbsp;తిరునామం కోసం నామకోపు, ఎర్రసింధూరం వినియోగిస్తున్నారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరు భక్తుల అభిప్రాయం. తిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారుచేసిన కప్పు, మూడు నామాల ముద్రను ఉపయోగిస్తారు.శ్రీవారి తిరుమణికాప్పుశ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు (ఆభరణాలు తొలగించే) సమయంలో నేత్రాలు భక్తులకు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూంటుంది. ఈ నామాన్ని తిరుమణికాప్పు అంటారు. దీనికోసం 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.తిరునామ సేవ..తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రవేశ మార్గం, శ్రీవాణి దర్శన ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో సర్వ దర్శనం భక్తులకు, అదేవిధంగా గొల్ల మండపం, రామ్ భగీచా- 3, బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, సుపథం, వరాహస్వామివారి ఆలయం, నాలుగు

Sakshi27 May, 03:54 am
సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నది తమ చిరకాల ఆకాంక్ష అని.. కాపు యువత ఇదే కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజికవర్గం పవన్‌ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదన్నారు. సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా, జోకర్లుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. రానురాను కాపు జాతికి సిగ్గు, పౌరుషం తగ్గిపోతోందన్నారు. టీడీపీ అంటే కమ్మ, జనసేన అంటే కాపు పార్టీ అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ మాత్రం తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా పవన్‌కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాపు కులం లేకపోతే పవన్‌ కళ్యాణ్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేవారా?. పవన్‌ ఈ రోజు మాత్రం రాణించగలిగే వాడా అంటూ ప్రశ్నించారు. కాపు కులం గురించి పవన్‌ తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని అన్నారు. పవన్‌కు ఆ ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కాపులను దూరం పెట్టే పనిలో పవన్‌.. గత ఎన్నికల్లో కాపు జాతి పవన్‌ కళ్యాణ్‌ను సొంతం చేసుకుందని... కానీ పవన్‌ కళ్యాణ్‌ కాపులను దూరం పెట్టే పనిలో ఉన్నారని ఓవీ రమణ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కూడా కేటాయించని ప్రభుత్వంలో కాపు నేతగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు ప్రశ్నించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు, ఎస్సీ, ఎస్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారని, పవన్‌ ఇలాగే ఉంటే రాష్ట్రంలో

Eenadu27 May, 01:02 am
తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3

నిర్మాణానికి అడ్డంకుల తొలగింపుపై తితిదే దృష్టి శిథిలావస్థకు చేరుకున్న ఆర్‌బీ సెంటర్‌లోని నివాసాలు, ప్రతిపాదిత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3 ప్రదేశం తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3 నిర్మాణంపై తితిదే దృష్టి సారిస్తోంది. ఏటేటా భక్తుల రాక పెరుగుతూ రద్దీ రోజుల్లో క్యూ కాంప్లెక్స్‌-1, 2లతో పాటు నారాయణగిరిలోని షెడ్లు నిండిపోయి రింగురోడ్డు మీదుగా శిలాతోరణం, గోగర్భం డ్యామ్‌ వరకు క్యూలైన్‌ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3 అనివార్యంగా తితిదే భావిస్తోంది. ఈ ప్రతిపాదన గతంలో చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే తెరపైకి వచ్చినా, స్థానికుల వ్యతిరేకత కారణంగా అప్పట్లో ముందడుగు పడలేదు. ప్రస్తుతం అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయానికి వెళ్తున్న సుపథం మార్గం వద్ద గతంలో కొన్ని నివాస గృహాలు, పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. ఆలయ విస్తరణలో భాగంగా తితిదే అక్కడి నుంచి 84 కుటుంబాలను తరలించి, వారికి ఆర్‌బీ సెంటర్‌ (పునరావాస కేంద్రం)లో ఇళ్లు నిర్మించి ఇచ్చింది. నామమాత్రపు అద్దెతో 20 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఆ గడువు కూడా ముగిసింది. స్థానికులు తమకు ఆ ఇళ్లపై శాశ్వతంగా యజమాన్య హక్కులు కల్పించాలని అధికారులను సంప్రదించగా ఒప్పుకోలేదు. కొందరు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. క్యూ కాంప్లెక్స్‌-3ని ఇదే స్థలంలో నిర్మించాలని ప్రతిపాదనలు రావడంతో.. ఆర్‌బీ సెంటర్‌లోని నివాసితులు స్థానిక తెదేపా నాయకుడి ద్వారా తమ సమస్యలు, డిమాండ్లను తితిదే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, శాంతారామ్, భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు వారితో మాట్లాడారు. అనంతరం దేవస్థానం ఉన్నతాధికారులతోనూ సమావేశమైన వారు.. తాము ఆర్‌బీ సెంటర్‌ను ఖాళీ చేస్తామని,